ఈ శీర్షికలోనే 2024 నవంబర్ 7న రాసిన వ్యాసంలో ‘‘…తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కుల గణనను చేపట్టడం, ప్రత్యేకంగా రాహుల్ గాంధీ ఈ కార్యక్రమ ప్రార ంభం కోసం రావడం ఆహ్వానించదగిన సంగ తులే. కాని కులగణన విషయంలో కాంగ్రెస్ చరిత్ర వల్ల, తెలంగాణ ప్రభుత్వ చరిత్ర వల్ల, ఇతర రాష్ట్రాల కులగణన అనుభవాల వల్ల ప్రస్తుత ప్రయత్నం సఫలమవుతుందా, అవసరమైన ఫలితాలు సాధిస్తు ందా, ఈ కులగణన గణాంకాలతో నిజంగా వెనుకబ డిన కులాలకు ఏమైనా మేలు జరుగుతుందా అని అనుమానించవలసి వస్తున్నది. ప్రస్తుతం జరుపు తున్న కులగణనను దాని తార్కిక ముగింపుకు తీసుకు పోవడం, అంటే ఆ గణాంకాల మీద ఆధారపడిన అభి వృద్ధి, సంక్షేమ పథకాలు ప్రకటించడం ఈ ప్రభుత్వం చేస్తుందా? అలా చేసే చిత్తశుద్ధి ఉందా? లేక ఒక కుల సమూ హాన్నో, కొన్ని కుల సమూహాలనో ఆకర్షిం చడానికి, భ్రమల్లో ముంచడానికి ఒక ఎత్తుగడగా మాత్రమే ఈ ఆర్భాట ప్రయత్నం చేస్తున్నారా?’’ అని ప్రశ్నించాను.
‘‘తెలంగాణకే వస్తే, రాష్ట్రం ఏర్పడిన రెండు నెలల్లోనే, 2014 ఆగస్ట్ 19న అప్పటికి కె చంద్రశేఖర రావు ప్రభుత్వం, ప్రస్తుత కులగణన కన్నా ఎక్కువ ఆర్భాటంతో సమగ్ర కుటుంబ సర్వే అనే ప్రహసనాన్ని ఒకే ఒక్క రోజులో జరిపింది. నాలుగు లక్షల మంది ప్రభుత్వోద్యోగులు, 98 ప్రశ్నల ప్రశ్నపత్రంతో రాష్ట్ర జనాభాలో ప్రతి ఒక్కరి సమాచారాన్నీ సేకరించారు. అత్యంత నిశితమైన సామాజిక ఆర్థిక సర్వేగా ప్రగల్భాలు పలికిన ఆ సర్వే కులాన్ని కూడా తన పరిశీలనాంశాలలో చేర్చింది. కాని తర్వాత ఐదు సంవత్సరాలలోనూ, మళ్లీ గెలిచాక మరొక ఐదు సంవత్సరాలలోనూ ఆ సమగ్ర కుటుంబ సర్వే ఊసెత్తిన వారే లేకపోయారు. ఆ గణాంకాలు ఏమయ్యాయో, అప్పటి ప్రభుత్వం ఆ గణాంకాలను బైటపెట్టడానికి, వాటి ఆధారంగా ఏవైనా చర్యలు తీసుకోవడానికి ఎందుకు సంకోచించిందో ఎవరికీ తెలియదు. ప్రస్తుత పటాటోపం చూస్తుంటే ఇది పది సంవత్సరాల తర్వాత మళ్లీ అటువంటి బురిడీనే అనిపిస్తున్నది’’ అని కూడా రాశాను.
మూడు నెలలు కూడా తిరగకుండానే నా మాటల్లో చాలా భాగం నిజం కావడం నాకేమీ సంతోషంగా లేదు. అంత పెద్ద ఎత్తున చేసిన వాగ్దానాలలో కొంతలో కొంతయినా సాకారమవుతాయనీ, నా అనుమా నాలు కొన్ని నిజం కాదని తేలుతా యనీ అనుకున్నాను. కాని ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి కులగణన నివేది కను బైట పెట్టకుండా ఉండడానికీ, కేవలం ఆ నివేదిక ఆధారంగా తయారు చేసిన ఆరు పేజీల వివర ణను మాత్రమే బైట పెట్టడానికీ నిర్ణయించుకుని నా అనుమానాలు నిజం చేశారు. ఆ ఆరు పేజీల నివేదిక విడివిడిగా కులాల వారీ జనాభాను కాక ఎస్ సి, ఎస్ టి, బీసీ, ఓసీ అనే స్థూల విభజనను మాత్రమే వెల్లడిం చింది. ఆ మాత్రం వివరాలు ఇదివరకే అందరికీ తెలిసినవే. కులగణన నివేదికను, ఆ మేరకు రిజర్వే షన్లు కల్పించడానికి చేసిన బిల్లును సభ ముందు ఉంచడం కోసం ఏర్పాట యిన శాసన సభ సమావేశం ఎస్ సి వర్గీకరణ నిర్ణయం ప్రకటనతో సరిపె ట్టుకోవలసి వచ్చింది.
అసలు కులగణన, దాని ఆధారంగా విధాన నిర్ణయాలు అనేవే కందిరీగల తుట్టె వంటివి గనుకనే కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం కులగణన జరిపి కూడా నివేదిక బైటపెట్టలేదు. సమగ్రమైన కులగణన కాకపోయినా, కులం వివరాలు కూడా సేకరించిన టిఆర్ఎస్ ప్రభుత్వపు సమగ్ర కుటుంబ సర్వే నివేదిక కూడా బైట పెట్టలేదు. ఇప్పుడు అది ఎక్కడో ఒక చోట వెబ్ సైట్ మీద పెట్టామని చెపుతున్నారు గాని ఆ పది సంవత్సరాలలో అది బైట పెట్టలేదని వచ్చిన విమర్శలకు అప్పుడు జవాబు చెప్పనే లేదు. ఇప్పుడు పరస్పర వాద వివాదాలకు మాత్రమే అది పనికి వస్తున్నట్టుంది.
ఇప్పుడు అసంపూర్ణంగా వెలువడిన కులగణన నివేదిక గురించీ, గందరగోళంగా వెలువడిన ఎస్ సి వర్గీకరణ గురించీ, వాటిలోని లోపాల గురించీ మాట్లాడు కోవలసినది చాలా ఉంది. శాసన సభలో ఆరు పేజీల నివేదిక ప్రవేశ పెట్టడానికి రెండు రోజుల ముందు ప్రణాళికా విభాగం అధికారులు పూర్తి నివేదికను మంత్రివర్గ ఉపసంఘానికి అందజేశారని వార్తలు వచ్చాయి. నివేదిక వివరాలను మంత్రివర్గ ఉపసంఘం సభ్యులు పత్రికలకు తెలియజేశారు. రాష్ట్ర జనాభాలో ఎస్సీలు 17.43 శాతం, ఎస్టీలు 10.45 శాతం, బీసీలుగా గుర్తింపు పొందిన ముస్లింల (10.08 శాతం) తో కలిపి మొత్తం బీసీలు 56.33 శాతం, అందులో ముస్లింలను తీసివేస్తే బీసీలు 46.25 శాతం, ఓసీలుగా గుర్తింపు పొందిన ముస్లింల (2.48 శాతం) తో కలిపి మొత్తం ఓసీలు 15.79 శాతం, మొత్తం ముస్లింలు 12.56 శాతం అని వారు ప్రకటించారు. మొత్తం రాష్ట్ర జనాభా 3,54,77,554 కాగా, అందులో ఎస్సీలు 61,84,319, ఎస్టీలు 37,05, 929, బీసీలు 1,64,09,179, బీసీ ముస్లింలు 35,76,588, ఓసీ ముస్లింలు 8,80,424, ఓసీలు 47,21,115, మొత్తం ముస్లింలు 44,57,012 అని ఆ గణాంకాలు తెలిపాయి. అలాగే రాష్ట్రంలోని 3.70 కోట్ల జనాభాలో, 3.54 కోట్ల మంది సర్వేలో పాల్గొన్నారని, 1,12, 15,134 కుటుంబాలను సర్వే చేశా మని, ఒక లక్షా నాలుగు వేల మంది ఎన్యూ మరేటర్లు, సూపర్వైజర్లు 58 రోజుల పాటు ఈ సర్వే చేశారని కూడా చెప్పుకున్నారు.
ఈ గణాంకాలన్నీ సరే గాని, ఇంతకీ ఇది ఇంతకాలంగా అందరూ కోరుకున్న, కాంగ్రెస్ కూడా వాగ్దానం చేసిన కులగణన అవునా కాదా కచ్చితంగా తెలియదు. కులగణన అంటే. 1931 జనగణన తర్వాత ఇంతవరకూ జరగని, గత కొన్ని సంవత్సరాలుగా ఎందరో అడుగుతున్న కులగ ణన. ఒక్కొక్క కులంలో, ఉపకులంలో ఎంత మంది ఉన్నారో కచ్చితంగా నమోదు చేసి, మొత్తం జనాభాలో ఆ కులం ఎంత శాతంలో లెక్కించడం. అది మొదటి మెట్టు కాగా, ఆ తర్వాత ఆ జనాభా దామాషాకు తగినట్టుగా ఆ కులానికి విద్యలో, ఉద్యోగాలలో, సంపదలో, అవకాశాలలో వాటా అందిందా లేదా చూడడం రెండో మెట్టు. అలా అందకపోతే, లేదా తక్కువగా అంది ఉంటే ఆ మిగులును పూరించే పాలనా పరమైన చర్యలు తీసుకోవడం మూడో మెట్టు.
అటువంటి సమగ్రమైన కులగణన, తదనంతర చర్యలు ఇంతవరకూ ఎక్కడా జరగలేదు గాని, కనీసం మొదటి మెట్టు ప్రయత్నాలు అరకొరగానైనా బిహార్ లో జరిగాయి. నితిశ్ కుమార్ నాయకత్వంలో బిహార్ ప్రభుత్వం కులగణన జరిపి 2023 అక్టోబర్ 2న నివేదిక బైటపెట్టింది. ఆ నివేదిక ఆధారంగా వెనుకబడిన కులాల రిజర్వేషన్లు పెంచడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నించింది గాని, ఆ ప్రయత్నాలు కోర్టు వివాదంలో చిక్కుకున్నాయి. భాజపాతో పొత్తు లేకముందు కులగణన జరిపిన నితీశ్ పొత్తు కుదిరి నాక కులగణన మీద ఆ మాత్రం ఆసక్తిని కూడా కోల్పోయాడు. ఆ కులగణన నివేదిక మొత్తం రాష్ట్రంలో వెనుకబడిన కులాల జనాభా 63 శాతం వంటి కొన్ని ముఖ్యమైన అంశాలు ప్రకటించింది. అందులో కూడా పొరపాట్లు, హస్తలాఘవాలు ఉన్నాయి. రాష్ట్రంలోని 209 కులాలలో ఏ ఒక్క కులపు జనాభా ఐదు శాతానికి మించి లేకపోగా, గ్వాలా, అహిర్, గోరా, ఘాసీ, మెహర్, సదగోప్, లక్ష్మినారాయణ్ గోలా అనే ఏడు కులాలను యాదవ్ కులంలో కలిపేసి, ఒక్క యాదవ్ కులం జనాభా మాత్రమే 14 శాతం ఉన్నట్టుగా పెంచి చూపారు.
ఆ లోపాలు ఉన్నప్పటికీ, బిహార్ లో జరిపినట్టుగా తెలంగాణలో ప్రతి ఒక్క కులాన్నీ, ఉపకులాన్నీ పరిగణనలోకి తీసుకున్నారా లేదా తెలియదు. అసలు తమ దగ్గరికి ఎన్యూమరేటర్లు రానేలేదని చెపుతున్న వారు ఎందరో ఉన్నారు గనుక, దాదాపు పదహారు లక్షల మంది సమాచారం ఇవ్వనే లేదని అంటున్నారు గనుక, అసలు జనగణన జరగవలసినట్టుగా జరగలేదనే అనుకోవాలి. ఆ పూర్తి నివేదికను కూడా బైటపెట్టడానికి సంకోచిస్తున్నారంటే అందులో ఉన్న లొసుగులేవో వారికే తెలిసి ఉండాలి.
అసలు కులగణన, దాని ఆధారంగా విధాన నిర్ణయాలు అనేవే కందిరీగల తుట్టె వంటివి గనుకనే కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం కులగణన జరిపి కూడా నివేదిక బైటపెట్టలేదు. సమగ్రమైన కులగణన కాకపోయినా, కులం వివరాలు కూడా సేకరించిన టిఆర్ఎస్ ప్రభుత్వపు సమగ్ర కుటుంబ సర్వే నివేదిక కూడా బైట పెట్టలేదు. ఇప్పుడు అది ఎక్కడో ఒక చోట వెబ్ సైట్ మీద పెట్టామని చెపుతున్నారు గాని ఆ పది సంవత్సరాలలో అది బైట పెట్టలేదని వచ్చిన విమర్శ లకు అప్పుడు జవాబు చెప్పనే లేదు. ఇప్పుడు పరస్పర వాద వివాదాలకు మాత్రమే అది పనికి వస్తున్నట్టుంది.
ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలన్నిటికీ వర్తించే విధంగా ఒక విధాన నిర్ణయంగా ‘తెలంగాణ వెనుకబడిన తరగతులు, షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల (రాష్ట్రంలోని విద్యా సంస్థల్లో సీట్ల రిజర్వేషన్, రాష్ట్ర సర్వీసు నియామకాలు, ఉద్యోగాలు, స్థానిక సంస్థల్లో సీట్ల రిజర్వేషన్) చట్టం, 2025 తేవడానికి వీలుగా ఒక బిల్లు ప్రవేశపెట్టాలని ముసాయిదా కూడా తయారు చేసి, అందుకోసమే శాసనసభ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి చివరికి దాన్ని ప్రవేశ పెట్టకుండానే ముగించారు.
ప్రస్తుతం పూర్తి నివేదిక అలా ఉంచి, విడుదల చేసిన గణాంకాలు కూడా తప్పుల తడకలు అని భిన్న కోణాల నుంచి విమర్శలు వస్తున్నాయి. విమర్శలు చేస్తున్న వారి స్వప్రయోజనాలు, రాజకీయ ఉద్దేశాలు ఎలా ఉన్నా, ప్రభుత్వం కులగణన పేరుతో ప్రకటిస్తున్న గణాంకాలు పారదర్శకంగా, కచ్చితంగా లేవనేది మాత్రం వాస్తవం.
ఒకవైపు ఆ కొరివితో తల గోక్కుంటూనే, ప్రభుత్వం ఎస్ సి వర్గీకరణ అనే మరొక కొరివిని కూడా చేత పట్టింది.ముప్పై సంవత్సరాలుగా నలుగుతున్న ఆ ఘర్షణ సుప్రీం కోర్టు తీర్పుతో ఒక కొలిక్కి వచ్చినట్టు కనిపించింది గాని, కరవమంటే కప్పకు కోపం, విడవమంటే పాముకు కోపం అనే సామెత వంటి వ్యవహారం అది. మాల, మాదిగ వంటి ఎక్కువ జనాభా గల కులాలతో పాటు, కొన్ని వందల మంది నుంచి కొన్ని లక్షల మంది దాకా ఉన్న 57 ఎస్ సి ఉపకులాలు ఉన్నాయి. వీటిలో ఏ ఒక్క కులానికీ దాని జనాభాకు తగిన నిష్పత్తిలో విద్యా, ఉద్యోగ అవకాశాలు అందలేదు. అసలు విద్య గాని, ఉద్యోగాలు గాని అందని కులాలు కూడా ఇంకా ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. ఈ స్థితిలో మాల, మాదిగల మధ్య ఘర్షణగా మాత్రమే గుర్తింపు పొందిన వివాదం, మాల ఉపకులాలు, మాదిగ ఉపకులాలు అనే అనవసర విభజనను తెచ్చింది. అలా నాలుగు తరగతులుగా ఉండిన సమస్యను, ఇప్పుడు సుప్రీం కోర్టు తీర్పులో రాష్ట్ర ప్రభుత్వాలు వర్గీకరణ చేయవచ్చుననే సూచనను అనుసరించి, రేవంత్ రెడ్డి ప్రభుత్వం జస్టిస్ షమీమ్ అక్తర్ ఏక సభ్య కమిషన్ ను నియమించింది.
రాష్ట్రంలోని మొత్తం 59 ఎస్సీ కులాలను మూడు గ్రూపులుగా వర్గీకరించడం, ఉద్యోగాల భర్తీలో ఆయా గ్రూపులకు నిష్పత్తిని బట్టి రిజర్వేషన్ కోటాలు నిర్ణయించడం, రోస్టర్ పాయింట్ల విభజన అనే మూడు సిఫారసులను అంగీకరించిన ప్రభుత్వం, క్రీమీ లేయర్ ను గుర్తించి రిజర్వేషన్ నుంచి మినహాయించడం అనే సిఫారసును మాత్రం పక్కన పెట్టింది. సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా అత్యంత వెనుకబడిన కులాలుగా 15 కులాలను గ్రూప్ 1 గా, మధ్యస్థంగా లబ్ధి పొందిన కులాలుగా 18 కులాలను గ్రూప్ 2 గా, మెరుగైన ప్రయోజనాలు పొందిన కులాలుగా 26 కులాలను గ్రూప్ 3గా విభజిం చారు. అయితే గతంలోని నాలుగు తరగతు లకు, ఇప్పటి మూడు తరగతులకు మధ్య సమన్వయం లేదని, గందరగోళం జరిగిందని, మూడు తరగతుల విభజన అశాస్త్రీయంగా జరిగిందని, గతంలో మాల, మాదిగ ఉప కులాలుగా చూపిన వాటిని ఇప్పుడు మరొక రకంగా చూపారని విమర్శలు వస్తున్నాయి. వెనుకబాటు తనం, జనాభా అనే రెండు ప్రాతిపదికలనూ హేతుబద్ధంగా కాక ఇష్టారాజ్యంగా వాడారని అంటున్నారు.
ఆ రెండు పనులు మాత్రమే కాదు, వాటితో కలిసిన మరొక పనిని కూడా ప్రభుత్వం గందరగోళం చేసింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలన్నిటికీ వర్తించే విధంగా ఒక విధాన నిర్ణయంగా ‘తెలంగాణ వెనుకబడిన తరగతులు, షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల (రాష్ట్రంలోని విద్యా సంస్థల్లో సీట్ల రిజర్వేషన్, రాష్ట్ర సర్వీసు నియామకాలు, ఉద్యోగాలు, స్థానిక సంస్థల్లో సీట్ల రిజర్వేషన్) చట్టం, 2025 తేవడానికి వీలుగా ఒక బిల్లు ప్రవేశపెట్టాలని ముసాయిదా కూడా తయారు చేసి, అందుకోసమే శాసనసభ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి చివరికి దాన్ని ప్రవేశ పెట్టకుండానే ముగించారు. మనసుంటే మార్గం ఉంటుంది అనేది పాత వివేకం. ఎంచుకున్న మార్గాలు ఇంత అల్లకల్లోలంగా ఉన్నాయంటే అసలు విధానకర్తలకు మనసు ఉందా అనే ప్రశ్న వస్తుంది.