భద్రాచలంలో ఘోర విషాదం.. కుప్పకూలిన 5 అంతస్తుల భవనం

శిథిలాల కింద ఆరుగురు దుర్మరణం
శిథిలాలను తొలగించే పనిలో అధికార యంత్రాంగం

భద్రాచలంలో తీవ్ర విషాదం చోటు చేసుకుందినిర్మాణంలో ఉన్న ఆరు అంతస్తుల భవనం కుప్పకూలిందిఈ ఘటనలో ఆరుగురు మృత్తి చెందగా.. పలువురు శిథిలాల కింద చిక్కుకున్నట్టు తెలుస్తోంది.  భద్రాచలంలోని సూపర్‌ ‌బజార్‌ ‌సెంటర్‌ ‌వద్ద నిర్మాణంలో ఉన్న 5 అంతస్తుల భవనం బుధవారం ఒక్కసారిగా కుప్పకూలిందిఈ సంఘటనలో లంబాడీ కాలనీకి చెందిన ఒక మేస్త్రీ పడిశాల ఉపేందర్‌ (40), ‌కామేష్‌ ‌శిథిలాల కింద మృతి చెందారుమరో నలుగురు వలస కూలీలు శిథిలాల కింద ఉన్నట్లు తెలుస్తోందిశిథిలాలు తొలగిస్తే తప్ప పూర్తి వివరాలు తెలియనున్నాయివివరాల్లోకి వెళితే  విజయ కనకదుర్గ భవానీ  నేషనల్‌ ‌సేవా ట్రస్ట్ పేరుతో శ్రీపతి శ్రీనివాస్‌ అనే వ్యక్తి 5 అంతస్తుల భవనాన్నినిర్మిస్తున్నాడుగ్రౌండ్‌ ‌ఫ్లోర్‌ ‌సుమారు 30 సంవత్సరాల క్రితం నిర్మించారుదీనిపై గత రెండేళ్లుగా 5 అంతస్తులు నిర్మాణం కొనసాగుతోంది9 అంగుళాల పిల్లర్లు నిర్మించడంతో ఒక్కసారిగా భవనం కుప్పకూలిందిఈ ఘటనతో చుట్టు ప్రక్కల ప్రజలు తీవ్ర భయాందోళన చెందారుఒక్కసారిగా భారీగా శబ్దం రావడంతో స్థానికులు ఇండ్లలోని బయటకు పరుగులు తీసారుఈ సంఘటన స్థలాన్ని కలెక్టర్‌ ‌జితేష్‌ ‌వి పాటిల్‌ఎస్పీ రోహిత్‌ ‌రాజు పరిశీలించారు. శిథిలాలను తక్షణమే తొలగించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారుప్రమాదం జరిగిన కారణాలను కలెక్టర్‌‌అధికారులను అడిగి తెలుసుకుంటున్నారుశిథిలాలను తొలగిస్తే తప్ప ఎంతమంది చిక్కుకుపోయారనేది తెలుస్తుందిఒక్కసారిగా 5 అంతస్తులు నేలమట్టం కావడంతో శిథిలాలు తొలగించడం ఆలస్యం జరుగుతుందిచీకటి పడటంతో కొంత ఇబ్బందికరంగా ఉందిఅయినప్పటికి కలెక్టర్‌ ఆదేశాలతో శిథిలాలను వేగంగా తొలగించే ప్రయత్నం చేస్తున్నారు.  

 వివరాలు అడిగి తెలుసుకున్న మంత్రి తుమ్మల

భద్రాచలంలో నిర్మాణంలో ఉన్న 5 అంతస్తుల భవనం కుప్పకూలిన సంఘటన తెలుసుకున్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హైదరాబాద్‌ ‌నుంచి ఫోన్‌ ‌ద్వారా జిల్లా అధికారును అడిగి తెలుసుకున్నారుశిథిలాల కింద ఉన్నవారిని త్వరగా బయటకు తీయాలని ఆదేశాలు జారీ చేశారునాసికరంగా నిర్మాణం చేపట్టిన భవనం యజమానులపై చర్యలు తీసుకోవడంలో విఫలమైన అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చే సినట్లు సమాచారం.

అధికారులకు ఫిర్యాదు చేసిన చర్యలు శూన్యం
5 అంతస్తుల బిల్డింగ్‌ ‌నాసిరకంగా నిర్మాణం చేపడుతున్నారని పలువురు ఐటిడిఏ పిఓకలెక్టర్‌‌గ్రామ పంచాయతీ ఈఓకు ఫిర్యాదు చేశారునిర్మాణం చేపడుతున్న బిల్డింగ్‌ ‌తక్షణమే తనిఖీ చేయాలనిఅవసరమైతే కూల్చివేయాలని ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి గ్రామ పంచాయతీ ఈఓకు  ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తుందిఅయినప్పటికి గ్రామ పంచాయతీ ఈఓ ఆ భవనాన్ని  పరిశీలించి నోటీసులు జారీ చేసి చేతులు దులుపుకున్నారుగ్రౌండ్‌ ‌ఫ్లోర్‌ ‌నిర్మాణం చేపట్టి సుమారు 30 ఏళ్లు  అవుతున్నట్లు తెలిసిందిపాత బిల్డింగ్‌ ‌పై 5 అంతస్తుల నిర్మాణం చేపడుతూ 9 అంగుళాల పిల్లర్లు నిర్మించటం వలన ఈ ప్రమాదం చోటుచేసుకుందని పలువురు అనుమానిస్తున్నారు

5 అంతస్తుల బిల్డింగ్‌ ‌నిలువుగా నేలమట్టం కావడం వలన భారీ ప్రమాదం తప్పిందిపక్కన ఉన్న బిల్డింగ్‌లకు ఎటువంటి ప్రమాదం జరుగలేదు. 1/70 చట్టం అమలులో ఉన్నప్పటికి భద్రాచలం పట్టణంలో బహుళ అంతస్తుల నిర్మాణాలు భారీగా జరుగుతున్నాయిఅయినప్పటికీ అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయిజి ప్లస్‌ ‌టూ వరకే నిర్మాణం చేయాల్సి ఉండగా జిప్లస్‌ 5 అంతస్తుల నిర్మాణం చేపడుతన్నప్పటికి అధికారులు పట్టించుకోవడం లేదని అంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page