prajatantra_news

prajatantra_news

ఇది అత్యంత విషాదకరమైనది

ఇలాంటి ఘటన ఇంతకుముందెన్నడూ జరగలేదు పాశమైలారం ఘటనాస్థలి వద్ద మీడియాతో సీఎం రేవంత్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూలై 1: సపంగారెడ్డి జిల్లా పాశమైలారం పారిశ్రామిక వాడలోని సిగాచీ రసాయన పరిశ్రమలో సోమవారం జరిగిన దుర్ఘటన అత్యంత విషాదకరమైనదని, ఇప్పటివరకు ఇంతటి దుర్ఘటన రాష్ట్రంలో జరగలేదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. ఘటనా స్థలిని మంగళవారం ఉదయం పలువురు…

‘పాశమైలారం‘పై సమగ్ర నివేదిక ఇవ్వండి

అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశం 36కు పెరిగిన మృతుల సంఖ్య మృతదేహాలకు పటాన్‌చెరు ఏరియా హాస్పిటల్‌లో పోస్టుమార్టం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూలై 1 : సంగారెడ్డి జిల్లా పాశమైలారంలోని సిగాచీ రసాయన పరిశ్రమలో అగ్నిప్రమాదం జరిగిన ఘటనలో మృతుల సంఖ్య 36కు పెరిగింది. వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశాలతో ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు ఫోరెన్సిక్‌ డాక్టర్ల…

సమాచార శాఖది కీలక పాత్ర

ప్రత్యేక కమిషనర్‌ ప్రియాంక హైదరాబాద్‌, జూన్‌ 30: ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు చేరవేయడంలో సమాచార పౌర సంబంధాల శాఖ కీలక పాత్ర పోషిస్తుందని ఆ శాఖ ప్రత్యేక కమిషనర్‌ సిహెచ్‌.ప్రియాంక అన్నారు. సమాచార శాఖ ప్రధాన కార్యాలయంలో పౌర సంబంధాల అధికారిగా విధులు నిర్వర్తిస్తున్న ముళ్ళపూడి శ్రీనివాస్‌ కుమార్‌ సోమవారం ఉద్యోగ…

కేంద్ర కమిటీ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీష్‌రావు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 30 : సెంట్రల్‌ వాటర్‌ కమిషన్‌, జీడబ్ల్యూడీటీలు పరిశీలించకుండా గోదావరి-బనకచర్ల ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులిచ్చేది లేదని కేంద్ర పర్యావరణ నిపుణుల కమిటీ తేల్చి చెప్పడాన్ని స్వాగతిస్తున్నామని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీష్‌రావు అన్నారు. ఇది బీఆర్‌ఎస్‌ పోరాటం ఫలితమని, తెలంగాణ ప్రజల విజయం అని అన్నారు. బనకచర్ల పేరిట…

మండలస్థాయి ధరల నిర్ణయ కమిటీలు వేయాలి

ఇసుక విక్రయ కేంద్రాలు పెంచాలి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 30: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం నేపథ్యంలో సామాన్యులకు సిమెంటు, స్టీల్‌, ఇటుకలు, ఇసుక అందుబాటులో ఉండేందుకు మండల స్థాయిలో ధరల నిర్ణయ కమిటీలు సమావేశమై ధరలు నిర్ణయించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. సచివాలయంలో రెవెన్యూ రిసోర్స్‌ మొబిలైజేషన్‌…

సీఎం రేవంత్‌ని కలిసిన సీపీఐ నాయకులు

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 30: సీఎం రేవంత్‌రెడ్డిని పలువురు సీపీఐ నాయకులు ఆయన నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజా ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందని స్పష్టం చేశారు. సీఎంను కలిసిన వారిలో ఎమ్మెల్యే కూనమనేని సాంబశివరావు, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, మాజీ ఎమ్మెల్యే పల్లా వెంకట్‌ రెడ్డి, తదితరులు…

పాశమైలారం ప్రమాదంపై మంత్రి సీతక్క దిగ్భ్రాంతి

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 30: పాశమైలారం పారిశ్రామికవాడలో జరిగిన అగ్నిప్రమాదంపై పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్‌ ధనసరి అనసూయ సీతక్క తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన కార్మికుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. వారి కుటుంబాలకు ప్రభుత్వం పూర్తిగా అండగా ఉండి అన్ని విధాల సహాయాన్ని…

‘మీ సేవ’లో మరికొన్ని కొత్త సేవలు

అందుబాటులోకి మ్యారేజ్‌ రిజిస్ట్రేషన్‌, మార్కెట్‌ వాల్యూ సర్టిఫికెట్లు  హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 30: తెలంగాణ ఈ-గవర్నెన్స్‌కు ప్రతీకగా నిలిచిన మీ సేవ పౌరసౌకర్యాల విస్తరణలో మరో ముందడుగు వేసింది. ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఆదేశాల మేరకు మ్యారేజ్‌ రిజిస్ట్రేషన్‌, భూముల మార్కెట్‌ వాల్యూ సర్టిఫికెట్‌ వంటి కొత్త సేవలను సోమవారం ఆవిష్కరించింది. వీటి…

ఉద్యమ పతాకకు కాషాయ కిరీటం

రాడికల్స్‌ను ఎదురొడ్డి ఉస్మానియాలో ఏబీవీపి జెండా ఎగరేసిన రామచంద్రరావు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 30: విద్యార్ధి దశలోనే ఏబీవీపీ పక్షాన పోరాడి పలుమార్లు పోలీసుల లాఠీ దెబ్బలు తిన్న నాయకుడు ఎంతోమంది పేదల, బీజేపీ నేతల పక్షాన న్యాయ పోరాటం చేసిన న్యాయవాది .. అందరినీ కలుపుకుపోయే వ్యక్తిత్వం రామచంద్రరావు సొంతం. హైకమాండ్‌ నిర్ణయంపట్ల సీనియర్ల…

బీజేపీ రాష్ట్ర సారథిగా రామచందర్‌రావు ఏకగ్రీవం

~ ఏడాదిన్నర ఉత్కంఠకు తెర ~ అంతకుముందు పలువురి నిరసనలు ~ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజాసింగ్‌ రాజీనామా (మండువ రవీందర్‌రావు) ఏడాదిన్నర కాలంగా బిజెపి అధ్యక్షుడి ఎన్నిక విషయంలో నెలకొన్న ఉత్కంఠకు నేడు తెరపడిరది. పార్టీ సీనియర్‌ నాయకుడు, మాజీ ఎమ్మెల్సీ నారపరాజు రామచందర్‌రావు అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైనారు. ఆయన ఎన్నికకు ముందు పార్టీలో…