కేంద్ర ఉద్యోగులకు 3 శాతం డీఏ పెంపు

  • రబీ సీజన్‌లో పంటల కనీస మద్దతు ధర పెంపు
  • కేంద్ర మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు

న్యూదిల్లీ,అక్టోబర్‌16: మోదీ మంత్రివర్గ సమావేశంలో పలు కీలక ప్రకటనలు చేశారు. ఒకవైపు కేంద్ర ఉద్యోగులకు 3 శాతం డీఏ పెంపు కానుకగా ఇస్తూనే మరోవైపు రైతులకు కూడా ప్రభుత్వం భారీ దీపావళి కానుకగా ఇచ్చింది. వాస్తవానికి రబీ సీజన్‌లో పంటల కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ)ని కేంద్రం పెంచింది. ఇందులో గోధుమ పంటకు క్వింటాల్‌కు రూ.150, ఆవాల పంటపై క్వింటాల్‌కు రూ.300 చొప్పున పెంచారు.రైతులకు దీపావళి కానుకగా రావి పంటల ఎంఎస్‌పిని కూడా పెంచాలని మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించారు. నివేదిక ప్రకారం.. మార్కెటింగ్‌ సీజన్‌ 2025-26 కోసం ప్రభుత్వం రబీ పంటలకు కొత్త కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ)ని నిర్ణయించింది. ఇందులోభాగంగా గోధుమల ఎంఎస్‌పి క్వింటాల్‌కు రూ.150 పెంచి రూ.2,425కి చేరుకుంది.

ఇది ఇప్పటివరకు క్వింటాల్‌కు రూ.2,275గా ఉంది. ఆవాలపై ఎంఎస్‌పీ క్వింటాల్‌కు రూ.300 పెంచి క్వింటాల్‌కు రూ.5,650 నుంచి రూ.5,950కి పెరిగింది. అదేవిధంగా, కందుల ఎంఎస్‌పిని క్వింటాల్‌కు రూ.210 పెంచాలని నిర్ణయించారు. దాని కొత్త ఎంఎస్‌పి క్వింటాల్‌కు రూ.5,650గా మారింది. ఇది గతంలో క్వింటాల్‌కు రూ.5440గా ఉంది. ఇది కాకుండా కందులుపై ఎంఎస్‌పి క్వింటాల్‌కు రూ.275 పెంచి క్వింటాల్‌కు రూ.6,425 నుంచి రూ.6,700కి పెంచారు. కుసుమ ధర రూ.5,800 నుంచి రూ.140 పెరిగి రూ.5,940కి చేరింది.రైతులకు వారి పంటలకు ప్రభుత్వం హామీ ఇచ్చే కనీస మద్దతు ధర ఎమ్‌ఎస్పీ అంటారు. ప్రభుత్వం రైతుల నుంచి పంటలను కొనుగోలు చేసే ధర ఇది. పంటల ధరల్లో హెచ్చుతగ్గుల వల్ల నష్టాల నుంచి రైతులను రక్షించడమే దీని లక్ష్యం. ఈ సందర్భంగా అశ్విని వైష్ణవ్‌ మాట్లాడుతూ .. రైతుల సంక్షేమం కోసం కేంద్రం కట్టుబడి ఉందన్నారు. పంజాబ్‌-హర్యానా సరిహద్దులో ఉన్న రైతుల గురించి కూడా ప్రస్తావించారు. రైతుల సంక్షేమానికి పూర్తి కట్టుబడి ఉన్నామని, రైతులకు మేలు చేసే అనేక నిర్ణయాలు తీసుకున్నామన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *