కొండా లక్ష్మణ్‌ బాపూజీకి సిఎం రేవంత్‌ నివాళి

తొలి, మలి దశ తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటంలో కీలక భూమిక పోషించిన కొండా లక్ష్మణ్‌ బాపూజీని సీఎం రేవంత్‌రెడ్డి స్మరించుకున్నారు. తన నివాసంలో కొండా లక్ష్మణ్‌ బాపూజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు.ఈ సందర్భంగా ఆయన సేవలను కొనియాడారు. 1969లో తన మంత్రి పదవిని సైతం వదులుకున్న త్యాగధనుడు కొండా లక్ష్మణ్‌ బాపూజీ అని కొనియాడారు.

శనివారం కొండా లక్ష్మణ్‌ బాపూజీ వర్ధంతిని పురస్కరించుకొని ఆయన సేవలను సీఎం గుర్తుచేసుకున్నారు. ఎమ్మెల్యేగా, శాసనసభ డిప్యూటీ స్పీకర్‌గా, మంత్రిగా వివిధ హోదాల్లో ప్రజలకు సేవ చేయటంతో పాటు నిరంతరం బడుగు, బలహీనవర్గాల సంక్షేమానికి బాపూజీ తపించారన్నారు. కాగా, కొండా లక్ష్మణ్‌ బాపూజీ జయంతిని ఈ నెల 27న అధికారికంగా నిర్వహించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు సీఎస్‌ శాంతికుమారి శుక్రవారం ఉత్తర్వులను జారీ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *