అమన్ ప్రీత్ సింగ్ సహా ఐదుగురి అరెస్ట్
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 15 : హైదరాబాద్లో సోమవారం మధ్యాహ్నం జరిగిన ఆపరేషన్లో ఐదుగుర్ని అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి డ్రగ్స్ సీజ్ చేయడంతో పాటు నటి రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడిని కూడా అదుపులోకి తీసుకున్నారు. డ్రగ్స్ తీసుకున్న వారిని సైతం పోలీసులు అదుపులోకి తీసుకుని టెస్టులు జరిపారు. వీరిలో అమన్ ప్రీత్ సింగ్ సహా ఐదుగురికి పాజిటివ్ గా తేలింది. అమన్ ప్రీత్ సింగ్ టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సోదరుడు అని ఈ డ్రగ్స్ కేసు తెలంగాణలో సంచలనం రేపుతుంది. టాలీవుడ్ కు లింక్స్ ఉన్నాయా అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. డ్రగ్స్ గురించి తెలిసినా, ఏమైనా అనుమానం వచ్చినా 8712671111 నెంబర్ కు కాల్ చేసి సమాచారం అందించాలని ప్రజలకు సూచించారు.
బాధ్యత గల పౌరులుగా వ్యవహరించి, డ్రగ్స్ లేని సమాజం కోసం పనిచేద్దామని పిలుపునిచ్చారు. ఈ కేసు వివరాలను రాజేంద్రనగర్ డీసీసీ సీహెచ్ శ్రీనివాసరావు వి•డియాకు వెల్లడించారు. రాజేంద్రనగర్ డీసీసీ మాట్లాడుతూ.. తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో, సైబరాబాద్ ఎస్వోటీ, రాజేంద్రనగర్ పరిధిలోని నార్సింగి పోలీసులు ఓ ప్లాట్పై రైడ్ చేశారు. డ్రగ్స్ కు సంబంధించి మొత్తం ఐదుగుర్ని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. అరెస్టైన వారిలో ఇద్దరు నైజీరియన్లు, ఇద్దరు ఇక్కడి వారు ఉన్నారని చెప్పారు. నిందితుల వద్ద నుంచి 199 గ్రాముల కొకైన్ సీజ్ చేసినట్లు తెలిపారు.
నైజీరియా వాళ్ల పాస్ పోర్ట్ లతో పాటు వారి వద్ద నుంచి రెండు టూవీలర్లు, మొబైల్స్ సీజ్ చేశారు. డ్రగ్స్ రాకెట్ నడిపింది డివైన్ అబుకా సుజి అనే నైజీరియాకు చెందిన వ్యక్తి. ప్రస్తుతం ప్రధాన నిందితుడు పరారీలో ఉన్నాడు. అతడి అనుచరులు ఓనౌహ అలియాస్ జోనా గోమ్స్ అనే మహిళను అరెస్ట్ చేశారు. దూల్ పేటలో డ్రగ్స్ కేసులోనూ అరెస్టై బెయిల్ వి•ద విడుదలైనట్లు తెలిపారు. ఫేక్ పాస్ పోర్ట్ తయారు చేసి డ్రగ్స్ తీసుకొచ్చింది ఈమెనె అని పోలీసులు స్పష్టం చేశారు.