Category ప్రత్యేక వ్యాసాలు

భారత విదేశాంగ విధానానికి అగ్నిపరీక్ష

“ఇరాన్‌కు ప్రత్యక్ష మద్దతు ప్రకటించే అవకాశం పరిమితంగానే ఉన్నప్పటికీ, శాంతి, చర్చలు, అంతర్జాతీయ చట్టాల పరిరక్షణ, అభివృద్ధి చెందుతున్న దేశాల ప్రయోజనాల పరిరక్షణ వంటి అంశాలపై బలమైన ఉమ్మడి వైఖరిని రూపొందించగలిగితే, ఈ సదస్సు భారత్ ‌కు దౌత్యపరంగా ఒక పెద్ద విజయంగా నిలిచే అవకాశం ఉంది. అదే సమయంలో, భారత విదేశాంగ విధానం “ఏ…

లక్షలాది యువత ఆశలకు రక్షణ కవచం

A Protective Shield for the Aspirations of Millions of Youth

పేపర్ లీకేజీల నియంత్రణ చట్టం భారతీయ సాంస్కృతిక విశిష్టతలో విద్యకు అత్యున్నత పీఠం ఉంది. “విద్యా ధనం సర్వధన ప్రధానమ్” అని ప్రాచీన సంస్కృత నానుడి చాటి చెప్పినట్లుగానే, విజ్ఞానం మానవాళికి వికాసాన్ని అందించే అమూల్యమైన సంపద. వేమన యోగి తన పద్యంలో “నిజమునకు నిలువ గలవాడే నరుడగు” అని వచించిన రీతిలో, సత్యం, నిష్పాక్షికత,…

మాధురీ లేక్

గిరియానం – 24  అరుణాచల్ ప్రదేశ్ లోని చైనా ఇండో బార్డర్ కు వెళ్ళడానికిఅప్పటిదాకా మేం ప్రయాణించిన వాహనానికి అనుమతి లేనందువల్లరాహుల్ మరో వాహనాన్ని తీసుకు వచ్చాడు. వాహనానికి విడిగా ఐదువేలరూపాయలు చెల్లించాలి. దానితోపాటు ప్రత్యేక అనుమతి కూడా తీసు కోవాలి. ఆ ప్రదేశం పదిహేనువేల రెండు వందల అడుగుల ఎత్తులోఉండడం, ఇరుకైన పర్వతశ్రేణుల్లో ప్రయాణించాలి కనుక ప్రత్యేకరిజిస్ట్రేషన్ ఉన్న వాహనాలనే అనుమతిస్తారట. ఈ జీప్ డ్రైవర్ కొడుకుకుఆరోగ్యం బాగాలేనందువల్ల తాను కొంతదూరం వచ్చి మా డ్రైవర్ రాహల్ కేజీప్ అప్పగించి వెళ్ళిపోయాడు.   ఉదయం ఏడుగంటలకు మా ప్రయాణం మొదలైంది.ఎటుచూసినా ఎత్తైన పర్వతాలు, భిన్న వర్ణం పువ్వులు, దారి పొడుగునా మిలిటరీ ఆనవాళ్ళు, సరస్సులు, జలపాతాలతో దారి అంతా చూపుతిప్పనివ్వ లేదు. పర్పుల్, ఎల్లో కలర్ ఫ్లవర్స్ ఈ సమయంలో ఇక్కడమాత్రమే వికసిస్తాయట. చిన్న చిన్న తెల్లని పువ్వులు ఆకాశం నుంచితారలు రాలి పడినట్లుగా అంతటా విస్తారంగా వికసించి ఉన్నాయి. ఉదయం పదిగంటలకు ” షెంగ్స్టర్ త్సో “లేక్ కు చేరుకున్నాం. ‘ త్సో ‘ అంటే టిబెటన్ భాషలో ‘ సరస్సు ‘ అని అర్థం. తవాంగ్గ్రామం నుంచి సుమారు ముప్ఫై కిలోమీటర్ల దూరం. మాకు దాదాపుమూడు గంటల సమయం పెట్టింది. పన్నెండువేల నాలుగువందల అరవైయేడు అడుగుల ఎత్తులో పర్వతాల నడుమ ఉన్న అందమైన సరస్సుఇది. 1950 ఆగస్టు 15 తేదీన 8.6 మాగ్నిట్యూడ్ భూకంపం వచ్చిందట.  అపుడు కొండలు విరిగిపడి లోయలోని ఒక వాగుకు అడ్డo పడ్డాయి. అలానీరు నిలిచి ఈ సరస్సు ఏర్పడింది. భూకంపం రావడానికి ముందుఅడవిలో ఉన్న చెట్లు ఇప్పటికీ ఈ సరస్సులో నిలిచి ఉండి ప్రత్యేకఅందాన్ని తెచ్చి పెట్టాయి. భూ కంపంలో ప్రాణాలు కోల్పోయిన వారి ఆత్మలుఇక్కడ ఉంటాయని, అందుకే చెట్లు యింకా నిలబడి ఉన్నాయని, స్థానిక ముంపాతెగ ప్రజలు ఈ సరస్సును పవిత్రమైనదిగా భావిస్తారు. ఇది ఏర్పడి డెబ్బై యారు యేళ్ళు అయింది. షారుఖాన్, మాధురీ దీక్షిత్ నటించిన ‘ కోయిల్ ‘ అనే సినిమాను 1997లో ఇక్కడ చిత్రీకరించారు. అప్పటినుంచి పర్యాటకంగాప్రసిద్ధి పొందింది. ఆ తర్వాత  అసలు పేరు మాయమై ” మాధురీ లేక్ ” గాపేరుపొందింది. ఇంత అద్భుతమైన ప్రకృతి సౌందర్యంతో ఉన్న సరస్సుస్థానికంగా పేరు కోల్పోయి ఒక సినీనటి పేరుతో స్థిరపడడం బాధగాఅనిపించింది. మాధురీ దీక్షిత్ కూడా అందమైన నటి కదా! అని నాకునేను నచ్చ చెప్పుకున్నాను. ఇక్కడ ఒక గంట సమయం గడిపి, పక్కనే ఉన్నకెఫ్పిటేరియాలో వేడి వేడి టీ తాగి సుమారు ఒక కిలో మీటర్ దూరంలో పార్క్ చేసిన వాహనం దగ్గరకు వెళ్ళాను. అక్కడినుంచి మా ప్రయాణం దాదాపు పది కిలోమీటర్లదూరంలో ఉన్న ఇండో – చైనా బార్డర్ బూమ్లా పాస్ కు. మధ్యలో తీస్రాగురుద్వార్ దగ్గర ఆగాం. దీనిని ఆర్మీ నిర్వహిస్తోంది . పైకి గురుద్వారాలోకివెళ్ళడానికి  రెండు వందల యాభై మెట్లు ఉన్నాయి. కిందనే లంగరుపెడుతున్నారు. టీ, పాయసం రెండూ ఉన్నాయి. మేం పాయసం తీసు కున్నాం. అక్కడినుంచి బూమ్లా పాస్ కు చేరుకున్నాం. రెండు మూడుచోట్లమేం తీసుకున్న ప్రత్యేక అనుమతి పత్రాన్ని పరిశీలించారు. పార్కింగ్లోవాహనాన్ని పెట్టి ఒక కెఫ్టేరియాలో నుంచి వెళ్ళి బయటకురావాలి.అప్పుడు ఎంతమంది బార్డర్ ప్రదేశంలోకి వెళ్ళేది తనిఖీ చేస్తారు.ఒక్కసారికి సుమారు ఇరవై,  ముప్పైమందిని…

కూలీ నోట రాజ్యాంగం మాట

“అక్షర జ్ఞానం లేని ఇర్ఫాన్ గూగుల్ తల్లిని ప్రార్థించి అనేక విషయాలు నేర్చుకున్నాడు. భగత్ సింగ్, అంబేద్కర్ సిద్ధాంతాల్ని, భారత రాజ్యాంగ స్ఫూర్తిని అవగతం చేసుకున్నాడు.మొబైల్ ఫోన్లోటైప్ చేయడం కూడా రాని ఇర్ఫాన్ తన స్మార్ట్‌ఫోన్‌లో గూగుల్వాయిస్ సెర్చ్, యూట్యూబ్ వీడియోల ద్వారా దేశ రాజకీయాలు, రాజ్యాంగం, ప్రజాస్వామ్యం, కార్మిక చట్టాలు, భగత్ సింగ్ రచనలు,…

ఉద్యోగ‌, పెన్ష‌న‌ర్ల‌కు ఇచ్చిన హామీల అమ‌లు ఇంకెప్పుడు?

ప్రభుత్వ పాలనలో ఉద్యోగులు భాగం. ప్రభుత్వ పాలన సక్రమ నిర్వ‌హ‌ణ‌కు ఉద్యోగుల కృషి ఎంతగానో దోహదపడుతుంది. ప్రభుత్వ పథకాలు కానీ, సంక్షేమ పథకాలు కానీ, అభివృద్ధి కార్యక్రమాలు కానీ, విద్యా, వైద్యం కానీ, రాష్ట్రంలోని వివిధ శాఖ‌ల‌కు చెందిన‌ పథకాలు ప్రజలకు సక్రమంగా అందాలంటే ఉద్యోగులు నిజాయితీగా, మంచిగా పనిచేయాల్సి ఉంటుంది. ఉద్యోగులు సక్రమంగా పనిచేసినప్పుడు…

నిబ‌ద్ధ‌త శాశ్వత స్నేహానికి పునాది!

“కరుణ మరియు సామర్థ్యం రెండూ తోడైనప్పుడు స్నేహంలో చేసిన వాగ్దానాలకు అపారమైన బరువు ఉంటుంది. ఈ సంఘటన ఒక ముఖ్యమైన ఆధునిక పాఠాన్ని ప్రతిబింబిస్తుంది. నిజమైన మద్దతు నిష్క్రియాత్మ‌క‌ సానుభూతికి మించి ఉండాలి. దానికి ప్రియమైన వారిని హాని మరియు అన్యాయం నుండి రక్షించడానికి చురుకైన నిబద్ధత అవసరం..” (వనం జ్వాలా నరసింహారావు) నిజమైన స్నేహం…

కేంద్ర జల శక్తి శాఖ నుండి తెలంగాణకు సానుకూల ఆదేశాలు

“గతంలో ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో రేవంత్ రెడ్డికుండిన రాజకీయ సాన్నిహిత్యాన్ని ప్రయోగించి బిఆర్ఎస్ పార్టీ నేతలు తెలంగాణ నీళ్లన్నీ ఆంధ్ర ప్రదేశ్ కు ధారాదత్తం చేస్తున్నారని పదే పదే ఆరోపించుతుంటారు. గాని వాస్తవంలో ఇటీవల కాలంలో అంతర్ రాష్ట్ర జల వివాదాల్లో రేవంత్ రెడ్డి పై చేయి సంపాదించుతున్నారు. అద్దో పులి ఇద్దో…

చట్టానికి ముసుగు.. రక్షణకే ముల్లు..!

“మహిళలకు భద్రత కల్పించాలంటే ప్రతి పోలీస్ స్టేషన్‌లో మహిళా ఫిర్యాదుదారుల పట్ల సున్నితమైన వైఖరి అవసరం. మహిళా సహాయ డెస్క్‌లను బలోపేతం చేయడం, ఫిర్యాదుల నమోదు ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించడం, విచారణ సమయంలో చట్టబద్ధమైన విధానాలను పాటించడం, అవసరమైన చోట మహిళా పోలీసు సిబ్బంది సమక్షాన్ని నిర్ధారించడం వంటి చర్యలు మరింత విశ్వాసాన్ని పెంచుతాయి..” మహిళలపై…

బడుగు ‛బతుకుబండి’ని బుగ్గి చేస్తున్న ఇ20 పెట్రోల్!

“ఇథనాల్‌ను పర్యావరణ అనుకూల ఇంధనంగా ప్రచారం చేయడం ఒక అతిపెద్ద పర్యావరణ మోసం అని పర్యావరణ శాస్త్రవేత్తలు వాదిస్తున్నారు. భారతదేశంలో ఒక లీటరు ఇథనాల్ ఉత్పత్తికి వేలాది లీటర్ల నీరు అవసరమవుతున్నది. ప్రత్యేకంగా మిగులు బియ్యం నుంచి ఇథనాల్ తయారుచేసే విధానం వల్ల దేశ ఆహార భద్రత ప్రమాదంలో పడడమే కాకుండా భూగర్భ జలాలు పూర్తిగా…