కెటిఆర్‌కు ఈడీ నోటీసులు

ఫార్ములా ఈ-రేసు కేసులో కీల‌క ప‌రిణామం..
హైదరాబాద్‌, ‌డిసెంబర్ 28 (ఆర్‌ఎన్‌ఎ):  ‌ఫార్ములా ఈ-రేసు కేసులో బీఆర్‌ఎస్‌ ‌కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌కు ఈడీ నోటీసులు ఇచ్చింది. జనవరి 7న విచారణకు రావాలని అందులో పేర్కొంది. సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి అరవింద్‌ ‌కుమార్‌కు, హెచ్‌ఎం‌డీఏ మాజీ చీఫ్‌ ఇం‌జినీర్‌ ‌బీఎల్‌ఎన్‌ ‌రెడ్డికి  కూడా ఈడీ నోటీసులు ఇచ్చింది. జనవరి 2, 3న విచారణకు రావాలని అరవింద్‌, ‌బీఎల్‌ఎన్‌ ‌రెడ్డికి ఇచ్చిన నోటీసుల్లో పేర్కొన్నారు. ఏసీబీ ఎఫ్‌ఐఆర్‌ ఆధారంగా పీఎంఎల్‌ఏ ‌కింద ఈడీ విచారణ చేస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page