కుదేలవుతోన్న స్టాక్‌ ‌మార్కెట్లు!

  • క్రమంగా తరిగిపోతుతున్న విదేశీ మారకం నిల్వలు
  • ఆవిరవుతున్న లక్షల కోట్ల మేర ఇన్వెస్టర్ల సంపద.. వస్తూత్పత్తి పెరిగేదెప్పుడు?

దేశంలో వస్తుత్పత్తి పెరిగేలా చేసుకోవడంలో మనం చ్కెనా నుంచి ఎంతో నేర్చుకోవాలి. వియత్నాం, క్యూబా, కొరియా లాంటి చిన్న దేశాలు కూడా ప్రపంచంతో పోటీపడేలా వస్తూత్పత్తిలో ముందుకు సాగుతున్నాయి. దేశంలో మానవనరులు విపరీతంగా ఉన్నా యి. జనాభా 140 కోట్లు దాటి చ్కెనాను మించి పోయాం. చెనా లాగా వేస్ట్ ‌మేనే• •మెంట్‌లో మనం ముందు కుపోవాలి. అందుకు అనుగుణంగా నిర్ణయాలు, ప్రోత్సా హకాలు అసవరం. మన దగ్గర పండే పంట లకు గిట్టుబాటు ధరలతో పాటు, ఎగుమ తులు చేసుకునేలా సరళీకరణ విధానాలు రావాలి. అప్పుడే బియ్యం, మిర్చి, పత్తి వంటివి ఎగుమతి అవుతాయి. అలా మన వస్తువులకు సుంకాలను మనమే విధిం చగలం. ఇప్పుడు అమెరికా సుంకాలపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మనకు అవసరమున్న వస్తువులనే దిగుమతి చేసుకుంటే సుంకాల బాధతో పాటు, విదేశీ మారకం బాధ తప్పుతుంది. కానీ దేశంలో ఇన్నేళ్లయినా ఈ విషయంలో మనం స్పష్టతతో లేమా అన్న అనుమానం కలుగు తోంది.

అందుకే విదేశాలు ముఖ్యంగా అమె రికా లాంటి దేశాలు తీసుకునే నిర్ణయాలతో మన ఆర్థిక వ్యవస్థ, మార్కెట్లు ఒడిదు డుకులకు గురవు తున్నాం. చ్కెనాలో అలాంటి పరిస్థితి మాత్రం కానరావడం లేదు. ద్రవ్యో ల్బణం అరికట్టడానికి…దిగుమతులపై సుం కాలు తగ్గేలా చేయడానికి ముందుగా మన విదేశాంగ విధానం సమీక్షించుకోవాలి. ఇప్పటికీ మనం ఎలక్ట్రానిక్‌ ‌గూడ్స్ ‌విషయ ంలో ప్రపంచ దేశాలపైనే ఆధారపడి ఉన్నాం. గూగుల్‌ ‌సిఇవో, మైక్రోసాఫ్ట్ ‌సిఇవోలు మనవారే ఉన్నా.. ఈ రంగంలో మనం అంతగా రాణించడం లేదు. దేశీయంగా మన ఉత్పత్తులను పెంచుకుని మనం సుంకాలు విధించే స్థితిలో ఉంటే.. అవి ప్రపంచ దేశాలకు అవస రమైతే మన డిమాండ్‌ ‌పెరుగుతుంది. మేకిన్‌ ఇం‌డి యా, ఓకల్‌ ‌ఫర్‌ ‌లోకల్‌ ‌వంటి నినాదాలు క్షేత్రస్థాయికి వెళ్లడం లేదు. అమెరికా అధ్యక్షు డిగా గెలిచిన డొనాల్డ్ ‌ట్రంప్‌ ‌తీసుకు ంటున్న నిర్ణయాలతో మన దేశంలోని సామాన్యు లందరిపై ప్రభా వం పడుతోంది.

సుంకాలు పెంచుతామని హెచ్చరించారు. ఇటీవల ట్రంప్‌ ‌తీసుకున్న పలు నిర్ణయాలతో డాలర్‌ ‌క్రమంగా బలప డుతున్నది. అదే క్రమంలో మన రూపాయి మరింత బలహీన పడుతోంది. విదేశీ ఇన్వెస్టర్లు ఇండి యా నుంచి వేల కోట్లను యూఎస్‌కు తరలిం చుకుపోతుండడంతో మన స్టాక్‌మార్కెట్లు కుదేలవు తున్నాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ క్రమంగా పతనమై.. మనం విదేశాల నుంచి దిగుమతి చేసుకునే వస్తువుల రేట్లు పెరుగుతున్నాయి. దీంతో విదేశీ మరకాల నిల్వలు క్రమంగా తగ్గిపోతున్నాయి. ముఖ్యంగా చమురు ధరలు పెరగడం వల్ల నిత్యావసరాల రేట్లు పైకి ఎగబాకుతున్నాయి. ఇలాంటి గందరగోళ పరిస్థితుల్లో ఇన్వెస్టర్లు గోల్డ్ ‌వైపు చూస్తుం డడంతో వాటి రేట్లు కూడా అనూహ్యంగా ఆకాశాన్నంటుతున్నాయి.

పరిస్థితి ఇలాగే కొనసాగితే త్వరలోనే డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ.100కు, గోల్డ్‌రేట్‌ ‌రూ.లక్షకు చేరుతుందని.. దీని వల్ల మనదేశంలోని సామాన్యులపై మరింత భారం తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే బంగారం ధరలు చుక్కలు చూపుతున్నాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ రోజురోజుకూ పతన మవుతున్నది. ఇటీవలి కాలంలో వేగంగా పడిపోతున్న రూపాయి మారకం విలువ ఫిబ్రవరి 5న 87.38 ఆల్‌ ‌ట్కెమ్‌ ‌కనిష్టానికి చేరింది. గతేడాది నవంబర్‌ 6‌న అమెరికా ఎన్నికల్లో ట్రంప్‌ ‌విజయం సాధించడంతో డాలర్‌ ‌బలపడ్తూ వొస్తోంది. ఇది రూపాయి విలువపై ప్రభావం చూపుతోంది. నవంబర్‌ 5‌న డాలర్‌తో పోలిస్తే రూ.84.16 గా ఉన్న రూపాయి విలువ క్రమంగా తగ్గుతూ డిసెంబర్‌19‌న 85 మార్క్ ‌చేరింది. ట్రంప్‌ ‌ప్రెసిడెంట్‌ ‌గా బాధ్యతలు స్వీకరించాక దూకుడుగా తీసుకుంటున్న పలు నిర్ణయాలతో కేవలం నెలన్నర వ్యవధిలో డాలర్‌ ‌విలువ 2 రూపాయల మేర పెరిగింది. ఇటీవల ట్రంప్‌.. ‌కెనడా, మెక్సికో దేశాల వస్తువులపై 25 శాతం, చ్కెనా వస్తువులపై 10 శాతం దిగుమతి సుంకం విధించారు.

దీంతో అంతర్జాతీ యంగా సంక్షోభ పరిస్థితులు నెలకొని డాలర్‌ ‌బలపడుతుండగా, డాలర్‌పైనే ఎక్కువగా ఆధారపడి ఉన్న ఆసియా కరెన్సీలు పతనమవుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు. మరీ ముఖ్యంగా అమెరికా ఆర్థిక వ్యవస్థ రాణిస్తుండడం, అక్కడ బాండ్లపై మంచి రిటర్నస్ ‌వస్తుండటంతో మన దగ్గర విదేశీ పెట్టుబడులు వెనక్కి వెళ్తున్నాయి. మన స్టాక్‌ ‌మార్కెట్లో విదేశీ ఇన్వెస్టర్లు జనవరి నుంచి ఇప్పటివరకు రూ.68,441 కోట్లకు పైగా వెనక్కి పట్టుకు పోయారు. దీని వల్ల స్టాక్‌ ‌మార్కెట్లు కుదేల వుతూ లక్షల కోట్ల మేర ఇన్వెస్టర్ల సంపద ఆవిరైపోతోంది. డాలర్లకు డిమాండ్‌ ‌పెరిగి, రూపాయి బలహీన పడు తోంది. ఫలితంగా అంతర్జాతీయ మార్కె ట్‌లో క్రూడాయిల్‌ ‌ధరలు దారుణంగా పెరిగిపోతు న్నాయి. దీంతో దిగుమతులు ఖరీదు అవుతు న్నాయి. మరోపక్క ద్రవ్యో ల్బణం పెరగ డంతో కార్పొ రేట్‌ ‌సంస్థల ఆదాయాలు, లాభాలు తగ్గుతు న్నాయి.

ఆర్థిక కార్యక లాపాలు మందగించి, ఉద్యోగాల్లో కోత, సరకుల సరఫరా తగ్గడం వంటి సవాళ్లు ఎదురవుతు న్నాయి. అటు విదేశాల్లో చదువుతున్న విద్యార్థులకు ఫీజులు, ఖర్చుల మొత్తం పెరిగి తల్లిదం డ్రులు తల పట్టుకుం టున్నారు. ద్రవ్యోల్బ ణం పెరగడం, ప్రజల కొనుగోలు శక్తి క్షీణించడంతో మున్ముందు నిత్యావ సరాల ధరలు మరింత పెరుగుతాయనే భయాం దోళన వ్యక్తమవ తోంది. ఈ క్రమంలో దేశీయంగా మానవవ నులను ఉపయో గించుకోవాలి. ఏదో ఒకపని ద్వారా ప్రపం చానికి అవసరమైన వస్తువుల ఉత్పత్తిపై దృష్టి సారిం చాలి. దీంతో నిరుద్యోగం నిర్మూలించడంతో పాటు, వస్తూ త్పత్తి పెరిగి, అంతర్జాతీయ మార్కెట్‌లో నిలదొ క్కుకోగలుగుతాం.

సమీర్‌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page