Category ముఖ్యాంశాలు

నిమ్స్‌లో వెయ్యి రొబోటిక్ సర్జరీలు

– డాక్టర్లు, సిబ్బందిని అభినందించిన మంత్రి దామోదర్ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 3 : నిమ్స్ హాస్పిటల్ మరో ఘనతను సాధించింది. రెండున్నరేళ్ల వ్యవధిలోనే నిమ్స్‌లో వెయ్యి రొబోటిక్ సర్జరీలను విజయవంతంగా పూర్తి చేసినట్లు నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రాహుల్ దేవరాజ్ తెలిపారు. ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహని సచివాలయంలో సోమవారం కలిసిన ఆయన…

ఈయేడు కుంభ వృష్టి వర్షాలు తప్పవు

– ప్రాణనష్టం కూడా ఎక్కువే – రంగం భవిష్య వాణిలో మాతంగి వెల్లడి హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఆగస్టు 3 :‌ సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల జాతర చివరి ఘట్టానికి చేరుకుంది. అమ్మవారి ఆలయంలో మాతంగి స్వర్ణలత సోమ‌వారం భవిష్యవాణి(రంగం) వినిపించారు. మీరెవరూ నేను చెప్పింది ఏదీ ఆచరించడం లేదంటూ మాతంగి ఆగ్రహం వ్యక్తం…

ఇందిరాపార్క్ ‌వద్ద నిరుద్యోగుల మెరుపు ధర్నా

– 19వేల పోలీస్‌ ‌పోస్టులకు నోటిఫికేషన్‌ ఇవ్వాలి ‌హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఆగస్టు 3: ‌రాష్ట్రంలో పోలీసు ఉద్యోగాల భర్తీ పక్రియపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ నిరుద్యోగ యువత ఇందిరా పార్క్ ‌చౌరస్తాలో సోమవారం మెరుపు ధర్నాకు దిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన 7,437 పోలీస్‌ ‌పోస్టుల నోటిఫికేషన్‌ ‌సరిపోదని, రాష్ట్రంలో ఖాళీగా ఉన్న సుమారు 19…

స్వాతంత్య్ర దిన వేడుకలకు పక్కా ఏర్పాట్లు చేయాలి

– సమష్టి బాధ్యతతో ఏర్పాట్లు చేయాలి – సీఎస్ సంజయ్ సమీక్ష హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 3: స్వాతంత్య్ర దిన వేడుకలను అత్యంత వైభవంగా, గౌరవప్రదంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పక్కా ఏర్పాట్లు పూర్తి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు అధికారులను ఆదేశించారు. ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమన్వయ సమావేశాన్ని సచివాలయంలో సోమవారం…

పుట్టిన గడ్డ రుణం తీర్చుకోండి.. పెట్టుబడులతో రండి

– ప్రపంచ దేశాలతో పోటీపడేలా తెలంగాణ అభివృద్ధి – ప్రతీ కార్యక్రమంలో మీ వెన్నంటి ఉంటాం – ఎన్నారైల సమస్యల పరిష్కారానికి చట్టబద్ధమైన ప్రత్యేక వ్యవస్థ – ఆన్‌లైన్‌లో ఓటు హక్కు నమోదు చేసుకోండి: ప్రవాసులకు భట్టి విజ్ఞప్తి బాల్టిమోర్ (అమెరికా), ప్రజాతంత్ర, ఆగస్టు 3 : అనేక కష్టనష్టాలకోర్చి ఖండాంతరాలు దాటి ఉన్నత శిఖరాలకు…

నిమ్స్ వైద్య బృందానికి సీఎం అభినందనలు

– రెండున్నరేళ్లలో వెయ్యి రొబోటిక్ శస్త్రచికిత్సలు విజయవంతంపై హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 3 : హైదరాబాద్ నిమ్స్‌లో రెండున్నరేళ్లలో వెయ్యి రొబోటిక్ శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తి చేయడంపై ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ ఘనత సాధించినందుకు నిమ్స్ డైరెక్టర్ రాహుల్ దేవరాజ్‌తోపాటు వైద్య బృందం, నర్సింగ్ సిబ్బంది, ఆపరేషన్ థియేటర్ బృందానికి…

రేప‌టినుంచి హైదరాబాద్‌లో ‘బ్రిక్స్’ ఏసీడబ్ల్యూజీ సమావేశం

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 3 : బ్రిక్స్ అవినీతి నిరోధక కార్యాచరణ బృందం(ఏసీడబ్ల్యూజీ) రెండో సమావేశానికీ, ఆస్తుల రికవరీపై బ్రిక్స్ నిపుణుల నెట్‌వర్క్ రెండో సమావేశానికీ భారత ప్రభుత్వ ఆధ్వర్యంలోని సిబ్బంది, శిక్షణ విభాగం(డీవోపీటీ) ఆతిథ్యమివ్వనుంది. బ్రిక్స్-2026కు భారత్ అధ్యక్షత వహిస్తున్న నేపథ్యంలో ఈనెల 4, 5 తేదీల్లో హైదరాబాద్‌లో ఈ సమావేశాలు జరుగుతాయి. బ్రిక్స్…

గోదావరి ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయండి

– ముందస్తు చర్యలకు కలెక్టర్‌ను ఆదేశించిన మంత్రి పొంగులేటి హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 31 : ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో భద్రాచలం వద్ద గోదావరి నదికి వరద ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో గోదావరి పరివాహక ప్రాంతాల ప్రజల భద్రతకు ఎలాంటి లోటు లేకుండా అన్ని ముందస్తు చర్యలు చేపట్టాలని రెవెన్యూ, సమాచార, పౌర…

తెలంగాణకు రండి.. పెట్టుబడులు పెట్టండి

– అందుకు అనువైన వాతావరణం కల్పిస్తున్నాం – రాష్ట్రంలో పాలసీ పెరాలసిస్ లేదు – సీఐఐ ఉత్తర భారత ప్రతినిధుల సమావేశంలో సీఎం రేవంత్ హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 31 : వివిధ రంగాల్లో పెట్టుబడులకు తెలంగాణ సురక్షిత స్థానమని, తెలంగాణకు వచ్చి పెట్టుబడులు పెట్టాలని భారత పరిశ్రమల సమాఖ్య(సీఐఐ) ఉత్తర భారత ప్రతినిధులను ముఖ్యమంత్రి…