సవరించిన అంచనాల మేరకు 4,650 కోట్ల కేటాయింపు
700 మంది ఏఈఈల నియామకం
మరో 1238 ఉద్యోగాలను భర్తీ చేస్తాం..
ప్రాజెక్టుల నిర్మాణాల్లో ప్రతిబంధకంగా భూసేకరణ
భూసేకరణలో ప్రజాప్రతినిధులు భాగస్వాములు కావాలి
శాసన సభలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 19 : వొచ్చే ఐదేళ్లలో కొత్తగా 30 లక్షల ఎకరాలకు సాగునీరు అందిం చాలన్నదే తమ ప్రజాప్రభుత్వం లక్ష్యమని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. రెండేళ్లలో ఎస్ఎల్బిసీని పూర్తి చేస్తామని అందుకు గాను సవరించిన అంచనాలకు అనుగుణంగా రూ.4,650 కోట్లు విడుదల చేసినట్లు ఆయన తెలిపారు. టన్నెల్ బోరింగ్ మిషన్ కు అమెరికా నుంచి అత్యాధునిక యంత్ర సామగ్రి కోసం సహచర మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రభుత్వం తరపున అమెరికాలో పర్యటించి వొచ్చారన్నారు. గురువారం రాష్ట్ర శాసన సభలో జరిగిన ప్రశ్నోత్తరాల సమయంలో సహచర మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో సహా వేముల వీరేశం, కుంభం అనిల్ రెడ్డి, విప్లు బీర్ల ఐలయ్య యాదవ్, ఆది శ్రీనివాస్, మందుల సామ్యోల్, తన్నీరు హరీష్ రావు, పాడి కౌశిక్ రెడ్డి, పల్లా రాజేజేశ్వర్ రెడ్డి, పాయల శంకర్, రామారావు పాటిల్ అడిగిన పలు ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ..
డిరడి ప్రాజెక్ట్ కు కావలసిన నీటి మూలాలపై నెలరోజుల్లో తుది నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపారు బునదిగాని కాలువ, ధర్మారెడ్డిపల్లి కాలువ, పిల్లాయిపల్లి కాలువల నిర్మాణాలకు గాను 294.18 కోట్లను విడుదల చేస్తూ జీవో జారీ చేసినట్లు ఆయన సభకు తెలిపారు. ఈ కాలువల నిర్మాణాలు పూర్తయితే నకిరేకల్, మునుగోడు, భువనగిరి, ఆలేరు, తుంగతుర్తి నియోజకవర్గాల పరిధిలోని 18 మండలాలకు చెందిన 66 వేల ఎకరాలకు సాగు నీరు అందించవచ్చన్నారు. అయిటిపాముల ఎత్తి పోతల పథకానికి సంబంధించిన టెండర్ల ప్రక్రియ పూర్తయ్యిందని, అయితే భూసేకరణ చేపట్టాల్సి ఉందన్నారు. ఈ ఎత్తిపోతల పథకానికి సంబంధించిన భూసేకరణ బాధ్యత స్థానిక ఎమ్మెల్యేవేముల వీరేశం పర్యవేక్షిస్తారని ఆయన తెలిపారు. బ్రాహ్మణవెళ్ళెంల ప్రాజెక్ట్ ను పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. అందులో భాగంగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించిన అంశాన్ని ఆయన గుర్తుచేశారు. సహచర మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్వగ్రామమైన బ్రాహ్మణవెళ్ళెంలలో ఈ ప్రాజెక్టును దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్ రాజశేఖర్ రెడ్డి శంకుస్థాపన చేశారన్నారు. మెయిన్ కాలువలకు అవసరమైన భూసేకరణకు రూ.37 కోట్లు విడుదల చేసినట్లు తెలిపారు.
తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టుకు నీరు
కాంగ్రెస్ ప్రభుత్వం తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టును సేద్యంలోకి తెచ్చేందుకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించుకుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. గత ప్రభుత్వం కోటి 81 వేలు ఖర్చు పెట్టి తక్కువ ఆయకట్టును సేద్యంలోకి తీసుకొచ్చిందని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యతా క్రమంలో ఏ, బి కేటగిరీలో పెండిరగ్ ప్రాజెక్టులు పూర్తి చేసే విధంగా రూట్మ్యాప్ రూపొందించుకుందన్నారు. చనాక-కోరాట ఏ కేటగిరీలో పూర్తి చేయనున్నట్లు పేర్కొన్నారు. శ్రీపాద ఎల్లంపల్లి పెండిరగ్ పనులు పూర్తి చేయడంతో పాటు పిప్లి ఎత్తిపోతల పథకం పూర్తి దేవాదుల పూర్తి చేసేందుకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందన్నారు. భూసేకరణ, ప్రాజెక్ట్ వర్క్ లపై పలుమార్లు సమీక్ష సమావేశాలు నిర్వహించిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు.యుద్ద ప్రాతిపదికన పూర్తి చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. ఇదే ప్రాజెక్ కింద స్టేషన్ఘన్పూర్ నియోజకవర్గ పరిధిలోని నవాబుపేట ఎత్తిపోతల పథకానికి రూ.160 కోట్లు మంజూరు చేసినట్లు ఆయన వెల్లడిరచారు.
బస్వాపూర్ రిజర్వాయర్ పనులు చేపట్టిన గత ప్రభుత్వం భూసేకరణకు నిధులు విడుదల చెయ్యలేదన్నారు. ఆ రిజర్వాయర్ కు సరిపడా భూసేకరణ కోసం 100 కోట్లు అవసరమని కాంగ్రెస్ ప్రభుత్వం రూ.50 కోట్లు విడుదల చేసిందన్నారు. గందమల్ల ప్రాజెక్ట్ కు భూసేకరణ సమస్య ఆటంకంగా మారిందని, దానిని దృష్టిలో పెట్టుకొని 1.5 టిఎంసి కెపాసిటీని తగ్గించి మంజూరుకు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు ఆయన తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లిఫ్ట్ లను మరమ్మతులు చేసి పునరుద్దరిస్తామన్నారు. గడ్డేన్న వాగు లైనింగ్ అంశాన్ని ప్రస్తావిస్తూ నీటి లభ్యత ఉన్న ప్రతీచోట తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టు సేద్యంలోకి తీసుకురావాలన్నదే ప్రభుత్వ సంకల్పమన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మినీ ఎత్తిపోతల పథకాలను రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తుందన్నారు. గత ప్రభుత్వం మేజర్ ఇరిగేషన్, మీడియం, మైనర్ ఇరిగేషన్లను కలపడంతో లేక అవి నిర్వీర్యంగా మరాయన్నారు. అయితే ఎత్తిపోతల పథకాల పరిరక్షణలో ప్రజాప్రతినిధులు, రైతులు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
ఎత్తిపోతల పథకాలకు సంబంధించిన ట్రాన్స్ఫార్మర్లు, ఇతర విద్యుత్ పరికరాలు చోరీకి గురవుతున్నాయని తెలిపారు. దీంతో అటు రైతాంగానికి, ఇటు ప్రభుత్వానికి నష్టం వాటిల్లుతోందని చెప్పారు. గడిచిన పదేళ్లుగా ప్రభుత్వం లిఫ్టులను నిర్లక్ష్యం చేసిందన్నారు. లిఫ్ట్ ల పరిరక్షణకు ఎక్కడా చర్యలు తీసుకోలేదన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే కాలువలు, లిఫ్ట్ ల పరిరక్షణకు ఏకంగా 1800 లష్కర్ ఉద్యోగ నియమకాలు చేపట్టిందన్నారు. అంతేకాకుండా ఏకంగా 687 ఏఈఈ ఉద్యోగాలను భర్తీ చేశామని, మరో 1,238 ఉద్యోగాల భర్తీకి పబ్లిక్ సర్వీస్ కమిషన్ కు అనుమతించామన్నారు. ఎంపికైన 687 ఏఈఈలలో వంద మందికి పైగా ఐఐఐటీ, ఐఐటీ లకు చెందిన వారు ఉండడం నీటిపారుదల శాఖకు గర్వకారణమన్నారు. ముఖ్యంగా ప్రాజెక్ట్ ల నిర్మాణాలలో భూసేకరణ సున్నితమైన సమస్యగా మారిందన్నారు. ప్రాజెక్ట్ లు మొదలు పెట్టిన రోజునే భూసేకరణ జరిపి ఉంటే సమస్యలు ఉత్పన్నంఅయి ఉండేది కాదన్నారు.మొదలు ప్రాజెక్ట్ కు సంబంధించిన పనులు పూర్తి చేసి తరువాత భూసేకరణ ప్రక్రియ మొదలు పెట్టడంతో ఈ సమస్య తలెత్తుతుందన్నారు ఇకపై భూసేకరణ అంశంలో ప్రజాప్రతినిధులు విధిగా భాగస్వాములు కావాలన్నారు.