prajatantra_news

prajatantra_news

కాంగ్రెస్ కుట్రలు కూలిపోయాయి

– ఇది ముమ్మాటికీ ప్రజల, రైతాంగ విజయం – బీర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 22 : కాళేశ్వరంపై కాంగ్రెస్ పార్టీ కుట్రలను బయటపెడుతూ ఇచ్చిన తీర్పుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హైకోర్టుకు ధన్యవాదాలు తెలిపారు. రాజకీయాల కోసం రైతాంగాన్ని ఇబ్బందులకు గురిచేయవద్దని, ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని చిల్లర ప్రచారాలు…

అధికారం కోసం హామీలు.. గద్దెనెక్కాక మోసాలు

– ఆర్టీసీ కార్మికుల సమ్మెకు బీజేపీ మద్దతు – కాంగ్రెస్‌పై రామచందర్‌రావు ధ్వ‌జం హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 22 : ఆర్టీసీ కార్మికుల సమ్మెకు బీజేపీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తోందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్‌రావు ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తాం.. కార్మికులను కడుపులో పెట్టుకుని…

హైకోర్టు తీర్పుతో ప్రభుత్వ వైఫల్యం బట్టబయలు

– కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 22 : కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలపై ఏర్పాటు చేసిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై హైకోర్టు ఇచ్చిన తీర్పు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాన్ని మరోసారి బట్టబయలు చేసిందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి అన్నారు. భారీ అవినీతి జరిగినట్లు ఆధారాలు ఉన్నప్పటికీ…

29 డిమాండ్లు పరిష్కరించడానికి సిద్ధం

– మూడింటిపై చర్చిస్తున్నాం – గ్రామీణ పేదలకు లైఫ్ లైన్ ఆర్టీసీ – ప్రజలకు ఇబ్బందులు కలిగించొద్దు – సమ్మెను విరమించండి – ఆర్టీసీ కార్మికులకు మంత్రి పొన్నం వినతి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 22 : పేద ప్రజల లైఫ్ లైన్ ఆర్టీసీ అని, సంస్థను నిర్వీర్యం చేసే కుట్రలు చేయద్దని రవాణా శాఖ…

ఉద్యోగస్తులు బాధ్యతగా విధులు నిర్వర్తించాలి

– మహనీయుల ఆలోచన మేరకు ముందుకెళ్లాలి – ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరడంలో మీదే కీలక పాత్ర – సచివాలయంలో అంబేడ్క‌ర్ విగ్రహం ఏర్పాటుకు కృషి చేస్తా – మహనీయుల జయంతి వేడుకల్లో మంత్రి అడ్లూరి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 21 : శక్తి ఉన్నన్ని రోజులు అణగారినవర్గాల అభ్యున్నతి కోసం, ఉద్యోగుల సంక్షేమ కోసం…

మోదీ టెర్రరిస్ట్ అంటూ విమర్శ

– తమిళనాడు ప్రచారంలో ఖర్గే వివాదాస్పద వ్యాఖ్య – మండిపడ్డ బీజేపీ నేతలు – అలా అనలేదని వివరణ ఇచ్చిన ఖర్గే చెన్నై, ఏప్రిల్ 21 : కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వివాదంలో చిక్కుకున్నారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం చెన్నైలో మాట్లాడుతూ ప్రధాని మోదీనుద్దేశించి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. దాంతో…

ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

– ప్రైవేట్ పరం చేసే యత్నాలను అడ్డుకుంటాం- – ప్రజలు సమస్యల్లో ఉంటే సభలతో కాలయాపనా – 25న రాజకీయ శక్తిగా ముందుకు రాబోతున్నాం – జాగృతి అధ్యక్షురాలు కవిత వెల్లడి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 21: ఆర్టీసీ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని జాగృతి అధ్యక్షురాలు కవిత డిమాండ్ చేశారు. ఆర్టీసీ కార్మికులంటే ప్రభుత్వం…

లౌకికవాదానికి, అభివృద్ధికే తమిళుల పట్టం

– తమిళనాడులో డీఎంకే కూటమిదే విజయం – తెలంగాణలో హామీలను అమలు చేశాం – ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చెన్నై, ప్రజాతంత్ర, ఏప్రిల్ 21 : తమిళనాడులో డీఎంకే-కాంగ్రెస్ కూటమి అధికారంలోకి రావడం ఖాయమని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ధీమా వ్యక్తం చేశారు. తమిళనాడు శాసనసభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏఐసీసీ పరిశీలకుడు,…

వైద్య పరికరాల ఉత్పత్తికి ఆధునిక సదుపాయాలు

– మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 21 : అత్యాధునిక వైద్య పరికరాల తయారీకి తెలంగాణాలో ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని ఐటి, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తెలిపారు. మెడికల్ డివైసెస్ పార్క్, జీనోమ్ వ్యాలీలో తక్షణం ఉత్పత్తి ప్రారంభించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు ఉన్నాయని వెల్లడించారు. సచివాలయంలో…

30 ఏళ్ల తర్వాత తల్లిని కలిసిన దామోదర్

– స్వగ్రామంలో ఆత్మీయ స్వాగతం ములుగు, ప్రజాతంత్ర, ఏప్రిల్ 21 : మావోయిస్టు పార్టీ రాష్ట్ర మాజీ కార్యదర్శి బడే చొక్కారావ్ ఆలియాస్ దామోదర్ 30 ఏళ్ల తర్వాత తన స్వగ్రామమైన తాడ్వాయి మండలం కాల్వపల్లిలో అడుగుపెట్టి తల్లిని కలుసుకోవడం స్థానికంగా చర్చనీయాంశమైంది. పాతికేళ్లపాటు సాయుధ పోరాటంలో కొనసాగిన దామోదర్ ఇటీవల పోలీసుల ముందు లొంగిపోయి…