యువత తలరాతను మార్చే పథకం ‘రాజీవ్‌ యువ వికాసం’

ఒకప్పుడు ఉద్యోగాల కోసం ధర్నాలు..
ఇప్పుడేమో నోటిఫికేషన్ల మధ్య గ్యాప్‌ కోసం ధర్నాలు
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, మార్చి 17 : పవిత్రమైన శాసనసభ నుంచి రాష్ట్ర యువత కోసం ప్రారంభిస్తున్న రాజీవ్‌ యువ వికాస పథకం యువత తలరాతను మారుస్తుందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఐదు లక్షల మంది యువతకు లబ్ధి చేసే విధంగా రాజీవ్‌ యువ వికాసం పథకం రూపకల్పన చేశామని ఆయన అన్నారు. స్వయం ఉపాధి పథకాలకు ఒకేసారి రూ. 6వేల కోట్లు కేటాయించిన ఘనత ప్రజా ప్రభుత్వానిదని, పేర్కొన్నారు. అసెంబ్లీ ప్రాంగణంలో రాజీవ్‌ యువ వికాసం పథకం ప్రారంభోత్సవ కార్యక్రమంలో  ఉప ముఖ్యమంత్రి పాల్గొని మాట్లాడారు. పవిత్రమైన శాసనసభ నుంచి రాజీవ్‌ యువ వికాసం పథకాన్ని ప్రారంభించుకోవడం గర్వంగా, సంతోషంగా ఉంది. ఏడాదిలోనే 56 వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందించిన ఘనత ప్రజా ప్రభుత్వానిది.

గత దశాబ్ద కాలం పైగా ఒక్కసారి కూడా గ్రూప్‌-1 పరీక్షలు నిర్వహించలేదు. ఒకే సంవత్సరంలో గ్రూప్‌-1 పరీక్షలు నిర్వహించి ఫలితాలు విడుదల చేసి యువతలో ఆనందోత్సాహాలు నింపామని అన్నారు. ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత అంతకు ముందు ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ యువత స్వయం ఉపాధి పథకాలకు ఒకసారి 6000 కోట్లు కేటాయించిన దాఖలాలు లేవన్నారు. ఈ ఘనత ప్రజా ప్రభుత్వానికి దక్కుతుందని అన్నారు. కొట్లాడి కోరి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో యువత ఆశలను గత పది సంవత్సరాలు అధికారంలో ఉన్న ప్రభుత్వం పట్టించుకోలేదని, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కార్పొరేషన్లను పూర్తిగా నిర్లక్ష్యం చేసిందన్నారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వొచ్చిన తర్వాత ఒక సంవత్సరంలోనే 56వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందించామన్నారు. దశాబ్ద కాలం అధికారంలో ఉన్న గత ప్రభుత్వం గ్రూప్‌-1 పరీక్షలు ఒక్కసారి కూడా నిర్వహించలేదని, ఒక సంవత్సరంలోనే గ్రూప్‌-1 పరీక్షలు నిర్వహించి ఫలితాలు విడుదల చేసి, యువత లో ఆనందోత్సాహాలను నింపామని చెప్పారు.

గత ప్రభుత్వ హయాంలో పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయాలని ధర్నాలు చేసే పరిస్థితి ఉండేదని, ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వొచ్చిన తర్వాత ప్రకటించిన జాబ్‌ క్యాలెండర్‌ ప్రకారంగా నోటిఫికేషన్లు విడుదల చేయడంతో పోటీ పరీక్షలకు ఒకేసారి సిద్ధం కావడం ఇబ్బందిగా ఉందని, నోటిఫికేషన్ల మధ్య కొంచెం గ్యాప్‌ ఇవ్వాలని కోరుతూ ఆందోళన చేసి స్థాయికి విరివిగా నోటిఫికేషన్లు ఇచ్చే పరిస్థితి ప్రభుత్వం తీసుకొచ్చిందన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలు రాని నిరుద్యోగ యువత వారి కాళ్లపై నిలబడి సమాజంలో తలెత్తుకొని ఆత్మగౌరవంతో బతకడానికి స్వయం ఉపాధి పథకాలు అందించాలని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఆలోచన చేసి సహచర మంత్రులందరితో మాట్లాడి రాజీవ్‌ యువ వికాస పథకం తీసుకొచ్చారని వివరించారు. ఆర్థిక శాఖ బాధ్యతలు చూస్తున్న మంత్రిగా ఈ పథకం అమలు కోసం విధివిధానాలు, నిధుల సమీకరణపై క్యాలెండర్‌ సిద్ధం చేయాలని సూచించామని, అన్ని శాఖలను సమన్వయం చేసుకొని ఈ పథకాన్ని రూపకల్పన చేసి నిర్దిష్టమైన క్యాలెండర్‌ రూపొందించి ప్రకటించామని చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి నివాసంలో ఆర్థిక శాఖ బాధ్యతలు చూస్తున్న తనతో పాటు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ శాఖలకు సంబంధించిన ఉన్నతాధికారులతో సమీక్షించి ఈ పథకం 100% అమలు కావడానికి కావలసిన విధివిధానాలు ఖరారు చేశారని చెప్పారు.

రాజీవ్‌ యువ వికాస పథకానికి సంబంధించి ఈ నెల 15 నోటిఫికేషన్‌ జారీ చేశామని, దరఖాస్తుల ప్రక్రియ మంగళవారం నుంచి ప్రారంభమవుతుందన్నారు. ఆన్‌ లైన్‌  పోర్టల్‌ ద్వారా దరఖాస్తుల డౌన్లోడ్‌ చేసుకొని మండల కార్యాలయంలో సంబంధిత అధికారులకు సమర్పించాలన్నారు. మండల అధికారులు వాటిని స్క్రూట్‌ ని చేసి జిల్లా అధికారులకు పంపించి కలెక్టర్‌ సమక్షంలో దరఖాస్తుల వెరిఫికేషన్‌ చేస్తారని, ఆ తర్వాత ఇన్చార్జి మంత్రి అప్రూవల్‌ చేయడం ద్వారా జూన్‌ 2న మంజూరు పత్రాలు పంపిణీ జరుగుతుందన్నారు. 50 వేల నుంచి 4 లక్షల వరకు స్వయం ఉపాధి పథకాల ద్వారా యువతకు ఆర్థిక సాయం చేయడానికి ప్రత్యేక రాష్ట్రంలోనూ అంతకుముందు ఉన్న ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఒకేసారి 6వేల కోట్ల రూపాయలు కేటాయించిన దాఖలాలు లేవన్నారు. పవిత్రమైన శాసనసభ నుంచి రాజీవ్‌ యువ వికాసం పథకాన్ని ప్రారంభించుకోవడం గర్వంగా సంతోషంగా ఉందన్నారు. మండలానికి వెయ్యి మంది యువతకు స్వయం ఉపాధి పథకాలు ఇందిరమ్మ రాజ్యంలో అందించే అవకాశం వచ్చినందున ఎమ్మెల్యేలు ఈ పథకానికి విస్తృత ప్రచారం కల్పించి ముందుకు తీసుకుపోవాలని పిలుపునిచ్చారు. ఎస్‌ఎల్బీసీ సమావేశంలో బ్యాంకర్లను సైతం ఈ పథకాన్ని ముందుకు తీసుకుపోవడానికి ఒప్పించమని సందర్భంగా వెల్లడిరచారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page