ఎల్ఎల్ఎమ్ ఎంట్రెన్స్ రాసిన మంత్రి సీతక్క

హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, మే 18 : హైదరాబాద్ మౌలాలిలోని ఒక పరీక్షా కేంద్రంలో సోమవారం జరిగిన ఎల్ఎల్ఎమ్ ప్రవేశ పరీక్షకు పంచాయ‌తీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ద‌న‌స‌రి అన‌సూయ (సీత‌క్క‌) హాజ‌ర‌య్యారు. ఇప్పటికే పొలిటికల్ సైన్స్లో పీహెచ్ డీ పట్టా అందుకోవడంతోపాటు ఎల్ఎల్బీ, కార్పొరేట్ లా లో ఎల్ఎల్ఎమ్ పూర్తి చేసిన ఆమె రాజ్యాంగం (కాన్‌ స్టిట్యూషనల్ లా) పై ఉన్న ప్రత్యేక ఆసక్తితో మరోసారి ఎల్ఎల్ఎమ్ ప్రవేశ పరీక్ష రాయడం విశేషం. మంత్రి అయినా చదువుకోవాలనే కసి ఉంటే ఏదైనా సాధ్యమేనని సీతక్క మరోసారి నిరూపించి అందరికీ ఆదర్శంగా నిలిచారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *