Category జాతీయం

మ‌ళ్లీ యుద్ధ మేఘాలు

– ఇరాన్‌పై దాడికి ట్రంప్, ఇజ్రాయెల్ సమాలోచనలు – ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న ఆందోళన వాషింగ్టన్, ఏప్రిల్ 13: అమెరికా-ఇరాన్ మధ్య శాంతి చర్చలు విఫలమవడంతో పశ్చిమాసియా మళ్లీ నివురుగప్పిన నిప్పులా మారింది. ఏ క్షణాన ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. మరోవైపు ఇరాన్‌పై మళ్లీ దాడులు ప్రారంభించేందుకు అమెరికా, ఇజ్రాయెల్ సిద్ధమవుతున్నట్లు…

‘వికసిత భారత్’లో క్రిటికల్ మినరల్స్ కూడా కీలకమే

– కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హైదరాబాద్,ప్రజాతంత్ర, ఏప్రిల్ 13: ప్రపంచ వ్యాప్తంగా క్రిటికల్ మినరల్స్ ప్రాముఖ్యం పెరుగుతోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. 2047 వికసిత భారత్ లక్ష్యాన్ని సాధించడంలో మినరల్స్ కీలకమని చెప్పుకొచ్చారు. మినరల్ రంగంలో ఆత్మనిర్భరత సాధించడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు కిషన్ రెడ్డి తెలిపారు. హెచ్ఐసీపీలో భారత…

కాంగ్రెస్ గెలుపునకు బహుముఖ వ్యూహం

– చెన్నైలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెన్నై, ఏప్రిల్ 11: తమిళనాడులో ఈనెల 23న జరగనున్న శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపునకు బహుముఖ వ్యూహం రూపొందిస్తున్నట్లు తెలంగాణ నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ‌ల మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. అందుకు అనుసరించాల్సిన విధివిధానాలను రూపొందించి ఎన్నికల బరిలో విజయం…

తృణమూల్‌కు ఓటమి భయం

– అందుకు బీజేపీపై దాడులు – బెంగాల్ సభలో ప్రధాని మోదీ కోల్‌కతా, ఏప్రిల్ 11: పశ్చిమ బెంగాల్‌లో భారతీయ జనతా పార్టీకి పెరుగుతున్న ప్రజా మద్దతును చూసి తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) భయాందోళనలో ఉన్నదని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో శనివారం ఒక బహిరంగ సభలో పాల్గొన్న మోదీ ప్రస్తుత…

హర్మూజ్ దాటిన మరో భారతీయ నౌక

– కాల్పుల విరమణ తరవాత ఇదే తొలి ప్రయాణం న్యూదిల్లీ, ఏప్రిల్ 11: యూఎస్, ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరాక తొలిసారిగా ఒక భారత రిజిస్టర్డ్ నౌక హర్మూజ్ జలసంధిని సురక్షితంగా దాటింది. ఎల్‌పీజీ గ్యాస్‌తో బయలుదేరిన జగ్ విక్రమ్ నౌక శుక్రవారం రాత్రి జలసంధిని దాటినట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.…

చర్చలు విఫలమైతే..

– ఇరాన్‌పై మరిన్ని దాడులు – మరోమారు హెచ్చరించిన ట్రంప్ న్యూయార్క్, ఏప్రిల్ 11: ఇరాన్, అమెరికా దేశాల మధ్య రెండు వారాల కాల్పుల విరమణ ఒప్పందం కొనసాగుతున్న వేళ శనివారం పాకిస్థాన్‌లో రెండు దేశాల మధ్య చర్చలు ప్రారంభమయ్యాయి. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, అమెరికా ప్రత్యేక ప్రతినిధులు స్టీవ్ విట్కాఫ్, జేరెడ్ కుష్ననర్‌లు…

రాజ్యసభ సభ్యుడిగా నితీష్‌ ‌ప్రమాణం

న్యూదిల్లీ, ఏప్రిల్‌ 10: ‌బీహార్‌ ‌మాజీ ముఖ్యమంత్రి  నితీష్‌కుమార్‌ ‌శుక్రవారం రాజ్యసభ సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్యసభ ఛైర్మన్‌ ‌సి.పి రాధాకృష్ణన్‌ ‌తన ఛాంబర్‌లో నితీష్‌కుమార్‌ ‌చేత ప్రమాణ స్వీకారం చేయించారు. నితీష్‌కుమార్‌ ‌హిందీలో ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి, రాజ్యసభ నేత జెపి నడ్డా, ఆర్థిక మంత్రి నిర్మలా…

హరివంశ్‌ ‌నారాయణ సింగ్‌ ‌కు మరో ఛాన్స్

-‌ రాష్ట్రపతి కోటాలో నామినేట్‌ ‌చేసిన కేంద్రం – మరోమారు రాజ్యసభ డిప్యూటి ఛైర్మన్‌ అయ్యే అవకాశం న్యూదిల్లీ, ఏప్రిల్‌ 10: ‌రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌గా హరివంశ్‌ ‌నారాయణ్‌ ‌సింగ్‌  ‌కొనసాగే అవకాశముంది. అనుభవజ్ఞుడైన నాయకుడిగా, నిష్పక్షపాతంగా సభను నడిపించే సమర్థత కలిగిన వ్యక్తిగా ఆయనకు గుర్తింపు ఉంది. భారత పార్లమెంట్‌ ఎగువసభలో అత్యంత హుందాతనం…

ముంబై ఎయిర్‌పోర్టులో 29 కిలోల బంగారం సీజ్‌

-‌ కెన్యా నుంచి వస్తున్న మహిళల నుంచి స్వాధీనం ముంబై, ఏప్రిల్‌10: ‌ముంబై ఎయిర్‌పోర్ట్‌లో 29 కిలోల బంగారాన్ని డీఆర్‌ఐ అధికారులు సీజ్‌ ‌చేశారు. దీని విలువ సుమారు రూ.38 కోట్లు ఉండొచ్చని అధికారులు చెబుతున్నారు. కెన్యాలోని నైరోబీ నుంచి ఈ బంగారాన్ని అక్రమంగా తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. ముంబై విమానాశ్రయం లో భారీ ఎత్తున బంగారాన్ని…