హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 30 : సోమవారం నాడు అసెంబ్లీ సమావేశాలు సుధీర్ఘంగా మంగళవారం ఉదయం 3.15 గంటల వరకు జరిగాయని, సభ్యులు సోమవారం చేసినట్లుగా సుదీర్ఘ ప్రసంగాలు చేయవద్దని సభ్యులకు స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ విజ్ఞప్తి చేశారు. సబ్జెక్ట్పైనే మాట్లాడాలని కోరారు. కాగా రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు మంగళవారం తిరిగి ప్రారంభమయిన తర్వాత స్కిల్ యూనివర్సిటీ బిల్లును మంత్రి శ్రీధర్బాబు శాసనసభలో ప్రవేశపెట్టారు. మరో 19 పద్దులపై చర్చ చేపట్టారు. వ్యవసాయం, సహకార, నీటిపారుదల, ఆర్అండ్బీ, పంచాయతీరాజ్, రెవెన్యూ, రిజిస్టేష్రన్లు, గృహనిర్మాణం, పౌర సరఫరాలు, పశుసంవర్ధక, పర్యాటక, క్రీడాశాఖల పద్దులపై చర్చించారు. సోమవారం విద్యుత్ అంశంపై శాసనసభలో వాడీవేడి చర్చ జరిగిన విషయం తెలిసిందే.
సుదీర్ఘ ప్రసంగాలు తగవు సభ్యులకు అసెంబ్లీ స్పీకర్ విజ్ఞప్తి





