prajatantra_news

prajatantra_news

స్వగృహ ప్లాట్ల విక్రయానికి మంచి స్పందన

– తొర్రూర్‌లో చదరపు గజం రూ.45,500 – బహదూర్‌పల్లిలో రూ.40,500 – సుమారు రూ.83 కోట్ల మేర ఆదాయం హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 18: రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ ఆధ్వర్యంలో వివిధ ప్రాంతాల్లో ఉన్న ఓపెన్ ప్లాట్ల కొనుగోలుకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తున్నది. ఎలాంటి వివాదాలు లేని, అన్ని వసతులతో అభివృద్ధి చెంది…

ఎల్ఎల్ఎమ్ ఎంట్రెన్స్ రాసిన మంత్రి సీతక్క

హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, మే 18 : హైదరాబాద్ మౌలాలిలోని ఒక పరీక్షా కేంద్రంలో సోమవారం జరిగిన ఎల్ఎల్ఎమ్ ప్రవేశ పరీక్షకు పంచాయ‌తీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ద‌న‌స‌రి అన‌సూయ (సీత‌క్క‌) హాజ‌ర‌య్యారు. ఇప్పటికే పొలిటికల్ సైన్స్లో పీహెచ్ డీ పట్టా అందుకోవడంతోపాటు ఎల్ఎల్బీ, కార్పొరేట్ లా లో ఎల్ఎల్ఎమ్ పూర్తి చేసిన ఆమె రాజ్యాంగం (కాన్‌…

మత ఆధారిత సంక్షేమ పథకాలు రద్దు

– ఇమామ్‌లు, పూజారులకు గౌరవ వేతనం రద్దు – అన్నపూర్ణ’ కింద అర్హులైన మహిళలకు రూ.3వేల సాయం – బెంగాల్ ప్రభుత్వం కీలక నిర్ణయం కోల్‌కతా, మే 18: సువేందు అధికారి నేతృత్వంలోని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. సీఎం సువేందు అధికారి అధ్యక్షతన సోమవారం జరిగిన కేబినెట్ భేటీలో రాష్ట్రంలో…

మరింత పటిష్టంగా భారత్-నార్వే బంధం

– ఇంధనం, ఆవిష్కరణలు, సాంకేతికతలలో సహకారం – ఇరు దేశాల మధ్య గ్రీన్ స్ట్రాటజిక్ పార్ట్‌నర్‌షిప్ – నార్వే పర్యటనలో ప్రధాని మోదీ కీలక ప్రకటన న్యూదిల్లీ, మే 18: భారత్-నార్వే సంబంధాలను కొత్త స్థాయికి తీసుకెళ్లే దిశగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక ప్రకటన చేశారు. ఇరు దేశాల మధ్య గ్రీన్ స్ట్రాటజిక్ పార్ట్‌నర్‌షిప్‌ను…

నక్సలిజం రహిత సమాజ‌ నిర్మాణమే సంకల్పం

– కేంద్ర హోం మంత్రి అమిత్ షా – నక్సల్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దిన పోలీస్ అధికారులకు సన్మానం జగదల్‌పూర్(ఛత్తీస్‌గఢ్), మే 18 : దేశాన్ని పట్టిపీడిస్తున్న వామపక్ష తీవ్రవాదానికి ముగింపు పలికి నక్సలిజం రహిత సమాజాన్ని నిర్మించడమే కేంద్ర ప్రభుత్వ సంకల్పమని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. తీవ్రవాద ప్రభావిత ప్రాంతాలలో…

నిజామాబాద్‌కు పంగనామాలు

– ఇచ్చిన హామీలను పట్టించుకోని రేవంత్ – తలెత్తుకోలేకపోతున్న పీసీసీ చీఫ్ – ఎంపీ అరవింద్ విమర్శలు నిజామాబాద్, ప్రజాతంత్ర, మే 18: నిజామాబాద్ జిల్లాకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పంగనామాలు పెట్టారని స్థానిక ఎంపీ, బీజేపీ నేత ధర్మపురి అరవింద్ మండిపడ్డారు. ఔటర్ రింగ్ రోడ్డు, భూగర్భ డైనేజీ హామీలు ఏమయ్యాయ‌న్నారు. ఈ హామీలు…

బండి భగీరథపై అదనపు సెక్షన్లు

– మరింత పకడ్బందీగా కేసు విచారణ హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 18 : పోక్సో కేసులో అరెస్టయిన బండి భగీరథ్‌పై అదనంగా బీఎన్‌ఎస్ 64(2)(ఓ) సెక్షన్‌ను పోలీసులు నమోదు చేశారు. బాధితురాలిపై పలుమార్లు అత్యాచారం చేశాడనే ఆరోపణలపై ఈ సెక్షన్‌ను దర్యాప్తు అధికారులు జత చేశారు. దీని ప్రకారం నేరం రుజువైతే పదేళ్లకు మించి జైలు…

ఇమ్రాన్ పదవీచ్యుతిలో అమెరికా పాత్ర?

– సంచలనం కలిగిస్తున్న తాజా వార్తలు ఇస్లామాబాద్, మే 18: ప్రపంచ దేశాలపై తన పట్టును కొనసాగించేందుకు అమెరికా చేయని పనులు లేవు. దానికి సలాం అనకుంటే ఆయా దేశాలను అతలాకుతలం చేస్తుంది. శ్రీలంక, నేపాల్, బంగ్లాదేశ్ వంటి దేశాలు ఇలా విలవిల్లాడినవే. మన దేశంలోనూ వేలు పెట్టబోయి చేతులు కాల్చుకుందని చెబుతారు. తాజాగా పాక్‌లోనూ…

భూమి కోసం అక్కను హత్య చేసిన తమ్ముడు

సూర్య‌పేట‌, ప్ర‌జాతంత్ర‌, మే 18 :  ఆస్తి కోసం సొంత అక్కను తమ్ముడు హత్య చేసిన ఘటన సూర్యాపేట జిల్లా ఆత్మకూరు మండలం తుమ్మల పెన్‌పహాడ్‌లో చోటుచేసుకుంది. సురుగి అంజమ్మ భర్త మరణించడంతోపాటు పిల్లలు లేకపోవడంతో తన స్వగ్రామమైన తుమ్మల పెన్‌పహాడ్‌ లో చెల్లెలు వద్ద నివాసం ఉంటోంది. ఈ క్రమంలో తనను చూసుకుంటున్న చెల్లెలికి…

సింపుల్ ఈ-గవర్నెన్స్‌తో మెరుగైన సేవలు

– సీఎస్‌లకు కేంద్ర కేబినెట్ సెక్రటరీ సోమనాథన్ ఆదేశం హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 18 : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సింపుల్ ఈ-గవర్నెన్స్ ద్వారా ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేయాలని కేంద్ర ప్రభుత్వ కేబినెట్ సెక్రటరీ డాక్టర్ టి.వి.సోమనాథన్ ఆయా రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులను ఆదేశించారు. తమిళనాడు ప్రభుత్వం అనుసరిస్తున్న సింపుల్…