త్వ‌ర‌లో టూరిజం పాల‌సీ

  • తెలంగాణ‌లో ఎకోటెంపుల్ టూరిజంపై ఫోక‌స్
  • వెల్ల‌డించిన ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి
  • 150 ఎకరాలు.. 25,000 జాతుల మొక్కలు
  • ప్రపంచంలోనే అతిపెద్ద  ఎకో ఫ్రెండ్లీ పార్కును ప్రారంభించిన సీఎం

రాష్ట్రంలో టెంపుల్హెల్త్ఎకో టూరిజం అభివృద్ధి చేయాల్సిన అవసరం ఎంతో ఉంద‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి  అన్నారు.  టెంపుల్ఎకో టూరిజమే రాష్ట్రానికి గుర్తింపుతో పాటు ఆదాయం పెరగడానికి ఉపయోగపడుతుంద‌ని సీఎం తెలిపారు. దేవాలయ దర్శనాలకుఅటవీ సంపదను చూసేందుకు ఇక్కడి నుంచి ఇతర రాష్ట్రాలకు వెళుతున్నాం.  రామప్పవేయిస్తంభాల గుడి లాంటి అద్భుతమైన ఆలయాలు తెలంగాణలో ఉన్నాయి. నల్లమల అడవులుమల్లెల తీర్థం లాంటి ప్రాంతాలు మన రాష్ట్రంలో ఉన్నాయి టెంపుల్ఎకో టూరిజం అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది.

త్వరలో టూరిజం పాలసీని తీసుకురాబోతున్నామ‌ని సీఎం రేవంత్ రెడ్డి వెల్ల‌డించారు.  ఎకో టూరిజాన్ని అభివృద్ధి చేయబోతున్నాం ఎక్స్పీరియం లాంటి ఎకో టూరిజం పార్కును ఇక్కడ అభివృద్ధి చేయడం అభినందనీయం.  రాబోయే రోజుల్లో ఇది అద్భుతమైన పర్యాటక కేంద్రంగా మారనుందన్నారు.  వికారాబాద్ అటవీ ప్రాంతానికి ఒక ప్రత్యేకత ఉంది. త్వరలో వికారాబాద్ ప్రాంతాన్ని ఎకో టూరిజంగా అభివృద్ధి చేయబోతున్నామ‌ని,  రాష్ట్రం ఆలోచనకు అనుగుణంగా రామ్ దేవ్ ఈ పార్క్ ను అభివృద్ధి చేయడం అభినందనీయమ‌ని కొనియాడారు.  రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని ఒక ప్రకృతి వనంగా మార్చాలని భావిస్తోంద‌ని,  వనజీవి రామయ్య లాంటి వారిని మనం ఆదర్శంగా తీసుకోవాల‌ని సూచించారు. ప్రతీ విద్యార్థి తల్లి పేరుతో ఒక మొక్కను నాటించి సంరక్షించేలా కొన్ని విధానాలు తీసుకురాబోతున్నామ‌ని తెలిపారు.


ప్రకృతి ప్రేమికుల కోసం నగర శివార్లలో నిర్మించిన అతిపెద్ద ఎకో ఫ్రెండ్లీ ఎక్స్‌ పీరియం’ పార్క్‌ను ప్రారంభించారు. అంతర్జాతీయ స్థాయిలో రామ్‌దేవ్‌రావు 150 ఎకరాలలో ఏర్పాటు చేసిన పార్కులో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 25 వేల జాతులకు సంబంధించిన మొక్కలు ఉన్నాయి. అర్జెంటీనాఉరుగ్వేమెక్సికోసౌత్‌ అమెరికాస్పెయిన్‌ఇటలీన్యూగినియాఆస్ట్రేలియాథాయ్‌లాండ్‌ఇండోనేషియామలేషియా తదితర దేశాల నుంచి అరుదైన మొక్కలుచెట్లురకరకాల స్టోన్స్‌అందమైన శిలలు సేకరించి గార్డెన్‌ను ఏర్పాటు చేశారు. దీని కోసం సుమారు రూ. 150 కోట్లు ఖర్చు చేశారు.

ఒక్కో శిల్పానికి రూ. 5 లక్షల నుంచి కోటి రూపాయల వరకు ఖర్చు చేశారు. 1,500 మంది కూర్చునేలా ఇండియాలోనే అతిపెద్ద హంపీ థియేటర్‌ను ఏర్పాటు చేశారు. 30 అడుగుల ఎత్తులో 20 స్టెయిన్‌ లెస్‌ స్టీల్‌ శిల్పాలు ఏర్పాటు చేసి వాటిని ఎంతో ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. రూ. 50 కోట్లతో 12 ఎకరాలలో మ్యాన్‌మేడ్‌ బీచ్‌ ఏర్పాటు చేశారు. 40 గదులు, 20 కాటేజీలతో సుందరమైన సహజ రిసార్టు ద్వీపంగా తీర్చిదిద్దారు. పీవెడ్డింగ్‌పోస్టు వెడ్డింగ్‌ఫొటో షూట్‌లకు ఎక్స్‌పీరియంను రామ్‌దేవ్‌రావు ఎంతో శ్రమకోర్చి ఏర్పాటు చేశారు. దేశానికి గర్వకారణంగారాష్ట్ర ప్రతిష్టకు చిహ్నంగాహైదరాబాద్‌కు ఐకానిక్‌గా ఎక్స్‌పీరియం ఉంటుందన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page