ఏడాదిలోనే.. బిఆర్‌ఎస్‌ ‌తప్పిదాలకు భారీ మూల్యం

4.50 లక్షల కుటుంబాలకు
22,500 కోట్లతో ఇందిరమ్మ ఇళ్లు
ఇందిరమ్మ ఇళ్ల యాప్‌ ‌ప్రారంభం..
సువర్ణాక్షరాలతో లిఖించదగినది..

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 05 : ‌రూ.5 లక్షలతో ఇందిరమ్మ ఇల్లు పథకాన్ని లాంఛనంగా ప్రారంభించుకోవడం రాష్ట్ర చరిత్రలో  సువర్ణ అక్షరాలతో లిఖించదగిన రోజు అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. డాక్టర్‌ ‌బిఆర్‌ అం‌బేడ్కర్‌ ‌సచివాలయంలో గురువారం ఇందిరమ్మ ఇళ్ల యాప్‌ ‌ను ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో ఆత్మగౌరవంతో బతుకుతున్నామని.. ఇప్పుడు ఇందిరమ్మ రాజ్యంలో ఐదు లక్షలతో ఇల్లు నిర్మించుకుంటున్నామని ప్రతి ఒక్కరూ సంతోషంతో ఉన్నారని తెలిపారు. నాడు పిసిసి అధ్యక్షుడిగా రేవంత్‌ ‌రెడ్డి భారీ సభలు నిర్వహించారు, సీఎల్పీ నేతగా తాను ఆదిలాబాద్‌ ‌నుంచి ఖమ్మం వరకు పాదయాత్ర చేశానని తెలిపారు. ఈ రాష్ట్రాన్ని  తెచ్చుకున్నదే ఆత్మగౌరవంతో బతకడానికి అని అన్నారు.

ఇందిరమ్మ ఇల్లు కావాలంటూ పెద్ద ఎత్తున ప్రజలు కోరారని.. ఈ రాష్ట్ర ఆస్తులు, వనరులు పదేళ్లుగా దోపిడీ చేస్తున్న ప్రభుత్వాన్ని కూల్చడానికి మీరు ముందుకు రండి అంటూ ప్రతి పేదవాడి గుండె చప్పుడు ఆవేదనతో వినిపించిందని భట్టి విక్రమార్క తెలిపారు. ప్రజలందరి కోరిక మేరకు ప్రజా ప్రభుత్వం ఏర్పడిందని,  మీ అందరి ఆవేదన అర్థం చేసుకొని ఎంతటి ఆర్థిక భారం అయినప్పటికీ ఇందిరమ్మ ఇళ్ల కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు. నాలుగున్నర లక్షల కుటుంబాలకు 22,500 కోట్లతో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ప్రారంభిస్తున్నట్టు తెలిపారు.

రెండు లక్షల వరకు రుణమాఫీ కార్యక్రమంలో భాగంగా 21 వేల కోట్ల నగదును ఒకేసారి రైతుల ఖాతాలో జమ చేశామని పేర్కొన్నారు. మిగులు బడ్జెట్‌తో  బిఆర్‌ఎస్‌ ‌పాలకులకు ప్రభుత్వాన్ని అప్పగిస్తే తమకు 7 లక్షల కోట్ల అప్పుతో ప్రభుత్వాన్ని అప్పగించారని.. వారు చేసిన అప్పులకు 64 వేల కోట్లు వడ్డీలు కడుతున్నామని తెలిపారు. రైతు రుణమాఫీ కింద 21 వేల కోట్ల నగదును రైతుల ఖాతాల్లో జమ చేశామన్నారు. ఇప్పుడు 22,500 కోట్లతో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టామని  అన్నారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం, రూ.500 కే గ్యాస్‌, 200 ‌యూనిట్లలోపు ఉచిత విద్యుత్‌, ‌సన్నధాన్యం సాగుచేసిన వారికి క్వింటాలకు రూ.500 చొప్పున బోనస్‌ ‌చెల్లిస్తున్నామన్నారు.

ప్రభుత్వంపై బురద చల్లే కార్యక్రమం..
కొద్దిమంది వ్యక్తులు తమ ప్రభుత్వంపై కావాలని బురద చల్లే కార్యక్రమం చేపట్టారని వారి మాదిరిగానే మా ప్రభుత్వం ఉండాలని కోరుకుంటున్నారని అన్నారు. తినడానికి సరైన తిండి లేక సంక్షేమ వసతి గృహాల, రెసిడెన్షియల్‌ ‌పాఠశాలల విద్యార్థులు ఇబ్బంది పడుతుంటే గత పది సంవత్సరాలపాటు పాలించిన వారు మెస్‌ ‌ఛార్జీలు ఒక్క రూపాయి కూడా పెంచలేదన్నారు. తమ ప్రభుత్వం ఆ వర్గాల సంక్షేమం కోసం ఒకేసారి 40 శాతం మెస్‌ ‌చార్జీలు పెంచిందని వివరించారు. ఇరుకు గదుల్లో, బిఆర్‌ఎస్‌ ‌నాయకుల ఇళ్లల్లో పిల్లలను కుక్కి.. ఉన్న కొద్ది స్థలంలోనే పడుకోవడం అన్ని కార్యక్రమాలు ఇరుకు గదుల్లోనే జరిగిపోయేవని తెలిపారు. బిఆర్‌ఎస్‌ ‌పాలకులు చేసిన తప్పిదాల మూలంగా వసతి గృహాల విద్యార్థులు మూల్యం చెల్లించుకుంటున్నారని డిప్యూటీ సీఎం విక్రమార్క వివరించారు.

కొద్దిమంది వ్యక్తులు తమ ప్రభుత్వంపై కావాలని బురద చల్లే కార్యక్రమం చేపట్టారని వారి మాదిరిగానే మా ప్రభుత్వం ఉండాలని కోరుకుంటున్నారని అన్నారు. తినడానికి సరైన తిండి లేక సంక్షేమ వసతి గృహాల, రెసిడెన్షియల్‌ ‌పాఠశాలల విద్యార్థులు ఇబ్బంది పడుతుంటే గత పది సంవత్సరాలపాటు పాలించిన వారు మెస్‌ ‌ఛార్జీలు ఒక్క రూపాయి కూడా పెంచలేదన్నారు. తమ ప్రభుత్వం ఆ వర్గాల సంక్షేమం కోసం ఒకేసారి 40 శాతం మెస్‌ ‌చార్జీలు పెంచిందని వివరించారు. ఇరుకు గదుల్లో, బిఆర్‌ఎస్‌ ‌నాయకుల ఇళ్లల్లో పిల్లలను కుక్కి.. ఉన్న కొద్ది స్థలంలోనే పడుకోవడం అన్ని కార్యక్రమాలు ఇరుకు గదుల్లోనే జరిగిపోయేవని తెలిపారు. బిఆర్‌ఎస్‌ ‌పాలకులు చేసిన తప్పిదాల మూలంగా వసతి గృహాల విద్యార్థులు మూల్యం చెల్లించుకుంటున్నారని డిప్యూటీ సీఎం విక్రమార్క వివరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page