పొంగులేటికి మంత్రిగా కొనసాగే హక్కు లేదు

రాఘవ కంపెనీ కుంభకోణంపై ఏలేటి ఆరోపణలు
హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూలై 22 : మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి చెందిన రాఘవ కంపెనీపై భాజపా శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ఆరోపణలు చేశారు. యూరో ఎగ్జిన్‌ బ్యాంక్‌ కుంభకోణంలో రాఘవ కంపెనీ భాగస్వామి అని అన్నారు. పొంగులేటికి మంత్రిగా కొనసాగే అర్హత లేదని విమర్శించారు. ఆర్బీఐ మార్గదర్శకాలను ఉల్లంఘించి మోసానికి పాల్పడ్డారన్నారు.

రాష్ట్రంలోని బ్యాంకుల జాబితాలో యూరో ఎగ్జిన్‌ బ్యాంకు లేదని, ఆ బ్యాంకు గ్యారంటీలపై విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. కుంభకోణంలోని గుత్తేదారుల పేర్లు త్వరలోనే బయటపెడతానన్నారు.చట్టాలను దుర్వినియోగం చేసి లబ్ది పొందిన గుత్తేదారులపై కఠిన చర్యలు తీసుకోవాలి. రాష్ట్రంలోని భారీ గుత్తేదారులు ఈ కుంభకోణంలో భాగస్వాములయ్యారు. బ్యాంక్‌ గ్యారంటీలపై రాష్ట్ర ప్రభుత్వం సీబీఐ విచారణ కోరాలి. అసెంబ్లీ సమావేశాల్లో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇచ్చిన హావిూలను లేవనెత్తుతాం. రూ.6వేల కోట్లు ఎవరెవరికి ఇచ్చారో ప్రజలముందు పెట్టాలని ఏలేటి డిమాండ్‌ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *