రాష్ట్రంలో ఏ పార్టీ కార్యాలయాలకు అనుమతుల్లేవు

బిఆర్‌ఎస్‌ ‌పార్టీ కూల్చివేతపై ‘సుప్రీమ్‌’‌కు వెళతాం: కంచర్ల
నల్లగొండ, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 18: ‌నల్లగొండలోని బీఆర్‌ఎస్‌ ‌పార్టీ ఆఫీస్‌ను కూల్చేయాలన్న హైకోర్టు ఆదేశంపై మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌ ‌రెడ్డి స్పందించారు. హైకోర్టు ఆదేశాలను గౌరవిస్తామని చెప్పారు. అలాగే ఇచ్చిన ఆదేశంపై అప్పీల్‌కు వెళ్తున్నాం. అవసరమైతే సుప్రీం కోర్టును ఆశ్రయిస్తామని తెలిపారు. రాష్ట్రంలో ఏ పార్టీ కార్యాలయానికి అనుమతి లేదన్నారు. కావాలనే కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని విమర్శించారు. కాంగ్రెస్‌ ‌పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీల నుంచి దృష్టి మరల్చేందుకే ఇలాంటి చర్యలకు పాల్పడుతుర‌ని ఆరోపించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *