అసెంబ్లీ సమావేశాలకు కెసిఆర్‌ హాజరు..

  • గవర్నర్‌ ప్రసంగం రోజు.. బడ్జెట్‌ రోజు వొస్తారు
  • వెల్లడిరచిన వర్కింగ్‌ ప్రసిడెంట్‌ కెటిఆర్‌

హైదరాబాద్‌ :  ఈ అసెంబ్లీ సమావేశాలకు బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ హాజరవుతారని ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ తెలిపారు. అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు జరగనున్నాయి. తొలిరోజు ఉభయసభల సభ్యులను ఉద్దేశించి గవర్నర్‌ ప్రసంగిస్తారు. గవర్నర్‌ ప్రసంగానికి కెసిఆర్‌ హాజరవుతారని చెప్పారు. బడ్జెట్‌ ప్రసంగంలోనూ కేసీఆర్‌ పాల్గొంటారని వెల్లడిరచారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా దాసోజు శ్రవణ్‌ ఇవాళ నామినేషన్‌ దాఖలు చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన కేటీఆర్‌.. మీడియాతో చిట్‌చాట్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ.. ఎల్లుండి జరగబోయే అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్‌ హాజరవుతారని తెలిపారు.

తర్వాత కొన్ని కార్యక్రమాలకు కూడా కేసీఆర్‌ వొస్తారని పేర్కొన్నారు. కానీ కేసీఆర్‌ అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాకపోవడమే మంచిదని ఒక కొడుకుగా తన అభిప్రాయమని చెప్పారు. కేసీఆర్‌ స్థాయికి కాంగ్రెస్‌లో ఎవరూ సరిపోరని అన్నారు. వాళ్ల పిచ్చి మాటలు, పనికిమాలిన దూషణలు, కారుకూతలు వినడానికి కేసీఆర్‌ రావద్దనేది కొడుకుగా తన అభిప్రాయమని వివరించారు.బీఆర్‌ఎస్‌ సభకు వరంగల్‌ అనువైన ప్రాంతమని కేటీఆర్‌ తెలిపారు. అన్ని రకాల రవాణా సదుపాయం ఉందని పేర్కొన్నారు. ప్లీనరీ విషయంలో ఇంకా నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. దీనిపై బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ నిర్ణయం తీసుకోవచ్చని స్పష్టం చేశారు. ఎండలు ఎక్కువగా ఉన్నందున రెండు సభలు పెడితే ఇబ్బందని భావించామని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page