ప్రవేశ పెట్టనున్న ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 24 : అసెంబ్లీలో నేడు ఆర్థికమంత్రి మల్లు భట్టి విక్రమార్క 2024-25కు సంబంధించి రాష్ట్ర బడ్జెట్ ప్రవేశ పెట్టనున్నారు. కాగా బుధవారం బడ్జెట్ అన్యాయాలపై చర్చించిన అనంతరం శాసనసభ నేటికి వాయిదా పడిరది. నేడు మధ్యాహ్నం సభ తిరిగి ప్రారంభం కానుంది. మధ్యాహ్నం 12 గంటలకు డిప్యూటీ సీఎం, రాష్ట్ర ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. తర్వాత బడ్జెట్పై చర్చ జరగనుంది. మంగళవారం సీఎం రేవంత్ రెడ్డి బడ్జెట్పై చర్చకు సమాధానం ఇచ్చే అవకాశం ఉంది.