prajatantra_news

prajatantra_news

10 థీమ్‌లపై శాఖల వారీగా కార్యక్రమాలు

– ప్రజల భాగస్వామ్యంతో 99 రోజుల కార్యక్రమాలు అమలు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 24: ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక 99 రోజుల ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా శాఖల వారీగా 10 థీమ్‌లతో రాష్ట్రవ్యాప్తంగా ప్రజల్లో విస్తృత స్థాయిలో కార్యక్రమాలు జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజలను ఆయా కార్యక్రమాల్లో భాగస్వాములను చేసి…

2011‌లోని మిలియన్‌ మార్చ్ ‌కేసు

– కేసీఆర్‌, ‌కేటీఆర్‌, హరీష్‌ ‌రావులపై కొట్టివేత హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 24:‌హైదరాబాద్‌లో 2011లో జరిగిన మిలియన్‌ మార్చ్ ‌కేసుకు సంబంధించి తాజాగా కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో అప్పటి టీఆర్‌ఎస్‌ ‌నేతలు కేసీఆర్‌, ‌కేటీఆర్‌, ‌హరీశ్‌రావులపై నమోదైన క్రిమినల్‌ ‌కేసులను హైకోర్టు కొట్టివేసింది. ఈ తీర్పుతో వారికి న్యాయపరంగా పెద్ద ఊరట లభించింది.…

స్తంభించిన ప్రజా రవాణా

– మూడో రోజుకు చేరిన ఆర్టీసీ సమ్మె – డిపోలకే పరిమితమైన 10 వేల బస్సులు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 24: తెలం గాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె మూడో రోజు కు చేరుకుంది. తమ డిమాండ్లు పరిష్కరించే వరకూ సమ్మె విరమించేది లేదని కార్మికులు తేల్చి చెబుతున్నారు. శుక్రవారం ఉదయం అ న్ని జిల్లాల్లో…

ఆర్టీసీ సమ్యలపై ప్రభుత్వం సానుకూలం

– సమ్మెపై జేఏసీతో మంత్రుల చర్చలు – ఆర్టీసీని బలోపతేం చేద్దామన్న డిప్యూటీ సీఎం భట్టి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 24: ఆర్టీసీ సమ్మెపై చర్చలు కొలిక్కి వొచ్చినట్లేనని భావిస్తున్నారు. ప్రభుత్వం కూడా కార్మికుల పట్ల సానుకూలతతో ఉన్నట్లు సమాచారం. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన సచివాలయంలో ఆర్టీసీ జేఏసీ నేతలతో మంత్రుల బృందం…

తదుపరి డీజీపీగా సీవీ ఆనంద్ ?

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 24: నూతన డీజీపీగా సీవీ ఆనంద్‌ను నియమించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నెల 30న ప్రస్తుత డీజీపీ శివధర్ రెడ్డి పదవీ విరమణ చేయనున్నారు. ఆ తర్వాత ఆనంద్ మే మొదటి వారంలో బాధ్యతలు స్వీకరించనున్నట్లు సమాచారం. ఆయన ప్రస్తుతం హోం శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. తాజాగా…

ప్రజాస్వామ్యబ‌ద్ధంగా ‘హిల్ట్‌’ అమలు

– నగరాన్ని, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవడమే ప్రభుత్వ లక్ష్యం – సవరించిన భూముల మార్కెట్ విలువను అమలులోకి తెండి – కేబినెట్ సబ్ కమిటీ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి – ‘హిల్ట’ని ఆహ్వానిస్తున్నాం: ఇండస్ట్రియల్ ఎస్టేట్స్ ప్రతినిధులు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 24 : హైదరాబాదు నగరంతో పాటు, రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెటుకుని…

యువతే దేశ నిర్మాతలు

– పీఎం క్రీడా ఉత్సవంలో గవర్నర్ మహబూబ్ నగర్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 24. యువత ఒక శక్తివంతమైన, ప్రగతిశీల దేశానికి నిజమైన నిర్మాతలని, వారి ఉత్సాహం, క్రమశిక్షణ మరియు దృఢ సంకల్పం భారతదేశ నిర్భయ స్ఫూర్తికి ప్రతిబింబాలని రాష్ట్ర గవర్నర్ కొనియాడారు. శు క్రవారం మహబూబ్ నగర్ జిల్లాలో జరిగిన ‘ప్రధానమంత్రి క్రీడా మహోత్సవం’లో ఆయన…

యువర్ సిటీ 100 యాప్‌లో సమగ్ర సమాచారం

కాళోజి జంక్షన్/హనుమకొండ, ప్రజాతంత్ర, ఏప్రిల్ 24 : సమాజంలో వ్యాపార అవకాశాలను విస్తృత పరుచుకోవడానికి యువర్ సిటీ 100 యాప్ సాంకేతికత పరిజ్ఞానం ఎంతగానో ఉపయోగపడుతుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. పులి అవినాష్ రూపొందించిన యాప్‌ను కేటీఆర్ చేతుల మీదుగా హైదరాబాదులో శుక్రవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిరు వ్యాపారుల…

సమాన విద్యతోనే సామాజిక అంతరాలకు చెక్

– సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ హన్మకొండ, ప్రజాతంత్ర, ఏప్రిల్ 24: పిల్లలందరికీ సమాన అవకాశాలు గల నాణ్యమైన విద్య అందించినప్పుడే సమాజంలో ఉన్న అంతరాలు తొలగిపోతాయని సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్, విద్యా పరిరక్షణ కమిటీ కార్యనిర్వాహక కార్యదర్శి ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ అన్నారు. స్థానిక వేడుకల మందిరంలో డీటీఎఫ్ రాష్ట్ర కౌన్సిలర్ ఎ.సంజీవరెడ్డి ఉద్యోగ విరమణ…

ఆర్టీసీ కార్మికులకు రేవంత్ తీరని ద్రోహం

BRS leader KTR criticizes Modi and Rahul

– సర్కారు నిర్లక్ష్యమే శంకర్ గౌడ్‌ను బలితీసుకుంది – బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 24: ఆర్టీసి డ్రైవర్ శంకర్ గౌడ్‌ది ఆత్మహత్య కాదు.. అది ముమ్మాటికీ రేవంత్ సర్కారు చేసిన హత్యే అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. రెండున్నరేళ్లుగా సీఎం రేవంత్ ఆర్టీసి కార్మికులకు చేస్తున్న తీరని…