టెక్నాలజీ సాయంతో ప్రజల ముంగిటకు పౌర సేవలు

ఐటి, ప‌రిశ్ర‌మ‌ల శాఖ‌ మంత్రి శ్రీధర్ బాబు
ఁమీ టికెట్ఁ యాప్ ను ప్రారంభించిన మంత్రి

హైదరాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 9 : ఇక నుంచి టికెట్ ఏదైనా ామీ టికెట్ ్ణ యాప్ ఒక్కటి మీ దగ్గరుంటే చాలు. ఆర్టీసీ, మెట్రో టికెట్లు, తెలంగాణలోని అన్ని ప్రముఖ దేవాలయాల్లో దర్శనం, ఇతర సేవలకు సంబంధించిన టికెట్లు, పార్కులు, ఇతర పర్యాటక స్థలాల్లో క్యూలైన్లలో నిరీక్షించాల్సిన అవసరం లేకుండా ఎంట్రీ టికెట్లను ఒకే ఒక్క క్లిక్ తో మీసేవ రూపొందించిన టికెట్ యాప్‌లో బుక్ చేసుకోవచ్చు. తెలంగాణా డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ సర్వీసెస్ డెలివరీ(ఈఎస్డీ) రూపొందించిన ఈ ామీ టికెట్్ణ యాప్‌ను ఐటీ, పరిశ్రమల మంత్రి శ్రీధర్ బాబు గురువారం సచివాలయంలో లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ాప్రజలకు సుపరిపాలన అందించాలన్నదే సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం లక్ష్యమ‌ని అన్నారు.

టెక్నాలజీ సాయంతో పౌర సేవలను ప్రజల ముంగిటకు చేరవేస్తున్నాం. ఈ ప్రక్రియలో సంబంధిత నిపుణులను భాగస్వామ్యం చేస్తున్నాం. అన్ని రకాల టికెట్ బుకింగ్స్ ను ఒకే ప్లాట్ ఫాంపైకి తెచ్చేందుకు వీలుగా ఈ యాప్ ను రూపొందించాం. రాబోయే రోజుల్లో ఇలాంటి తరహా యాప్ లను మరిన్ని అందుబాటులోకి తీసుకొస్తాం్ణ అని మంత్రి శ్రీధ‌ర్ బాబు వివరించారు. ాఈ యాప్ లో తెలంగాణలోని 15 ప్రముఖ దేవాలయాలు, 129 పార్కులు, 54 బోటింగ్ ప్రదేశాలు, జూ, మెట్రో, ఆర్టీసీ, మ్యూజియాలు, ప్లే అండ్ ఎంటర్ టైన్ మెంట్ జోన్స్ కు సంబంధించిన టికెట్లను తీసుకోవచ్చు.

జీహెచ్ఎంసీ పరిధిలోని కమ్యూనిటీ హాళ్లు, జిమ్‌లు, స్పోర్ట్ కాంప్లెక్స్ లను బుకింగ్ చేసుకోవచ్చు. మీరు ఎంచుకున్న లొకేషన్ కు సమీప ప్రాంతాల్లోని చూడదగిన ప్రదేశాలుంటే.. ఆ సమాచారం కూడా యాప్‌లో ఆటోమేటిక్ గా కనిపిస్తుంద‌ని తెలిపారు. ాఈ యాప్‌ను చాలా సులువుగా వినియోగించుకోవచ్చు. యూపీఐ ద్వారా చెల్లింపులు చేయోచ్చు. ఇతర ప్లాట్ ఫాంల మాదిరిగా ఈ యాప్ లో అదనంగా ఎలాంటి ఛార్జీలను వసూలు చేయం్ణ అని మంత్రి వివరించారు. కార్యక్రమంలో మీ సేవ కమిషనర్ రవి కిరణ్, పరిశ్రమల శాఖా కమిషనర్ డా.జి.మల్సూర్, జూపార్క్స్ డైరెక్టర్ డా.సునీల్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page