భద్రాచలం రాముల వారి కల్యాణ బ్రహ్మోత్సవాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి ఆహ్వానం

భద్రాచలం , ప్రజాతంత్ర , మార్చి 23. : ఏప్రిల్ 6 తేదీన జరగనున్న శ్రీ సీతారామ కల్యాణ మహోత్సవానికి,7 జరగనున్న మహా పట్టాభిషేకానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి శ్రీరామనవమి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలకు మంత్రి కొండా సురేఖ, భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవస్థానం అర్చకులు, అధికారులు. ఆహ్వానం పలికారు.

సీఎంతో పాటు ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు మంత్రి కొండా సురేఖ ఆహ్వాన పత్రిక అందించారు. శ్రీరామనవని బ్రహ్మోత్సవాల గోడ పత్రిక ను సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులు ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధికి సంబంధించి అవసరమైన భూసేకరణ, ఇతర వివరాలను ముఖ్యమంత్రి అధికారులను అడిగి తెలుసుకున్నారు.అవసరమైన భూసేకరణ, నిధులకు సంబంధించిన పూర్తి వివరాలు అందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ శైలజా రామయ్యర్, దేవాదాయ శాఖ కమిషనర్ శ్రీధర్, భద్రాచలం ఆలయ ఈవో రమాదేవి, ఆలయ అర్చకులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page