Category తెలంగాణ

పదవీ బాధ్యతలు స్వీకరించిన వీహెచ్

హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 14 : రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు(బీసీ సంక్షేమం)గా ఇటీవల నియమితులైన వి.హనుమంతరావు(వీహెచ్) డాక్టరు బి.ఆర్.అంబేడŠ్కర్ సచివాలయంలో గురువారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. పలురు పార్టీ నేతలు, అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయనకు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు పుష్పగుచ్ఛం అందజేసి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.…

విద్య ఎవరి సొత్తు కాదు

– తెలంగాణ రైజింగ్‌లో ప్రతీ విద్యార్థి భాగం కావాలి – క్రీడలు, యువజన సంక్షేమ శాఖ మంత్రి వాకిటి హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 14 : విద్యా దదాతి వినయం, వినయాద్యాతి పాత్రతాం అంటే విద్య వినయాన్ని ఇస్తుంది.. వినయం వ్యక్తిని గొప్పవాడిని చేస్తుందని ప్రతి ఒక్కరూ గ్రహించాలి అని క్రీడలు, యువజన సంక్షేమ శాఖ…

తప్పు చేస్తే ఎంతటివారైనా శిక్షార్హులే

– భగీరథ్ విషయంలో వెనకడుగు లేదు : మంత్రి సీతక్క మహబూబాబాద్, మే13 : భగీరథ్ కేసులో కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడా తాత్సారం చేయలేదని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. ఫిర్యాదు అందిన వెంటనే పోలీసులు పోక్సో కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన కారణంగా కేసు నమోదు చేయడంలో ఒక్క…

దోపిడీ నేపాలీ ముఠా కోసం గాలింపు

హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 13 మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా జవహర్ నగర్ ఠాణా పరిధిలో నేపాలీ దోపిడీ దొంగలు రెచ్చిపోయిన ఘటనపై పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. కౌకూరు గోల్ఫ్ ఎనక్లేవ్లో విశ్రాంత ప్రొఫెసర్ మురళీధర్ మోహన్, భార్య డాక్టర్ విజయలక్ష్మిని బంధించి 75 తులాల బంగారం, 20 కిలోల వెండితో నిందితులు పరారైన విషయం తెలిసిందే.…

అమూల్ పాల ధరల పెంపు

– లీటర్‌కు రెండు రూపాయలు పెంచిన సంస్థ – అదే బాటలో మదర్ డెయిరీ కూడా హైదరాబాద్, మే 13 : అమూల్ బ్రాండ్‌పై పాల ఉత్పత్తులు విక్రయించే గుజరాత్ కో ఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ పాల ధరలను పెంచింది. లీటరుకు రూ.2 చొప్ప్పున పెంచుతూ నిర్ణయం తీసుకుంది. గురువారం నుంచి పెరిగిన ధరలు…

పోక్సో కేసును కులానికి ఆపాదించే యత్నం

– ఇది కుల సమస్య కాదని గుర్తించాలన్న గంగుల హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,మే13: ‌కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ ‌కుమారుడు సాయి భగీరథ్‌ ‌విషయంలో బీఆర్‌ఎస్‌ ‌భాధితురాలి పక్షాన ఉందని మాజీ మంత్రి గంగుల కమలాకర్‌ అన్నారు. తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్‌ ‌పార్టీ నేతల ఒత్తిడితోనే కేంద్ర…

బండి భగీరథ్ అరెస్టు తప్పదు

– ఆయనను రక్షించాల్సిన అవసరం మాకు లేదు – మీడియాతో పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 13 : పోక్సో కేసులో ఆరోపణలు రాగానే అరెస్టు చేయాలని.. చట్టం ప్రకారం నడుచుకోకపోతే ఇబ్బందులు తప్పవని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. బుధవారం ఇక్కడ మీడియాతో చిట్‌చాట్ మాట్లాడుతూ కేంద్ర…

సాధారణ శ్వాస.. సులభంగా మాట

– కేర్ హాస్పిటల్స్ హైటెక్ సిటీలో అరుదైన శ్వాసనాళ చికిత్స – మూసుకున్న శ్వాసనాళాన్ని తెరిచి మళ్లీ శ్వాస, మాట సామర్థ్యం కల్పన – అడ్వాన్స్‌డ్ రిజిడ్ బ్రోంకోస్కోపీ, సిలికాన్ స్టెంట్‌తో విజయవంతమైన చికిత్స హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 13 : వెన్నెముక శస్త్రచికిత్స తర్వాత నెలలతరబడి శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిపడుతూ సరిగా మాట్లాడలేని 60…

ఇద్దరు డ్రైవర్ల సజీవ దహనం

తిరుమలాయపాలెం/ఖమ్మం, ప్రజాతంత్ర, మే 12: ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం మేకల తండా శివారులో మంగళవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఏకలవ్య నర్సరీ సమీపంలో వరంగల్ -ఖమ్మం ప్రధాన రహదారిపై ఎదురెదురుగా వస్తున్న రెండు లారీలు ఢీకొనడంతో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఒక లారీ ఆలుగడ్డ లోడుతో వస్తుండగా మరో లారీ బొగ్గు…