పోలీస్ ఇన్ ఫార్మర్ నేపంతో మహిళా మావోయిస్టు హత్య.

భద్రాచలం, ప్రజాతంత్ర, ఆగస్ట్ 21 : మావోయిస్టు పార్టీలో ఉంటూనే పోలీసులకు ఇన్ ఫార్మర్ గా పని చేస్తుందని బంటి రాధాను మావోయిస్టులు బుధవారం నాడు హత్య చేశారు.

ఇందుకు సంబంధించిన లేఖను కూడా మావోయిస్టు పార్టీ ఆంధ్ర, ఒడిస్సా బోర్డర్ స్పెషల్ జోన్ కమిటీ కార్యదర్శి గణేష్ లేఖ విడుదల చేశారు. మావోయిస్టు పార్టీలో అనేక కీలక పదవుల్లో పనిచేసిన రాధా మావోయిస్టులతో మంచిగా ఉంటూ నటిస్తూ పోలీసులకు తమ కార్యకలాపాలపై సమాచారం ఇస్తుందని మావోయిస్టు పార్టీ పక్కా సమాచారం సేకరించినట్లు లేఖలు పేర్కొన్నారు.

పక్క సమాచారం తోనే బంటి రాధాను హత్య చేసినట్లు పేర్కొన్నారు. బంటి రాధ వైద్య వృత్తిలో డిఎంఎల్టి ట్రైనింగ్ అయినట్లు తెలిసింది. మావోయిస్టు పార్టీలో చేరినప్పటి నుండి కీలక పదవులు పనిచేసింది. మావోయిస్టు పార్టీలో ఉంటూనే బంటి రాధ ప్రవర్తన సరిగాలేదని లేఖలో పేర్కొన్నారు. మావోయిస్టు పార్టీలో ఉంటూ మావోయిస్టులతో అసభ్యకరంగా ప్రవర్తిస్తూ ఉండేదని లేఖలో పేర్కొన్నారు. ఈమె ప్రవర్తన రోజురోజుకు శృతిమించినట్లు మావోయిస్టులు చెబుతున్నారు. మావోయిస్టు పార్టీని మోసం చేస్తూ పోలీసులకు మావోయిస్టుల కదలికపై ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తున్న నేపథ్యంలో తమ ఉనికిని కాపాడుకునేందుకు హత్య చేసినట్లు మావోయిస్టు స్పష్టం చేశారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page