- నగర జనాభా దృష్టితో ప్రతిపాదనలు
- కుడా, సంబంధిత అధికారులతో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సమీక్ష
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 24 : వరంగల్ పట్టణాన్ని మరో నగరంగా తీర్చిదిద్దడానికి మాస్టర్ ప్లాన్ తక్షణమే సిద్ధం చేయాలని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అధికారులను ఆదేశించారు. శనివారం డా. బిఆర్ అంబేద్కర్ సచివాలయంలో తన కార్యాలయ సమావేశ మందిరంలో కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ(కుడా) అధికారులు, సంబంధిత శాఖల అధికారులతో వరంగల్ నగర అభివృద్ధిపై సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..హైదరాబాద్ నగరం తర్వాత వరంగల్ పట్టణాన్ని విస్తృత పరచడానికి, పలు అభివృద్ధి పనులు చేపట్టాడానికి తగు మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసేందుకు గతంలో సమావేశాలు నిర్వహించడం జరిగిందని మంత్రి తెలిపారు.
గతంలో ఉన్న 2041 మాస్టర్ ప్లాన్ను 2050 నాటి జనాభాను దృష్టిలో ఉంచుకుని పట్టణంలో అభివృద్ధి పనులు చేపట్టుటకు ప్రతిపాదనలు రూపొందించాలని సూచించారు. ఇందుకు అవసరమైన భూముల సేకరణ చేపట్టాలని ఆయన అన్నారు. ఇప్పటి వరకు కన్సల్టెంట్లు తయారు చేసిన మాస్టర్ ప్లాన్లను మంత్రి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా పరిశీలించి, పలు సూచనలు చేశారు. ఈ సమావేశంలో మున్సిపల్ పరిపాలన ముఖ్య కార్యదర్శి దాన కిషోర్, రోడ్లు భవనాలు శాఖ ప్రత్యేక కార్యదర్శి హరిచందన, కుడా వైస్ చైర్మన్, కమిషనర్ అశ్విని, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ గౌతమ్, కుడా సీపీఓ అజిత్ రెడ్డి, కన్సల్టెంట్లు, అధికారులు పాల్గొన్నారు.
మైనార్టీలు లక్ష్యంగా బుల్డోజ్ చర్యలు
అధికార బిజెపిపై మండిపడ్డ కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే
అధికార బిజెపిపై మండిపడ్డ కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే