– ఏర్పాట్లు పూర్తి చేసిన పంచాయతీరాజ్ శాఖ
– మొదటి దశలో 7,449 కి.మీ రహదారుల నిర్మాణం
– ‘హ్యామ్’తో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం: మంత్రి సీతక్క
హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 15: హైబ్రిడ్ యాన్యుటీ మోడ్ (హ్యామ్) ప్రాజెక్టు అమలుతో గ్రామీణ రహదారి సదుపాయాలు మరింత బలోపేతం అవుతాయని, దాంతోపాటు గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మరింత బలపడుతుందని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క తెలిపారు. ఈ ప్రాజెక్టు పంచాయతీరాజ్ రోడ్ల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అత్యంత ప్రతిష్ఠాత్మక కార్యక్రమం అని పేర్కొన్నారు. హ్యామ్ ప్రాజెక్టుల కోసం టెండర్ నోటిఫికేషన్ ఈ శుక్రవారం విడుదల కానుందని, టెండర్ ప్రక్రియ పూర్తయిన వెంటనే పనులు ప్రారంభమవుతాయని వెల్లడిరచారు. ఫేజ్-1లో 17 ప్యాకేజీల కింద, 96 నియోజకవర్గాల పరిధిలో మొత్తం 2,162 రహదారులు (7,449.50 కి.మీ పొడవుతో) నిర్మించనున్నామని తెలిపారు. హ్యామ్ ప్రాజెక్టు ద్వారా తెలంగాణ గ్రామీణ రహదారులు కొత్త దశలోకి వ్రేశిస్తాయని, జాతీయ, అంతర్జాతీయ రహదారి నిర్మాణ సంస్థలు ఈ టెండర్లలో పాల్గొనాలని సూచించారు. ఈ విధానంలో ప్రాజెక్ట్టు వ్యయానికి 40% ప్రభుత్వమే నిర్మాణ దశలో చెల్లిస్తుండగా మిగిలిన 60% మొత్తాన్ని కాంట్రాక్టర్లు బ్యాంకుల ద్వారా సమీకరిస్తారు. రహదారుల నిర్మాణం పూర్తయిన తర్వాత పదిహేనేళ్లపాటు నిర్వహణ బాధ్యత కూడా కాంట్రాక్టర్లదే అవుతుంది. ఈ ప్రాజెక్టును మూడు దశల్లో అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఫేజ్-1 కోసం టెక్నో ఎకనామిక్ ఫీజిబిలిటీ స్టడీని పూర్తి చేశారు. ప్రతీ నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు, ఎంపీల ప్రతిపాదనలకనుగుణంగా ప్రతిపాదిత పనులను పంచాయతీరాజ్ ఇంజనీర్లు ఎంపిక చేశారు. కేబినెట్ ఇప్పటికే పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖ ప్రతిపాదనలు ఆమోదించింది. ప్రభుత్వం 17 ప్యాకేజీలుగా పీఆర్ ఇంజనీరింగ్ విభాగం సర్కిళ్లవారీగా పరిపాలనా అనుమతి మంజూరు చేసింది. ప్రాజెక్టు మొత్తం అంచనా వ్యయం రూ.6,294.81 కోట్లు కాగా దీనికి ఆర్థిక అనుమతి మంజూరైంది. టెండర్ ప్రక్రియను ప్రారంభించేందుకు పంచాయతీరాజ్ ఇంజనీర్-ఇన్-చీఫ్ జోగారెడ్డి అన్ని ఏర్పాట్లు ర్తిచేశారు. అదే రోజున పేపర్ నోటీసు ద్వారా టెండర్ నోటిఫికేషన్ విడుదల చేసి టెండర్ ప్రక్రియ పూర్తైన వెంటనే పనులు ప్రారంభమయ్యేలా అవసరమైన చర్యలు చేపట్టినట్లు ఆయన తెలిపారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





