ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డికి ప్రధాని మోదీ ఫోన్‌

•ఎస్‌ఎల్బీసీ టన్నెల్‌లో ప్రమాదంపై ఆరా
•పూర్తి స్థాయిలో  సాయం అందిస్తామని హామీ

న్యూదిల్లీ, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 22 : నాగర్‌కర్నూల్‌ ‌జిల్లా దోమలపెంట సమీపంలో ఎస్‌ఎల్బీసీ టన్నెల్‌లో జరిగిన ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ ఆరా తీశారు. ఈమేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డితో ఆయన  ఫోన్‌లో మాట్లాడారు. ఈసందర్భంగా జరిగిన ఘటనకు సంబంధించి పూర్తి వివరాలను ప్రధాని మోదీకి సీఎం రేవంత్‌ ‌రెడ్డి వివరించారు. సొరంగంలో 8 మంది కార్మికులు చిక్కుకున్నారని, వారిని కాపాడేందుకు అవసరమైన సహాయక చర్యలు చేపట్టామని సీఎం రేవంత్‌ ‌రెడ్డి తెలిపారు.

సహాయక చర్యలను మంత్రులు ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారని ప్రధానికి వివరించారు. సహాయక చర్యల కోసం వెంటనే ఎన్డీఆర్‌ఎఫ్‌ ‌టీం ను పంపిస్తామని సీఎంకు చెప్పిన ప్రధాని మోదీ వెల్లడించారు. పూర్తిస్థాయి సహకారం అందించేందుకు కేంద్రప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రధాని మోదీ  హామీ ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page