కాళేశ్వరంతో ఎకరాకు కూడా నీరివ్వలేదు

  • దళితుడిని సిఎం చేస్తానని దగా చేసిన కెసిఆర్‌
  • అసెంబ్లీలో హరీష్‌ ‌రావు వ్యాఖ్యలపై మండిపడ్డ మంత్రి కోమటిరెడ్డి

హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,డిసెంబర్‌21: అసెంబ్లీలో కాళేశ్వరం నీళ్లపై  మాజీ మంత్రి హరీష్‌ ‌రావుకు మంత్రి కోమటి రెడ్డి సవాల్‌ ‌విసిరారు. నల్గొండ జిల్లాకు కాళేశ్వం నీరు చేరాయన్నా దానిపై సభలో గందగోళం ఏర్పడింది. దీంతో మంత్రి కోమటి రెడ్డి సభలో మాట్లాడుతూ.. నల్గొండ జిల్లాలో కాళేశ్వరం నీళ్లు ఒక్క ఎకరానికి ఇచ్చినట్లు నిరూపించినా తాను రాజీనామా చేస్తానని మంత్రి అన్నారు. మాజీ మంత్రి హరీష్‌ ‌రావు ఏం మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. చర్చకు రావాలని హరీష్‌ ‌రావు, కేటీఆర్‌ ‌లకు సవాల్‌ ‌విసిరిన కోమటిరెడ్డి వెంకట్‌ ‌రెడ్డి నల్గొండకు నీళ్లు ఎవరు ఇచ్చారో అడగాలని ప్రశ్నించారు. నల్గొండ జిల్లాలో ఎకరాకు కాళేశ్వరం నీళ్లు ఇచ్చారని నిరూపిస్తే రాజీనామా చేస్తానని సవాల్‌ ‌విసిరారు. దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు వల్లే ఏఎంఆర్‌బీ వొచ్చిందని గుర్తు చేశారు.

తన బావ, మామ నల్గొండ ప్రజలను చంపేస్తారా? వాళ్ళని చంపేయండి అని మండిపడ్డారు. సీఎం రేవంత్‌ ‌రెడ్డి మూసీని సరిచేస్తున్నారన్నారు. అందుకు కూడా తన బావ, మామ అడ్డుపడుతున్నారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ ‌రెడ్డి మండిపడ్డారు. కేసీఆర్‌ ‌పాలనలో 24 గంటల కరెంటు ఇవ్వలేదన్నారు. 24గంటల కరెంట్‌ ఇవ్వలేదని లాగ్‌ ‌బుక్స్ ‌తెచ్చి చూపిస్తా అన్నారు. ఎక్సైజ్‌ ‌టెండర్లు ఒక ఏడాది ముందు పెట్టారు.. రూ.2 వేల కోట్లు ముందుగా వసూలు చేశారన్నారు. కేటీఆర్‌ ‌సభను తప్పుదోవ పట్టిస్తున్నారని తెలిపారు. గత ప్రభుత్వంలో కేవలం 14 గంటల కరెంటు మాత్రమే ఇచ్చారన్నారు. నేను సబ్‌ ‌స్టేషన్‌ ‌వెళ్లి చెక్‌ ‌చేశానని తెలిపారు. నేను ఎమ్మెల్యే, ఎంపీగా గత పదేళ్లుగా పని చేశానని సభలో తెలిపారు. కేసీఆర్‌ ‌పాలనలో 24 గంటల కరెంటు ఇవ్వలేదన్నారు. ఎక్సైజ్‌ ‌టెండర్లు 2లక్షలు పెట్టీ రూ.2వేల కోట్లు వసూళ్లు చేశారు? ఆ డబ్బులు ఎక్కడికి వెళ్ళాయో తెలీదన్నారు. తెలంగాణ వొచ్చాక నష్టపోయిన జిల్లా నల్గొండ అని తెలిపారు.

తెలంగాణ వొస్తే దళితున్ని ముఖ్యమంత్రి చేస్తా అన్నారు కేసీఆర్‌ ‌మాట తప్పారని తెలిపారు. హామీల గురించి, మేనిఫెస్టోల గురించి బిఆర్‌ఎస్‌ ‌మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. పదేళ్ల కేసీఆర్‌ ‌పాలన..వందేళ్లు వెనక్కి తీసుకెళ్ళారని కీలక వ్యాఖ్యలు చేశారు. కూలిపోయే ప్రాజెక్టులు మాత్రమే కట్టారన్నారు. ఇంటింటికి నీళ్లు ఇయ్యకపోతే వోట్లు అడుగా అన్నావ్‌ అన్నారు. సిరిసిల్లకు పోదాం ఏ ఇంటికి నీళ్లు వొస్తున్నాయో తెలుస్తుందన్నారు. నల్గొండ జిల్లా సూర్యాపేటకు వెళ్దాం అన్నారు. నాగార్జున సాగర్‌ ‌ప్రాజెక్టు కట్టింది ఎవరు? అని ప్రశ్నించారు. బావ,బామ్మర్దికి నల్గొండ జిల్లాపై కోపం ఎందుకని మండిపడ్డారు. మాకు విషం ఇచ్చి చంపండని మంత్రి తెలిపారు.

ఉచిత విద్యుత్‌ అం‌దించింది కాంగ్రెస్‌.. ‌దాని పేటెంట్‌ ‌హక్కూ కాంగ్రెస్‌దే. బీఆర్‌ఎస్‌ ‌పాలనలో నీళ్లు, విద్యుత్‌.. ఏ ఇవ్వలేదు. వాళ్ల పాలనలో కూలిపోయే ప్రాజెక్టులు కట్టారు. మిషన్‌ ‌భగీరథ ద్వారా నల్లా  నీళ్లు వొచ్చాయని ప్రజలు చెబితే.. మరో సారి వోట్లు అడగం. మిషన్‌ ‌భగీరథలో రూ.50 వేలకోట్లు తినేశారు‘ అని కోమటిరెడ్డి ఆరోపించారు. అయితే మంత్రి ఆరోపణలను బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీష్‌ ‌రావు ఖండించారు. ‘మిషన్‌ ‌భగీరథకు అయిన ఖర్చు రూ.28 వేల కోట్లు. రూ.50 వేల కోట్లు తిన్నారని మంత్రి కోమటిరెడ్డి ఎలా మాట్లాడతారు? మంత్రి వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలి. కాళేశ్వరం ద్వారా నల్గొండ జిల్లాలో 2 లక్షల ఎకరాలకు నీళ్లు అందించాం. నల్గొండలో వైద్య కళాశాల పెట్టింది కేసీఆర్‌. ఉమ్మడి నల్గొండలో యాదాద్రి పవర్‌ ‌ప్లాంట్  ఏర్పాటు చేశాం’ అని హరీష్‌ ‌రావు అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page