special Stories

special Stories

శ్రీరామ పట్టాభిషేకం, శ్రీమద్రామాయణ ఫలశ్రుతి

“బ్రహ్మ నిర్మితమై, అనేక రత్నాలతో, తేజస్సుతో ప్రకాశిస్తూ, మనువు పూర్వం అభిషిక్తుడైన సమయంలో ధరించినదై, అది మొదలు వంశపారంపర్యంగా పట్టాభిషేక సమయంలో ధరించేదైన, వెలలేని మణులతో ప్రకాశిస్తున్న కిరీటాన్ని రత్న పీఠంమీద కూచున్న రామవిభుడి అంగీకారంతో వేదాధ్యయనపరులైన ఋత్విజులతో కలిసి వసిష్టుడు అలంకరించాడు. శత్రుఘ్నుడు శ్వేతఛ్చత్రం పట్టాడు. తెల్లటి చామరాన్ని సుగ్రీవుడు, మరొక చామరాన్ని విభీషణుడు…

తెల్ల కాకులు!

            -బమ్మిడి జగదీశ్వరరావు “ఆ యింటిమీది కాకి ఈ యింటిమీద వాలకూడదు అంటారు కదా?, మరి నువ్వేంటమ్మా ఆ యింటిమీదా యీ యింటిమీదా అన్ని చోట్లా వాలుతున్నావ్?” పిల్లకాకి అడిగింది. “ఈ యిల్లూ ఆ యిల్లూ వొకప్పుడు వొకటే యిల్లు…” తల్లికాకి తన తాతలు తండ్రులు చెప్పింది తలపోసినట్టు ఆగిపోయింది. “ఒక కుటుంబం రెండు కుటుంబాలు…

ముచ్చట్ల పందిరి ‘యాది’

చెమ్మ –వారాల ఆనంద్ సామల సదాశివ ఓ జ్ఞాపకాల గని, ముచ్చట్ల పందిరి, నడుస్తున్న సాహిత్యచరిత్ర, మరపురాని హిందుస్తానీ గానకచేరి తడిమేతేచాలు శరపరంపరగా అలవోకగా మాట్లాడుతూ వినేవాళ్ళని ముచ్చట్లతో ముగ్దుల్ని చేసే విశాలప్రపంచం ఆయనది. ఎలాంటి రెఫెరెన్సులు లేకుండా ఎక్కడెక్కటి విషయాలో ఎప్పటెప్పటి సంగతులో జాలువారే ప్రవాహం అయన. ‘నేను రాసేవి విమర్శలు, చెప్పేవి చారిత్రక అంశాలు కావు, అవి ముచ్చట్లు’ అన్నారాయన. వాస్తవంగా…

కొత్త ఎరుక కలిగించే కథలు

–సుధా మురళి ఎరుక అంటే ఏమిటి!? “ఎరుక” అంటే తెలుసుకోవడం కదా. అంచనా వేయడం అనే కదా. దూరాన్ని దగ్గరగా చూడగలిగే దృష్టి. భవిష్యత్తు గమనాన్ని గమనించే సామర్థ్యం ఇవే కదా ఎరుక కలిగి ఉండటం అంటే. మరి ఒకప్పుడు ఊర్ల మధ్య తిరుగుతూ జాతకాలు చెప్పిన ఒక వర్గం, ఇతరుల జీవితాలకు “ఎరుక” ఇచ్చిన ఒక…

జీవాల ఆలయం

కాలం కడలి అలలలో మనసుల ముత్యాలు ఎక్కడో జారిపోయాయి. నగరాల నీలి కాంతుల్లో నిజమైన వెలుగు నీడై మిగిలింది. అద్దాల భవనాల మధ్య అద్దంలా పారదర్శకమైన హృదయాలు చీలికలు పడ్డాయి.. కానీ ఆ చీలికల్లోంచి రాలిన రక్తం ఎవరికి కనిపించలేదు. వేగం వేదమై మారిన ఈ యుగంలో వెన్నెల మాటలు వాడుక తప్పాయి. కన్నీరును కూడా కరెన్సీ లాగా విలువ తూచే త్రాసులో కొలుస్తున్నారు. ఒకప్పుడు పేదవాడి పలుకులో పరమాత్మ ఉండేవాడు, పరాయివాడి బాధలో మనసు తడిచేది ఇప్పుడు.. తలుపులు పెద్దవయ్యాయి, కిటికీలు మూసుకుపోయాయి. కానరాని మానవతా ఆనవాళ్లు గుండెల గర్భంలో గుసగుసలాడుతున్నాయి. ఆశ్రయంలేని చూపుల్లో ఆర్తనాదాలై ప్రతిధ్వనిస్తున్నాయి. ఒక చిన్న చిరునవ్వు ఒక చిత్తశుద్ధి గల మాట ఒక కరుణామయ దృష్టి.. ఇవి విప్లవాల కంటే గొప్పవి ఎందుకంటే మానవత్వం పుస్తకాలలో పుట్టదు, పోరాటాలలో పెరగదు.. మనసు మరో మనసుని తాకినప్పుడు మాత్రమే అది పువ్వులా వికసిస్తుంది. మనం మనల్ని మించిన మనిషిని మరో మనిషిలో చూసిన రోజు, కాలం చెరిపేసిన ఆనవాళ్లు కాంతులా తిరిగి రాసుకుంటాయి. అప్పుడు.. ఈ భూమి కేవలం జీవుల గూడెం కాదు,…

ఉట్టికెక్కలేక స్వర్గం గురించి పగటికలలు!

“ఆకర్షణీయమైన, ప్రశంసాపూర్వకమైన శీర్షికలు వాస్తవరూపం ధరిస్తాయా, ఈ ప్రగల్భాల అంకెలు నిజంగా అమలవుతాయా అనే మామూలు ప్రశ్నలు బడ్జెట్ వార్తలు రాసిన విలేఖరులకు గాని, అచ్చువేసిన పత్రికా సంపాదకులకు గాని వచ్చినట్టు లేదు. “బడ్జెట్ అంటే సంఖ్యల చుట్టూ తిరిగే అంకెలు కాదు, ప్రజల చుట్టూ తిరిగే సంఖ్యలు. బడ్జెట్ ప్రజల జీవన స్థితిగతుల మార్పుకు…

“ఆశా” కార్యకర్తలను ఆదుకోవాలి

రాష్ట్ర  ఆరోగ్య ముఖచిత్రంలో ‘ఆశా’ (ASHA – Accredited Social Health Activists) కార్యకర్తలు ఒక విడదీయలేని భాగం. గ్రామాల్లో గర్భిణి నమోదు మొదలుకొని, టీకాలు వేయించడం, అంటువ్యాధుల నియంత్రణ వరకు వీరు అందించే సేవలు అమూల్యం. అయితే, వ్యవస్థకు వెన్నెముకగా నిలుస్తున్న ఈ 28 వేల  మహిళా కార్యకర్తల జీవితాల్లో మాత్రం ‘ఆశ’ మృగ్యమవుతోంది.…

నారీ శక్తికి పట్టాభిషేకం! భారత పార్లమెంటులో చారిత్రక ప్రజాస్వామ్య విప్లవం

“2029 ఎన్నికలు భారత పార్లమెంటును ఒక సరికొత్త ‘నారీ శక్తి’ వేదికగా మార్చబోతున్నాయి. తెరపై కనిపించే గణాంకాల కంటే, విధాన నిర్ణయాల్లో మహిళలు పోషించబోయే క్రియాశీలక పాత్ర దేశ భవిష్యత్తును నిర్దేశిస్తుంది. సామాజిక సమస్యల పట్ల మహిళలకు ఉండే సహజమైన సున్నితత్వం, జవాబుదారీతనం చట్టసభల పనితీరును మరింత మెరుగుపరుస్తాయని ఆశించవచ్చు. రాజకీయ సంకల్పం, పారదర్శకమైన అమలు…

ట్రంప్ వెనకడుగు ..ఇరాన్ దూకుడు ..!

ప్రస్తుత అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ పరిణామాలు ప్రపంచాన్ని ఒక అనిశ్చిత స్థితిలోకి నెట్టివేస్తున్నాయి. అమెరికా  అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న వ్యూహాత్మక వెనకడుగు, అదే సమయంలో ఇరాన్ తన క్షిపణి సామర్థ్యాన్ని 4000 కిలోమీటర్ల మేర పెంచుకుంటూ దూకుడు ప్రదర్శించడం గల్ఫ్ ప్రాంతాన్నే కాకుండా యావత్ ప్రపంచాన్ని ఆందోళనకు గురిచేస్తోంది. ఈ నేపథ్యంలో భారత ప్రధానమంత్రి…

90 ఏళ్ళ ప్రాయంలో కోవెల సుప్రసన్నాచార్య

“తెలంగాణ ఆయన ఊపిరి. ప్రత్యక్షంగా ఉద్యమాల్లో పాల్గొనకపోయినా తన రచనల ద్వారా, చర్చల ద్వారా ఉద్యమకారులను కార్యోన్ముఖులను చేయడంలో తన వంతు పాత్ర నిర్వహించారు. మలిదశ తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగుతున్న రోజులవి. సమైక్య పాలనలో నిరాదరణకు గురైన తెలంగాణ సాహిత్య చరిత్రను వెలుగులోకి తేవాలన్నది ఆచార్యుల అభిలాష. అదే సమయంలో సహృదయ సాహిత్య సాంస్కృతిక…