బీసీలకు చారిత్రక ద్రోహం చేసే కుట్ర

తప్పుడు లెక్కలంటూ ముద్ర వేస్తున్నారు..
లెక్క తేలితే నష్టపోయే శక్తులే వ్యతిరేకిస్తున్నాయి..
•కుట్రలను ఛేదించకపోతే శాశ్వత నష్టం
•బీసీలు సంఘటితంగా కుట్రలను ఎదుర్కోవాలి..
•వందేళ్లలో తేలని లెక్కలను.. వంద శాతం తేల్చాం..
•కుల గణన బీసీలకు కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం ఇచ్చిన ఆస్తి
•రాహుల్‌ ‌గాంధీ ఆదేశాలను తూచా తప్పకుండా పాటించా
•బిసి కులగణనకు చట్టబద్ధత కల్పిస్తాం..
•కాంగ్రెస్‌ ‌బిసి నేతల సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 22 : బీసీ కులగణన సర్వే చేపట్టడం ద్వారా దేశంలోనే చారిత్రాత్మకమైన నిర్ణయాన్ని తమ ప్రభుత్వం తీసుకుందని ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి అన్నారు. కులగణన విషయంలో భవిష్యత్‌లో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలుస్తుందన్నారు. ప్రజాభవన్‌ ‌లో బీసీ నేతలతో ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి సమావేశమయ్యారు. ఇందులో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్‌, ‌మంత్రి పొన్నం ప్రభాకర్‌, ‌మాజీ ఎంపీ వి.హనుమంతరావు, ఎంపీ అనిల్‌ ‌కుమార్‌ ‌యాదవ్‌, ‌బీసీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నాయకులు హాజరయ్యారు.  బీసీ కులగణన, 42శాతం బీసీ రిజర్వేషన్ల అంశంపై చర్చించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి మాట్లాడుతూ.. కుల గణన ఎక్స్ ‌రే లాంటిదని రాహుల్‌ ‌గాంధీ ఆనాడే చెప్పారు. అన్ని రంగాల్లో బీసీలకు సామాజిక న్యాయం జరగాలంటే కులగణన చేయాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు.
తెలంగాణలో అధికారంలోకి రాగానే కులగణన చేసి తీరుతామని రాహుల్‌ ‌గాంధీ భారత్‌ ‌జోడో యాత్రలో మాట ఇచ్చారని గుర్తుచేశారు.  గాంధీ కుటుంబం మాట ఇస్తే తప్పదని,  ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్రంలో కులగణన నిర్వహించామన్నారు.  మన నాయకుడు ఇచ్చిన మాటను తూచా తప్పకుండా అమలు చేస్తున్నాం. దేశంలో ఏ రాష్ట్రం కూడా ఇలాంటి సాహసం చేయలేదు. కానీ తెలంగాణలో రాహుల్‌ ‌గాంధీ ఇచ్చిన మాట ప్రకారం అందరి భాగస్వామ్యంతో కులగణన నిర్వహించాం. సమగ్ర కుటుంబ సర్వే తప్పుల తడకగా ఉందనే.. ఆనాటి ప్రభుత్వం లెక్కలను బయటపెట్టలేదు.
అందుకే ఆ వివరాలను ఎన్నికల కోసం వాడుకున్నారు తప్ప.. ప్రజల కోసం వినియోగించలేదు. కానీ మేం చిత్తశుద్ధితో కులగణనపై మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేశాం. చట్టపరంగా ఇబ్బందులు కలగకుండా ప్లానింగ్‌ ‌డిపార్ట్ ‌మెంట్‌ ‌కు అప్పగించి కులగణను పకడ్బందీగా నిర్వహించాం. ఇంటింటికి ఎన్యుమరేటర్లను పంపి సమాచారాన్ని సేకరించాం. సేకరించిన సమాచారాన్ని తప్పులు దొర్లకుండా ఎన్యూమరేటర్‌ ‌సమక్షంలో కంప్యూటరీకరించాం. తప్పులు జరిగాయని మాట్లాడుతున్న వారు ఏ బ్లాక్‌ ‌లో ఎక్కడ తప్పు జరిగిందో చెప్పాలి. ఈ ప్రక్రియను తప్పుబట్టడం ద్వారా మొత్తం వ్యవస్థను కుప్పకూల్చేందుకు కుట్రలు చేస్తున్నారు. ఇది బీసీ సోదరులు గమనించాలని సీఎం రేవంత్‌రెడ్డి కోరారు.
స్వతంత్ర భారతంలో ఇదే తొలిసారి..
స్వతంత్ర భారత దేశంలో ఎవరూ ఇప్పటి వరకు కులగణన చేపట్టలేదని ముఖ్యమంత్రి  రేవంత్‌ ‌తెలిపారు.  ఒక్కసారి బీసీల లెక్క తెలిస్తే వాటా అడుగుతారనే దీనిపై కొందరు కుట్ర చేస్తున్నారు. ఎంతోకాలంగా ఉన్న డిమాండ్‌ ‌ను మనం విజయవంతంగా ముందుకు తీసుకెళుతున్నాం.  బీజేపీలో ఉన్న ఒకటి రెండు ఆధిపత్య సామాజిక వర్గాలకు నష్టం జరుగుతుందనే వాళ్లు కులగణనపై కుట్రలు చేస్తున్నారు. దేశంలో కులగణన చేపట్టడం ఇష్టం లేకనే బీజేపీ నేతలు కులగణనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. కెసిఆర్‌ ‌సర్వే ప్రకారం బీసీలు 51 శాతం మాత్రమే.. కానీ మన కులగణన ప్రకారం 56.33 శాతం ఇక బీసీల లెక్క తగ్గిందో పెరిగిందో మీరే చెప్పండి.
గుజరాత్‌ ‌లో ముస్లింలు ఓబీసీ కేటగిరీలో ప్రయోజనం పొందుతున్నారని%•% తాను ఎప్పుడూ మీడియాలో చెప్పుకోలేదని మోదీ 2023లో ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. కానీ బండి సంజయ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి బీసీలలో ముస్లింలను కలిపారని చెబుతున్నాడు. తప్పుడు మాటలు మాట్లాడటం కాదు.. ఏ బ్లాక్‌ ‌లో ఏ ఇంట్లో తప్పు జరిగిందో నిరూపించాలని కెసిఆర్‌, ‌బండి సంజయ్‌, ‌కిషన్‌ ‌రెడ్డికి సీఎం రేవంత్‌ ‌రెడ్డి సవాల్‌ ‌విసిరారు. భవిష్యత్‌ ‌లో దేశంలో బీసీ రిజర్వేషన్ల గురించి చర్చించాలంటే తెలంగాణ గురించి, రేవంత్‌ ‌రెడ్డి గురించి చర్చించుకునే పరిస్థితి ఉంటుంది.
ఈ అవకాశాన్ని జారవిడిచుకుంటే చరిత్ర మిమ్మల్ని క్షమించదు. నేను రాజకీయ అజ్ఞానంతో మాట్లాడటంలేదు. మా నాయకుడి ఆదేశాలు పాటించే వ్యక్తిగా మాట్లాడుతున్నానని తెలిపారు.   ఈరోజు మనం చేసిన లెక్క నూటికి నూరు శాతం పక్కా.  ఎవరు ఏం చెప్పినా నమ్మొద్దు. మోదీ రాజకీయంగా వ్యతిరేకత ఎదుర్కోవాల్సి వొస్తుందనే ఈ ప్రక్రియను తప్పుబడుతున్నారు. కిషన్‌ ‌రెడ్డి, బండి సంజయ్‌ ఉద్యోగాలు పోతాయనే దీనిపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. దీన్ని తిప్పి కొట్టాల్సిన బాధ్యత మీ అందరిపై ఉంది. పకడ్బందీ ప్రక్రియతో కులగణన చేశాం%•%దీన్ని కాపాడుకుని ప్రజల్లోకి తీసుకెళ్లండి. ప్రక్రియ పూర్తి చేయడంతో నా బాధ్యత పూర్తయింది.
దీన్ని పట్టాలెక్కించి గమ్యం చేర్చే వరకు ముందుకు తీసుకెళ్లే బాధ్యత మీదే.  బీజేపీకి నేను సవాల్‌ ‌విసురుతున్నా%•% మీరు జనగణనలో కులగణన చేర్చండి. ఎవరి లెక్క తప్పో తేలుతుంది. జనగణనలో కులగణన చేర్చాలని ఈ సమావేశం వేదికగా తీర్మానం చేస్తున్నాం.  సామాజిక వర్గాలవారీగా సమావేశాలు నిర్వహించి మార్చి 10 లోగా తీర్మానాలు చేయండి. మీ ఐకమత్యాన్ని చాటండి%•% అప్పుడే మీకు రాజకీయంగా, విద్య ఉద్యోగాల పరంగా ప్రయోజనం ఉంటుందని సీఎం రేవంత్‌ ‌రెడ్డి తెలిపారు. బలహీన వర్గాలకు కులగణన నివేదికనే బైబిల్‌, ఇదే భగవద్గీత, ఇదే ఖురాన్‌  అని ఆయన పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page