అంకెల గారడీతో మళ్లీ మళ్లీ మోసం!

ఆదాయం పెరిగినా అభివృద్ధి శూన్యం 

 కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌ కేటాయింపుల తీరుపై సర్వత్రా విమర్శలు
కేంద్ర ప్రభుత్వ ఆదాయంలో పెరుగుదల 14.5 శాతం మేర ఉండగా, వ్యయంలో పెరుగుదల 5.94 శాతం మాత్రమే!  పెరిగిన ఆదాయాన్ని ఆర్థిక కార్యకలాపాల విస్తరణకు ఉపయోగిస్తే  యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. కానీ, ఈ బడ్జెట్లో ఆ మొత్తాన్ని జిడిపిలో ఆర్థికలోటు తగ్గించే అంకెల విన్యాసం వైపు మళ్లించారు. ఇది కార్పొరేట్లను, అంతర్జాతీయ ఫైనాన్స్‌ పెట్టుబడిదారులను సంతృప్తపరిచే చర్యే తప్ప దేశ ప్రజలకు దోహదపడేది కాదు. ఆర్థిక సంఘం ద్వారా రాష్ట్రాలకు  జరిపే నిధుల కేటాయింపు బిజెపి హయాంలో అంతకంతకు కుదించుకుపోతోంది. 2022 బ్జడెట్‌తో పోలిస్తే ఈసారి ఏకంగా రూ.40 వేల కోట్లకు ఎగనామం పెట్టేశారు! ప్రతిపక్షాల ఏలుబడిలో ఉన్న రాష్ట్రాలకు  మరింత ద్రోహం చేయటానికి ఇది దారి తీయొచ్చు! ప్రభుత్వరంగంలోని రూ.50 వేల కోట్ల మేర వాటాల ఉపసంహరణకు ప్రతిపాదించటం మరీ దారుణం.  ఈసారి కూడా కేటాయింపుల్లో తీరని ద్రోహం జరిగింది. గొప్ప సాయం అందిస్తున్నట్టు ప్రసంగంలో ప్రవచించినా, నిజంగా చూపిన ప్రేమ శూన్యం.
ఎపి విభజన చట్టంలోని ఏ ఒక్క హావిరీని నెరవేర్చటానికి నిర్ధిష్టమైన ప్రస్తావన కానీ, కేటాయింపులు కానీ చేయలేదు. రాజధాని నిర్మాణానికి రూ.15 వేల కోట్ల నిధులను అంతర్జాతీయ ద్రవ్య సంస్థల ద్వారా రుణం తీసుకోవ టానికి సాయపడతామని చెప్పారే కానీ, గ్రాంటుగా ఒక్క రూపాయి కూడా విదిలించలేదు. ఈ అప్పును ఎవరు చెల్లిస్తారో, వడ్డీని ఎవరు భరిస్తారో స్పష్టత లేదు. అప్పు ఇప్పించటమే ఒక ఘనమైన సహాయం అని కేంద్రం మభ్యపెట్టదలిస్తే అది రాష్ట్ర ప్రజలతో క్రూర పరిహాసమే! పోలవరం ప్రాజెక్టు గురించి గొప్ప ప్రస్తావనలు చేసినా, నిధుల కేటాయింపు విరీద కానీ, నిర్వాసితులకు పునరావాసం విరీద కానీ ఒక్క మాటా లేదు. విశాఖ రైల్వే జోనూ, కడప స్టీలు ఫ్యాక్టరీ ఊసే లేదు. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రయివేటీకరించ బోమని ఆ మధ్య కేంద్ర మంత్రి కుమారస్వామి విశాఖలో కుంటి తుడుపు ప్రకటన చేశారు కానీ, ఈ బ్జడెట్లో అలాంటి భరోసా ఏవిరీ ఇవ్వలేదు. వెనకబడిన జిల్లాలకు సహాయం జాబితాలో ప్రకాశంను కూడా కలపటం హర్షించదగ్గదే కానీ, కొద్దిపాటి విదిలింపు నిధులతో ఒరిగేదేవిరీ ఉండదు. ఈ బ్జడెట్‌ ద్వారా రాష్ట్రానికి  మేలు జరిగిపోయినట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ హర్షం వ్యక్తం చేయడం తొందరపాటే అవుతుంది. విభజన హావిరీలను అమలు జరపటం కేంద్ర ప్రభుత్వ బాధ్యత. రాజధాని నిర్మాణానికి, పోలవరం పూర్తికి, ఇతర అభివృద్ధి కార్యక్రమాలకూ తగినన్ని నిధులు పొందటం మన హక్కు. గట్టిగా అడిగి, పోరాడి సాధించాలి. లేదంటే ఇలాంటి ప్రసంగాల ప్రహసనాలతో, అంకెల గారడీలతో మళ్లీ మళ్లీ మోసపోతూనే ఉంటాం.
రాష్ట్ర విభజన జరిగి, పదేళ్లు గడిచిపోయాక కూడా ‘అన్ని హావిరీలూ అమలు చేస్తా’మన్న దగ్గరే బిజెపి ప్రభుత్వం ఆగిపోవటాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించకూడదు.నిస్సిగ్గుగా..నిర్లజ్జగా తెలంగాణ పట్ల చూపిన వివక్ష గురించి ఎంత తక్కువగా చెప్పుకుంటే అంత మంచిది. నిజంగానే మోదీ  తెలంగాణ పట్ల కక్షసాధింపు చాటుకున్నారు. ఒక్క పైసా కూడా కేటాయింపులు లేకుండా కొన్ని రాష్ట్రాలను  నిర్లక్ష్యం చేశారు. బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం చేశారు. ఇందులో నూటికినూరు శాతం నిజం. కేవలం ఎన్‌డిఎ భాగస్వామ్య రాష్ట్రాలకు  మాత్రమే మేలు కలిగేలా తీసుకున్న నిర్ణయాలు సరికాదు. నిజానికి తెలంగాణ లేదా ఏ రాష్ట్రం అభివృద్ది చెందినా అది దేశం అభివృద్దికిందకే లెక్క. కానీ అలాంటి ప్రతిపాదనలు తెలంగాణ విషయంలో ఏవిరీ జరగలేదు. సిఎం రేవంత్‌, మంత్రులు పలుమార్లు దిల్లీ  చుట్టు తిరిగి వినతిపత్రాలు సమర్పించినా.. సున్నా చూపారు. కేంద్ర ఆర్థిక శాఖామంత్రి నిర్మలా సీతారామన్‌ మంగళవారం పార్లమెంటులో ప్రవేశపెట్టిన బడ్జెట్‌ ఎలా ఉన్నా తెలంగాణకు మాత్రం తీవ్ర అన్యాయం చేశారు. కీలకమైన రంగాలు వేటికీ ఘనమైన కేటాయింపులు జరపలేదు. ఎన్నో ఆశలతో ఇచ్చిన వినతిపత్రాల ను చిత్తు కాగితాల కింద మార్చినట్లుగా కనిపిస్తోంది. తెలంగాణకే కాదు దేశం మొత్తం విరీద కేటాయింపులు సరిగా లేదు. పేదలను గట్టెక్కించే ప్రయత్నాలు జరగలేదు. ధరలు ఎలా తగ్గించాలో చెప్పలేదు.
ధరల పెరుగుదలకు కారణమై, సామాన్యుల ద్కెనందిన జీవితాన్ని అతలాకుతలం చేస్తున్న ద్రవ్యోల్బణాన్ని అరికట్టటానికి ఏ చర్యలూ ప్రకటించలేదు. ఈ దశాబ్ది ఆఖరికి పదికోట్ల ఉద్యోగాలు సృష్టిస్తామని ఘనంగా పేర్కొన్నా..అందుకు తగిన కార్యాచరణ, నిధుల కేటాయింపూ కనపడలేదు. ఉపాధి అనుసంధాన ప్రోత్సాహక పథకం యజమానులకు ఉపయోగపడుతుంది తప్ప ఉద్యోగార్థులకు పెద్దగా మేలు చేసేది కాదు. యువతకు న్కెపుణ్య శిక్షణ ఇస్తారు సరే ..శిక్షణానంతరం ఉద్యోగాల మాటేమిటి? అన్న ప్రశ్నకు ఈ బడ్జెట్‌లో సమాధానం లేదు. ఏడాదికి సగటున 78.5 లక్షల ఉద్యోగాలు సృష్టిస్తామన్న మంత్రి మాట, గతంలో మోడీ ఇచ్చిన ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాల హావిరీ వలె డొల్లగా కనిపిస్తోంది. వ్యవసాయ రంగం విరీద, ఉపాధి హావిరీ పథకం విరీదా గతంలో మాదిరిగానే మోడీ ప్రభుత్వపు చిన్నచూపు కొనసాగింది. ఎరువుల రాయితీని మరింత తగ్గించి, రైతులకు ద్రోహం చేసింది. గ్రావిరీణ వ్యవసాయ కార్మికులకు, చిన్న రైతులకు, పేదలకు తోడ్పాటునిస్తున్న ఉపాధి హావిరీకి నిధులను తెగ్గోసింది. గత బడ్జెట్‌తో పోలిస్తే ఎరువుల సబ్సిడీలో రూ.24,894 కోట్లు, ఆహార సబ్సిడీలో రూ.7082 కోట్లు కోత పెట్టారు.
పాలమూరు-రంగారెడ్డి విషయం పేర్కొనలేదు. ట్రిపుల్‌ ఆర్‌ గురించి మాట్లాడలేదు. ఓ పక్క ఎపికి రూ.15 వేల కోట్ల నిధులతో పాటు రోడ్లు, మౌలిక వసతుల కల్పనకు, రాజధాని నిర్మాణానికి నిధులు కేటాయించిన కేంద్రం, కానీ, తెలంగాణకు మాత్రం హైదరాబాద్‌ టు బెంగళూరు పారిశ్రామిక కారిడార్‌ అభివృద్ధికి అత్తెసరు నిధులు మినహా మరెక్కడా తెలంగాణకు నిధుల ప్రస్తావన తీసుకురాలేదు. అయితే, హైదరాబాద్‌ టు బెంగళూరు పారిశ్రామిక కారిడార్‌కు సంబంధించి తెలంగాణ పరిధి 150 కిలో విరీటర్లు మాత్రమేనని దీనివల్ల పెద్దగా ఒనగూరే ప్రయోజనం లేదని కాంగ్రెస్‌ నాయకులు ఆరోపిస్తున్నారు. దీంతోపాటు తెలంగాణలోని ప్రాజెక్టులను జాతీయ హోదా ఇవ్వాలని 10 ఏళ్లుగా విజ్ఞప్తి చేస్తున్నా ఆ దిశగా కేంద్రం పట్టించుకోకపోవడం దారుణం. గత 10 ఏళ్లుగా ప్రతి బడ్జెట్‌లోనూ తెలంగాణకు కేంద్రం మొండిచేయి చూపుతుండడం, ఈబడ్జెట్‌ లో కూడా తెలంగాణకు మళ్లీ భంగపాటే ఎదురుకావడంతో సిఎం రేవంత్‌, మంత్రులు, దీనిపై అసెంబ్లీలో చర్చించాలని నిర్ణయించారు. ప్రస్తుతం తెలంగాణ నుంచి బిజెపికి చెందిన ఎంపిలను ఎనిమిది మంది గెలిపించినా రాష్టాన్రికి నరేంద్ర మోడీ నిధులు కేటాయించకపోవడం దారుణం కాక మరోటి కాదు. కేంద్ర బడ్జెట్‌లో ఎపి రీ ఆర్గన్కెజేషన్‌ యాక్ట్‌ను ప్రత్యేకంగా ప్రస్తావించినా ఆ యాక్ట్‌ పరిధిలోకి వచ్చే తెలంగాణ పేరు మాత్రం ప్రస్తావించలేదు. బిజెపి మిత్రపక్ష పార్టీల్కెనా జేడీయూ, టిడిపి పాలిత రాష్టాల్క్రెన బీహార్‌, ఎపిలకే ప్రధాని మోడీ అధిక ప్రాధాన్యత ఇచ్చారు.
ఎపి రాజధాని అమరావతి నిర్మాణానికి రూ.15 వేల కోట్లు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అందజేయనుండగా రాబోయే సంవత్సరాల్లో మరింత ఆర్థిక సాయం అందిస్తామని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ పేర్కొన్నారు. దీంతోపాటు పోలవరం ప్రాజెక్టును వీల్కెనంత త్వరగా పూర్తి చేయడానికి తమవంతు కృషి చేస్తామని కేంద్రం హామి ఇవ్వడం విశేషం. రీ ఆర్గన్కెజేషన్‌ యాక్ట్‌ ప్రకారం ఎపిలో పారిశ్రామిక అభివృద్ధికి తోడ్పాటునందించడంతో పాటు విశాఖపట్నం టు చెన్న్కె ఇండస్టియ్రల్‌ కారిడార్‌కు తోడ్పాటు, కొప్పర్తి, ఓర్వకల్లు ఇండస్టియ్రల్‌ కారిడార్‌కు అవసరమైన మౌలిక వసతులన్నీ కల్పిస్తామని కేంద్రం హావిరీ ఇచ్చింది. ఆర్థిక ప్రగతికి దోహదం చేసే పారిశ్రామిక కారిడార్లకు ఈ ఆర్థిక సంవత్సరంలో అదనపు నిధులు కేటాయిస్తామని కేంద్రం సూచించింది.  తెలంగాణలోని వెనుకబడిన జిల్లాలకు ఇదే కోటాలో నిధులు ఇవ్వాలని విజ్ఞప్తి చేసినా కేంద్రం మాత్రం కనీసం పట్టించుకోలేదు.
తెలంగాణ లోని ఏ ఒక్క ఇరిగేషన్‌ ప్రాజెక్టుకు నిధులు కేటాయించకపోగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును ఏఐబిపి స్కీంలోకి తీసుకోకపోవడం విశేషం. తెలంగాణకు ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వం ఒక్క కొత్త ప్రాజెక్టును ప్రకటించలేకపోవడం విశేషం. సిరిసిల్లకు మెగా పవర్‌ లూమ్‌ క్లస్టర్‌, వరంగల్‌ టెక్స్‌ ట్కెల్‌ పార్కుకు ఆర్థిక సాయం, తెలంగాణలోని ఇండస్టియ్రల్‌  కారిడార్లకు నిధులు ఇవ్వడంలో కేంద్రం మొండిచేయి చూపింది. ఎపి రీ ఆర్గన్కెజేషన్‌ యాక్ట్‌లో హావిరీ ఇచ్చిన బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, కాజీపేట కోచ్‌ ఫ్యాక్టరీ ప్రస్తావనే లేకపోగా, ములుగు ట్క్రెబల్‌ యూనివర్సిటీకి అదనపు నిధుల అంశంతో పాటు తెలంగాణకు జాతీయ విద్యా సంస్థల కేటాయింపులకు సంబంధించి ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో తీవ్ర అసంతృప్తికి గురిచేసింది. ఈ విషయంలో బిజెపి ఎంపిలు ఆత్మపరిశీలన చేసుకోవాలి. తెలంగాణ కోసం ఏమి చేయదల్చుకున్నారో చెప్పాలి. అవసరమైతే కేంద్రంతో కొట్లాడి తెలంగాణ ఆత్మగౌరవం చాటాలి.
-వడ్డె మారెన్న
(సీనియర్‌ జర్నలిస్ట్‌)
సెల్‌: 900034536

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page