యథావిధిగా గ్రూప్‌-1 ‌మెయిన్స్ ఎగ్జామ్‌

సింగిల్‌ ‌బెంచ్‌ ‌తీర్పును సమర్థించిన డివిజన్‌ ‌బెంచ్‌
‌వాయిదా కోరుతూ వేసిన పిటిషన్ల డిస్మిస్‌
‘‌సుప్రీమ్‌’‌ను ఆశ్రయించిన పలువురు అభ్యర్థులు

‌తెలంగాణ గ్రూప్‌ 1 ‌పరీక్ష రాసే అభ్యర్థులకు రాష్ట్ర హైకోర్టు షాక్‌ ఇచ్చింది. గ్రూప్‌ 1 ‌మెయిన్స్ ‌పరీక్షకు హైకోర్టు డివిజన్‌ ‌బెంచ్‌ ‌గ్రీన్‌ ‌సిగ్నల్‌ ఇచ్చింది. పరీక్షలు వాయిదా వేయాలన్న గ్రూప్‌ – 1 అభ్యర్థుల రిట్‌ అప్పీల్‌ను హైకోర్టు డివిజన్‌ ‌బెంచ్‌ ‌కొట్టేసింది. సింగిల్‌ ‌బెంచ్‌ ‌తీర్పును డివిజన్‌ ‌బెంచ్‌ ‌సమర్థించింది. దీంతో ఈ నెల 21 నుంచి 27 వరకు గ్రూప్‌ – 1 ‌మెయిన్స్ ‌పరీక్షలు నిర్వహించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 46 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. 31,383 మంది అభ్యర్థులు గ్రూప్‌ 1 ‌పరీక్షకు హాజరుకానున్నారు. పరీక్ష కేంద్రాలకు 200 టర్ల దూరంలో ఆంక్షలు అధికారులు విధించారు. పరీక్ష కేంద్రాల వద్ద ఐదుగురికన్నా ఎక్కువ మంది గుమికూడరాదని హెచ్చరించారు. ఇదిలాఉంటే.. తెలంగాణ గ్రూప్‌ 1 అభ్యర్థులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. జీ.ఓ. 29ని రద్దు చేయాలని డిమాండ్‌ ‌చేశారు. జీ.ఓ. 29 వల్ల జరిగే నష్టాన్ని ప్రధాన న్యాయమూర్తికి తమ న్యాయవాది వివరించారని విద్యార్థులు చెప్పారు. సోమవారం రోజు మొదటి కేసుగా తీసుకొని విచారిస్తామని సుప్రీంకోర్టు చీఫ్‌ ‌జస్టిస్‌ ‌డీవై చంద్రచూడ్‌ ‌ప్రకటిస్తూ విచారణను వాయిదా వేశారు. జీ.ఓ. 55నే అమలు చేయాలని విద్యార్థులంతా కోరినా.. సీఎం పెడచెవిన పెట్టారని గ్రూప్‌ 1 అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సుప్రీంకోర్టుతో మొట్టికాయలు కొట్టించుకోక ముందే ప్రభుత్వం దిగివచ్చి జీ.ఓ. 29ని రద్దు చేయాలని డిమాండ్‌ ‌చేశారు. హైడ్రా గురించి మాట్లాడుతున్న సీఎం.. జీ.ఓ. 29 వల్ల నష్టపోయే విద్యార్థుల గురించి ఎందుకు స్పందించడం లేదని గ్రూప్‌ 1 అభ్యర్థులు నిలదీస్తున్నారు. హైదరాబాద్‌ అశోక్‌ ‌నగర్‌లో ఇప్పటికే పోలీసులు దాడులు చేస్తున్నారని గ్రూప్‌ 1 అభ్యర్థులు వాపోయారు. గ్రూప్‌ 1 ‌చదివే విద్యార్థులపై దాడులు చేస్తూ.. పోలీస్‌ ‌స్టేషన్‌లో ఉంచి ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. కోర్టు తీర్పు వచ్చే వరకు గ్రూప్‌ 1 ‌మెయిన్స్ ‌రద్దు చేయాల్సిందేనని అభ్యర్థులు డిమాండ్‌ ‌చేస్తున్నారు. తెలంగాణ 2.0 ఉద్యమాన్ని మళ్లీ చూస్తారంటూ రేవంత్‌ ‌సర్కార్‌ను విద్యార్థులు హెచ్చరించారు. జీ.ఓ. 29 గ్రూప్‌ 1 ‌విద్యార్థులకు శాపంగా మారిందన్నారు. సీఎం మొండిగా ఎందుకు వెళ్తున్నారో చెప్పాలన్నారు. రాజ్యాంగాన్ని కాపాడాలని రాహుల్‌ ‌గాంధీ చెప్తుంటేరేవంత్‌ ‌రెడ్డేమో ఆ స్ఫూర్తిని తుంగలో తొక్కేలా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2022లో కేసీఆర్‌ ‌జీ.ఓ. 55 తెచ్చారని.. గ్రూప్‌ 1 ‌లో రిజర్వేషన్లు అమలు అయ్యేలా తీసుకొచ్చారన్నారు. కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం వచ్చాక జీ.ఓ. 29 తీసుకొచ్చారని.. దీని వల్ల గ్రూప్‌ 1 అభ్యర్థులకు నష్టం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టులో న్యాయం జరుగుతుందనే ఆశాభావం ఉందన్నారు. సీఎం రేవంత్‌ ‌రెడ్డి అశోక్‌ ‌నగర్‌ ‌వచ్చి విద్యార్థులతో మాట్లాడి న్యాయం చేయాలని డిమాండ్‌ ‌చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page