‌ఫ్రైడే డ్రైడేగా పాటిద్దాం

హైదరాబాద్‌,, ‌ప్రజాతంత్ర,జూలై 12:జిహెచ్‌ఎం‌సి వ్యాప్తంగా శుక్రవారం డ్రై డే నిర్వహించడం తో పాటు సీజనల్‌ ‌వ్యాధుల నివారణ, దోమల నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆయా విభాగాల అధికారులు విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.ఈ సందర్భంగా జిహెచ్‌ఎం‌సిసి ఆయా విభాగాల అధికారులు సంయుక్తంగా అన్ని సర్కిళ్లలో కాలనీ ప్రజలకు, పాఠశాలల విద్యార్థులకు వర్షాకాలం నిల్వ నీరుతో, ఇంట్లో, పరిసరాల్లో అపరిశుభ్ర వాతావరణంలో దోమలు వ్యాప్తి చెంది, వాటి ద్వారా డెంగ్యూ, మలేరియా, చికెన్‌ ‌గున్యా, విష జ్వరాలు ప్రబలుతాయని, దోమల నివారణకు, వ్యాధుల నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు.

ప్రతి శుక్రవారం డ్రైడే గా పాటించాలని, ఇంట్లో ఉన్న పనికిరాని దోమల నివాస వస్తువులు తీసివేయాలని, డ్రమ్ములు, తొట్ల లో ఉన్న నిల్వ నీటిని పడవేసి, శుభ్రం చేసు కోవాలని, ఎల్లప్పుడూ ఇల్లు, ఇంటి పరి• •రాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, గుంతలో నీరు నిలువకుండా మట్టితో పూడ్చాలని, దోమలు పుట్టకుండా, కుట్టకుండా చూసుకోవాలని నగరంలోని అన్ని సర్కిళ్లలో ప్రజలకు  అవగాహన కల్పించారు.జోనల్‌ ‌కమిషనర్లు కూడా ఆయా పాఠశాలల్లో విద్యార్థులకు అవగాహన కార్య క్రమాలు  బస్తీ దవాఖానా ఆకస్మిక పరిశీలన చేసి  డెంగ్యూ, మలేరియా వ్యాధులు పై ఆరా తీశారు.ఈ కార్యక్రమంలో ఆయా సర్కిళ్లలో డిప్యూటీ కమి షనర్లు, ఏఎంహెచ్‌ఓలు, ఎంటమాలజీ అధి కారులు, ఏఎంహెచ్వోలు, ఆయా కార్పొరేటర్‌ ‌లు పాల్గొన్న పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page