ఛైర్మన్గా పల్లె గంగారెడ్డి నియామకం
తెలంగాణ రాష్టాన్రికి కేంద్ర ప్రభుత్వం సంక్రాంతి పండుగ సందర్భంగా తీపి కబురు అందించింది. నిజామాబాద్ కేంద్రంగా కొత్తగా పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. అంతేకాకుండా పల్లె గంగారెడ్డిని పసుపు బోర్డు ఛైర్మన్గా నియమించినట్లు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎంపి బండి సంజయ్ ప్రయత్నం ఫలించి బోర్డు ఏర్పాటు జరిగింది. గతంలో స్పెసెస్ బోర్డు ఏర్పాటు చేయగా, ప్రత్యేకించి పసుపుబోర్డు ఏర్పాటు చేయాలన్న డిమాండ్ వొచ్చింది. ఈ నిర్ణయంతో తెలంగాణలో పసుపు రైతుల క్రయ, విక్రయాలు, ప్రాసెసింగ్కు మరింత ప్రోత్సాహం లభించనుంది. నిజామాబాద్లో జాతీయ పసుపు బోర్డు ప్రారంభోత్సవం జరగనున్నది. ఈ కార్యక్రమం తెలంగాణకు మరో ప్రాముఖ్యమైన మైలురాయి కానుంది.
ఈ కార్యక్రమానికి కేంద్ర వాణిజ్య, పరిశ్రమల, వ్యవసాయ శాఖల అధికారులు, పశ్చిమ రాష్టాల్ర ఇతర వ్యవసాయ సంబంధిత నాయకులు, తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నట్లు తెలిసింది. ప్రారంభోత్సవం సందర్భంగా పసుపు రైతులకు సంబంధించి వ్యూహాలు, నూతన ప్రాజెక్టులు, కేంద్ర ప్రభుత్వ విధానాలు, సహాయ కార్యక్రమాలను ప్రకటించే అవకాశం ఉంది. రైతులకు పసుపు విక్రయాలు, మార్కెట్కు ఉన్న అవరోధాలు, రుణాల వంటి అంశాలపై పలు ముఖ్యమైన చర్చలు జరగనున్నాయి. పసుపు రైతుల సమస్యలు, అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టేందుకు కేంద్రం ఈ బోర్డు స్థాపించనుంది. తెలంగాణ రాష్ట్రంలో పసుపు సాగులో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్న నిజామాబాద్, కొమురంభీం ఇతర జిల్లాలలోని రైతులకు ఈ బోర్డు ద్వారా మరింత సాయం అందుతుంది. కేంద్ర ప్రభుత్వం పసుపు పంటను ఒక ప్రత్యేకమైన పరిశ్రమగా భావించి, రైతుల సమస్యలు పరిష్కరించేందుకు ఈ బోర్డు ఏర్పాటును ప్రకటించింది.
మరోవైపు ప్లలె గంగారెడ్డి రైతు సంక్షేమం కోసం పోరాడిన వ్యక్తి. ఆయన వ్యవసాయ రంగం మీద అవగాహన, పసుపు రైతుల సమస్యలను అర్థం చేసుకోవడంలో అనుభవం ఉన్న వ్యక్తి కావడంతో ఆయన నియామకాన్ని కేంద్రం సమర్థించింది. ఆయన మార్కెట్ ప్రవర్తన, గుణాత్మక అభివృద్ధిపై అనేక మార్గదర్శకాలపై అభిప్రాయం వెల్లడించారు. పసుపు బోర్డు ఏర్పాటు ద్వారా రైతులకు అనేక కొత్త అవకాశాలు రానున్నాయి. రైతులు పసుపు పంటను మరింత మంచి ధరలలో విక్రయించేందుకు మరింత సహాయాన్ని అందుకుంటారు. దీంతోపాటు పసుపు ప్రాసెసింగ్, ఎగుమతుల ప్రోత్సాహం, నూతన టెక్నాలజీలను ఉపయోగించి పంటల ఉత్పత్తి పెంచడం వంటి అంశాలపై రైతులకు మరింత అవగాహన పెరుగుతుంది. ఈ కొత్త బోర్డు ఏర్పాటుతో రైతులకు మంచి అవకాశం దక్కనుంది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల అనేక మంది రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.