Category తెలంగాణ

దిల్లీకి బీఆర్ఎస్ బృందం

– కాళేశ్వరంపై న్యాయవాదులతో సంప్రదింపులు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 20: బీఆ ర్   ఎస్ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు పార్టీ త్రిసభ్య కమిటీ దిల్లీ పర్యటనకు వెళ్లింది. ఈ ప్రతినిధుల బృందంలో మాజీ మంత్రి హరీష్ రావు, మాజీ ఎంపీ వినోద్ కుమార్, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర ఉన్నారు. ఈనెల 22న తెలంగాణ…

ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల ఫీజు గడువు పొడిగింపు

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 20: రాష్ట్రంలో ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షల ఫీజు గడువును ఇంటర్మీడియట్ బోర్డు పొడిగించింది. ప్రథమ, ద్వితీయ సంవత్సరానికి చెందిన రెగ్యులర్ విద్యార్థులతోపాటు, ఫెయిలైన విద్యార్థులు సప్లిమెంటరీ పరీక్షలు రాయడానికి ఫీజు చెల్లింపు గడువును ఈనెల 23వ తేదీ వరకు పొడిగించినట్లు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ కార్యదర్శి ఒక ప్రకటనలో తెలిపారు. 2025-26…

డీఎస్పీ నికత్ జరీన్‌కు డీజీపీ అభినందన

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 20: మంగోలియాలోని ఉలాన్‌బాటర్‌లో ఈనెల 2 నుంచి 12వ తేదీ వరకు జరిగిన ప్రతిష్టాత్మక బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో కాంస్య పతకాన్ని సాధించిన డీఎస్పీ నిఖత్ జరీన్‌ను డీజీపీ బి.శివధర్ రెడ్డి సోమవారం తన కార్యాలయంలో అభినందించారు. అంతర్జాతీయ స్థాయిలో అద్భుత ప్రదర్శన కనబరిచి రాష్ట్ర పోలీస్ శాఖ ప్రతిష్టను ఇనుమడింపజేసిన ఆమెను…

మహిళా లోకానికి కేసీఆర్ క్షమాపణ చెప్పాలి

– మహలక్ష్మి పథకాన్నిరద్దు చేసే దమ్ముందా? – ఉచిత ప్రయాణంపై కేసీఆర్ వ్యాఖ్యలకు మంత్రి సీతక్క ఖండన జయశంకర్ భూపాలపల్లి, ప్రజాతంత్ర, ఏప్రిల్ 20 : ఫ్రీ బస్ పథకాన్ని పనికిమాలినదిగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అభివర్ణించడం దొరతనానికి నిదర్శనమని మహిళా సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క విమర్శించారు. ఉచిత…

ఫార్మా కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం

సంగారెడ్డి, ఏప్రిల్ 20 : సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం గడ్డిపోతారం పారిశ్రామిక వాడలో ఉన్న ఎరిత్రో ఫార్మా కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. షార్ట్ సర్య్కూట్ కారణంగా పెద్ద ఎత్తున మంటలు రేగాయి. ప్లాంట్ లో పొగలు వ్యాపించాయి. దీంతో కార్మికులు భయాందోళనలో బయటకు పరుగులు తీశారు. ఈ ఫార్మా కంపెనీలో మంటలను…

బీఆర్‌ఎస్‌లో జీవన్‌ ‌రెడ్డి ఒక్క రోజు వీఐపినే

– హరీష్‌ ‌రావు దిల్లీ పర్యటనపై అనుమానాలు – ఎంపీ చామల కిరణ్‌ ‌రెడ్డి వ్యాఖ్య హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర, ఏప్రిల్‌20: జీవన్‌ ‌రెడ్డి బీఆర్‌ఎస్‌లో ఒక్క రోజు వీఐపి మాత్రమేనని ఎంపీ చామల కిరణ్‌ ‌రెడ్డి అన్నారు. జీవన్‌ ‌రెడ్డి బీఆర్‌ఎస్‌ ‌లో చేరడం వల్ల‌ లాభం కంటే నష్టమే ఎక్కువని ఎంపీ అన్నారు. సోమవారం మీడియాతో…

పరీక్షల వేళ కట్టుదిట్టమైన భద్రత

– సైబరాబాద్ సీపీ రమేశ్ ఉత్తర్వులు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 20: ఇంటర్, తెలంగాణ ఓపెన్ స్కూల్స్ సొసైటీ పరీక్షల సందర్భంగా సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో కట్టుదిట్టమైన భద్రత పెంచుతూ సైబరాబాద్ సీపీ రమేశ్ కీలక ఉత్తర్వులు జారీ చేశారు. ఈనెల 20 నుంచి 27వ తేదీ వరకు ప్రత్యేక నిబంధనలు అమలు చేస్తున్నట్లు తెలిపారు.…

కేటీఆర్‌దే క్రాస్ బ్రీడ్

– అక్రమ సంపాదనతో అహంకారమని ఎమ్మెల్యే సంజయ్  విమర్శ జగిత్యాల, ప్రజాతంత్ర, ఏప్రిల్ 20: బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌దే క్రాస్ బ్రీడ్ అని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ ఎం.సంజయ్ కుమార్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. జీవన్ రెడ్డి కాంగ్రెస్‌ను వీడి బీఆర్‌ఎస్‌లో చేరబోతున్న సమయంలో తనపై వచ్చిన విమర్శలకు ఆయన తీవ్రంగా స్పందించారు. జగిత్యాలలో…

30 వరకు అజారుద్దీన్ మంత్రి పదవి

– ఈలోగా ఎమ్మెల్సీగా గవర్నర్ ఆమోదించాలి – సీఎం వినతితో గవర్నర్ ఆమోదిస్తారా అన్న ఉత్కంఠ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 20: నిబంధనల ప్రకారం చట్టసభల్లో సభ్యుడు కాని వ్యక్తి మంత్రి పదవి చేపడితే ఆరు నెలల్లో ఎమ్మెల్యే లేదా ఎమ్మెల్సీగా ఎన్నిక కావాల్సి ఉంటుంది. అదే విషయం మైనారిటీ శాఖ మంత్రి అజారుద్దీన్‌కూ వర్తిస్తుంది.…