Category Shoba

‘వర్ణ’మాల!

మెరుపు తీగెలు “మీకు కులం లేకపోతే హగ్ చేసుకోండి!” అని పేపరు బోర్డుమీద రాసి పట్టుకు నిలబడిందో పదేళ్ళ పాప. ఆమె పక్కనే మరో యిద్దరు ఆడపిల్లలు. బహుశా ముగ్గురూ స్నేహితులు కావచ్చు, వాళ్ళు కూడా అవే మాటలున్న తెల్లకాగితాలు పట్టుకు నిలబడివున్నారు. ఎండ తీవ్రంగానే వుంది. తీవ్రంగానే మేమూ వున్నామన్నట్టు చెమటలు పోస్తూ పట్టుదలగా ఆ…

ఆయన పలుకే.. కోటి రతనాల వీణ

dhasarathi

వాక్యం ఆలోచనలో పుడుతుంది. కానీ అది జీవితంతో మమేకమై రచనలో నిలబడుతుంది. చిన్నవాక్యాలే ప్రపంచాన్ని మార్చాయి. ‘నినాదం’ ఒకగొంతులో మొదలవుతుంది క్రమంగా అది ప్రజలగుండెల్లో నినదిస్తుంది. ఎందుకంటే నినాదం మామూలుది కాదు. అది అగ్నికణం దాన్ని పలికితే ప్రపంచం వెలిగిపోతుంది. ఒక నినాదం ఎగిసి మనసును తాకుతుంది, ఆ మనసు లక్షలగుండెలను మేల్కొలుపుతుంది. అప్పుడే అది…

రాగల..!

ఏ ముడి ఎక్కడ చిక్కుబడునో ఏ ముడి ఎక్కడ విడుబడునో రాగల కాలం నిర్ణయించేనా ఏ మేఘం ఎక్కడ వర్షించేనో ఏ మేఘం ఇంకెక్కడ ఘర్జించునో రాగల ఋతువు నిర్ణయించునా ఏ పూవు ఏ దైవ పూజకో లేదా మరే ఊరేగింపుకో ఏ స్నేహం ఏ తీరానికో ఏ ప్రేమ ఏ బలిదానానికో రాగల అక్కున…

అమ్మ విసిరిన రాయి

“రేపు వచ్చినప్పుడు, మీకు అత్యంత ప్రియమైన ఒక వస్తువును తీసుకురండి.” శిల్పటీచర్ అన్నారు. “ఏదైనా తీసుకురావచ్చా?” కిరణ్ అడిగాడు. అది విని పిల్లలు నవ్వారు. అదంతే, అతను ఏదైనా అడిగితే పిల్లలు నవ్వుతారు, అతని తర్వాతి సందేహం కూడా వాటిలో ఒకటి అవుతుంది. ఆ విషయం శిల్ప టీచర్ కి కూడా తెలుసు. “అలాంటివేమీ తీసుకురావద్దు.…

భారత కార్మికోద్యమ పితామహులు

“భారతదేశంలో కార్మికుల కోసం స్థాపించబడిన మొదటి ట్రేడ్ యూనియన్ ఇది. దీని ద్వారా లోఖండే మరియు ఆయన మిత్రులు మిల్లు కార్మికులను ఏకం చేశారు. 1884లో వేలాది మంది కార్మికులతో బొంబాయిలో భారీ బహిరంగ సభ నిర్వహించి, బ్రిటిష్ ప్రభుత్వానికి ఒక డిమాండ్ పత్రాన్ని సమర్పించారు.”   ఫూలే, లోఖండే మరియు సత్యశోధక సమాజ్ పోరాటం ప్రపంచవ్యాప్తంగా…

పొద్దుపొడుపై

నిన్నటివరకు తలెత్తి నిలిచిన మనిషి రాజ్యాలు నేడు తలవంచి తలలేని దేహాలై మిగిలి పోయాయెందుకో నేల పొరల్లో దాగిన విత్తనం భూమిని చీల్చుకుంటూ అడ్డుగా నిలిచిన మట్టిని తొలుస్తూ అంకురమై నిటారుగా విజయగర్వంతో తలెత్తటం ప్రకృతి సహజధర్మం స్వేచ్ఛగా నీలాకాశంలో రెక్కలల్లార్చుకుంటూ ఆకాశమే హద్దుగా ఎగిరే విహంగాలను రాకాసి గద్దలు అన్యాయంగా రెక్కల్ని తుంచేస్తూ కబళిస్తుంటే…

నిశ్శబ్దంలో నిక్షిప్తమైన విశ్వం

చెమ్మ :  వారాల ఆనంద్ తెలంగాణ కవిత్వమంటే ఒకప్రాంతపు కవిత్వం మాత్రమేకాదు అది ఒకసమాజపు చరిత్ర, పోరాటం, అస్తిత్వాన్వేషణ. ఇక్కడి కవిత్వం మట్టివాసనతో, సామాజిక చైతన్యంతో, భావోద్వేగ గాఢతతో ప్రత్యేకంగా ధ్వనిస్తుంది. ప్రధానంగా తెలంగాణ కవిత్వం పోరాటస్వరంతో గుర్తించబడుతుంది. ప్రాంతీయ అసమానతలు, దోపిడీ, అన్యాయాలపై ఈ కవిత్వస్వరం పలుకుతుంది. ఇక్కడ కవిత నినాదంగా, ఆయుధంగా మారింది. ఇదే ప్రధానస్వరూపం. ప్రాంతీయ అస్తిత్వం మరో కీలకలక్షణం.…

రక్తరేఖ!

   మెరుపు తీగెలు “ఏమిటిది?” భక్తుల్ని అడిగాడు మారు రూపంలో వున్న యీశ్వరుడు. “గీత!” అన్నాడొకడు. “ముళ్ళకంచె” అన్నాడొకడు. “ఊరికి హద్దు!” అన్నాడొకడు. “దేశానికి సరిహద్దు!” అన్నాడొకడు. “కావచ్చు. కాని మనుషుల మధ్యలో యెందుకు?” అర్థంకాలేదు యీశ్వరుడికి. “వాళ్ళు వేరు… మేం వేరు” చెప్పాడొకడు. “ఏ దేవుడు చెప్పాడు?” అడిగాడు మారు రూపంలో వున్న అల్లా.…

చింతల చేను చింత తీరింది – 2

(గత సంచిక తరువాయి భాగం) బండికి పిలుపులు రావటం మొదలైన వెంటనే తొలుత వచ్చినవాడు ఏలుమలై. అతని పొలంలో మూడుగంటలు పనిచేసినందుకు గుణశేఖరుడికి మూడువేలు ఇచ్చాడు. ఎంతో సంబరపడ్డాడు గుణశేఖరుడు. అంతలోనే వచ్చాడు పుట్టారెడ్డి. తానే ఎలుమలైకి చెప్పటం వలన, గుణశేఖరుడికి మూడువేలు వచ్చాయని, దానికిగాను పదిశాతం కమిషన్ ఇవ్వాలని డిమాండ్ చేసి డబ్బులు పట్టుకెళ్తాడు…