మంచి ఆరోగ్య అలవాట్లు ఇంటి నుంచి చేరువ కావాలి
కఠోర నిష్ఠతో శరన్నవరాత్రి కార్తీక ధనుర్మాస మాఘమాస దీక్ష చేస్తున్న ప్రజలు అదే స్ఫూర్తితో పెరటి తోట పెంపకం మంచి ఆరోగ్య ఆహార అలవాట్లకు శ్రీకారం చుడితే మెరుగైన సమాజాన్ని ఆశించవచ్చు. పండుగ పేరుతో వీధుల్లో కూడళ్లలో దిష్టి బొమ్మల్లా ప్లాస్టిక్ బ్యానర్లు కట్టి, ప్లాస్ట్రో ప్యారిస్ తో తయారు చేసిన విగ్రహాలను తాగే నీటిలో కలిపి డీజేలు అసభ్యకర నృత్యాలు వేషధారణ రంగులు చల్లుకోవడం లాంటి అనాగరిక విధానాలకు స్వస్తి పలకాలి, ప్లాస్టిక్ వినియోగం సున్నా స్థాయికి తీసుకెళ్లడానికి ప్రతి ఒక్కరు నడుం బిగించాలి. ప్రభుత్వం కాయగూరల విత్తనాలు, పండ్ల మొక్కలు, చెట్లు రాయితీ ధరకు ఇవ్వాలి. పిల్లలకు సీడ్ బాల్స్ తయారు చేయడం, మొక్కలు నాటడం ప్రకృతికి దగ్గరగా జీవించడం నేర్పాలి. గ్రీన్ ఛాలెంజ్, ఐస్ బకెట్ చాలెంజ్ లాంటివి సెలెబ్రిటీలచే నిర్వహిస్తున్న ప్రభుత్వం, పెరటి తోటలు పెంచడం మంచి ఆహార ఆరోగ్య అలవాట్లు ప్రోది చేస్తు మెరుగైన సమాజానికి దోహదపడుతున్న వారి కోసం ప్రోత్సాహకాలు ఇచ్చి ప్రచారం చేస్తే సమాజం బాగుపడుతుంది.
మనం నిత్యం భుజించే వాటిలో ఆకుకూరలు కూరగాయలు ముఖ్యమైన స్థానాన్ని ఆక్రమించాయి. ముఖ్యంగా శాఖాహారులకు పోషక పదార్థాల తో కూడిన ఆహారం సమకూరేది కేవలం కాయగూరలు ద్వారా అంటే అతిశయోక్తి కాదు. పోషకాహార నిపుణుల ప్రకారం ఒక సమతుల్యమైన ఆహారాన్ని అందుకోవాలంటే , పెద్దవారికి రోజుకు కనీసం 85 గ్రా. పండ్లు , 300 గ్రా. కూరగాయలు అవసరం. కానీ , మన దేశంలో ప్రస్తుతం కాయగూరలు ఉత్పత్తి అవుతుంది దాని ప్రకారం చూస్తే , రోజూ సగటున ఒకరికి కేవలం 120 గ్రా. కూరగాయలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి.
గత ఐదు సంవత్సరాలుగా ధరల స్థిరీకరణ అనేది ఎక్కడా లేదు. ప్రతి కూరగాయ మూడింతలు అయిన మాట వాస్తవమే. సామాన్య ప్రజలకు కూరగాయలు అందుబాటులో లేకుండా పోవడం, ఉన్నా ధర ఎక్కువగా ఉండటంతో కొనలేని పరిస్థితి. పెరటి తోటలు, మిద్దె మీద తోటలు పెంచడం తో జీవన శైలిలో మార్పులు గ్రహించవచ్చు. గృహిణులు, పిల్లలు వీటి సంరక్షణ గురించి చాలా విషయాలు తెలుసుకుంటారు. ఒకప్పుడు హార్టికల్చర్, అగ్రికల్చర్ శాఖల వారు కూరగాయల విత్తనాలు ఇచ్చారు. బెండ, గోరుచిక్కుడు, బీర, కాకర, సొరకాయ, మిరప, టమోటా ఆకుకూరలలో పొనుగంటి ఆకు, పాలకూర, చుక్కకూర, కోయగూర, గోంగూర, సిరి ఆకు, కొత్తిమీర, పొదిన ఎలాంటి వాతావరణంలో అయినా వస్తాయి. దీనికి ఎకరాల భూమి అవసరం లేదు. కేవలం ఒకటి రెండు సెంట్ల స్థలంలో అన్ని ఏర్పాటు చేసుకోవచ్చు.
పెరటితోటలో మొక్కల పెంపకం
పైన చెప్పిన నిజాలను ఆధారంగా తీసుకొని , మనకోసం మనం , ఇంట్లోనే కాయగూరలను ఉత్పత్తి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీనికి ఇంట్లో వంటగది , స్నానాలగది వృధా అయ్యే నీటిని వాడుకోవచ్చు. దీనివల్ల మన ప్రాణానికి హాని కలిగించే నిలువ నీరు , మరుగు నీరు ఏర్పడకుండా ఉంటుంది. అంతేకాక మన కూరగాయల అవసరాలనూ తీరుస్తుంది కూడా. తక్కువ స్థలాల్లో ఎక్కువ కూరగాయల చెట్లను పెంచుకోవడం వల్ల చీడను రాకుండా , ఒక వేళ వచ్చినా సులభంగా చెట్లకు పట్టిన చీడను తొలగించుకునేందుకు వీలుగా ఉంటుంది. పైగా రసాయనాల వాడకం ఉండదు కాబట్టి కాలుష్యం ఏర్పడదు. ఇదెంతో క్షేమకరమైన విధానం కూడా. ఎందుకంటే , ఇలా ఉత్పత్తి అయ్యే కూరగాయలు మన ఆరోగ్యానికి భంగం కలిగించే ఎరువుల అవశేషాలు ఈ కాయగూరల్లో ఉండదు. పెరటి తోటల పెంపకానికి సెప్టెంబర్, అక్టోబర్ అనుకూలమైన నెలలు కానీ నీరు సమృద్ధిగా ఉంటే ఎప్పుడైనా పెంచవచ్చు.
పైన చెప్పిన నిజాలను ఆధారంగా తీసుకొని , మనకోసం మనం , ఇంట్లోనే కాయగూరలను ఉత్పత్తి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీనికి ఇంట్లో వంటగది , స్నానాలగది వృధా అయ్యే నీటిని వాడుకోవచ్చు. దీనివల్ల మన ప్రాణానికి హాని కలిగించే నిలువ నీరు , మరుగు నీరు ఏర్పడకుండా ఉంటుంది. అంతేకాక మన కూరగాయల అవసరాలనూ తీరుస్తుంది కూడా. తక్కువ స్థలాల్లో ఎక్కువ కూరగాయల చెట్లను పెంచుకోవడం వల్ల చీడను రాకుండా , ఒక వేళ వచ్చినా సులభంగా చెట్లకు పట్టిన చీడను తొలగించుకునేందుకు వీలుగా ఉంటుంది. పైగా రసాయనాల వాడకం ఉండదు కాబట్టి కాలుష్యం ఏర్పడదు. ఇదెంతో క్షేమకరమైన విధానం కూడా. ఎందుకంటే , ఇలా ఉత్పత్తి అయ్యే కూరగాయలు మన ఆరోగ్యానికి భంగం కలిగించే ఎరువుల అవశేషాలు ఈ కాయగూరల్లో ఉండదు. పెరటి తోటల పెంపకానికి సెప్టెంబర్, అక్టోబర్ అనుకూలమైన నెలలు కానీ నీరు సమృద్ధిగా ఉంటే ఎప్పుడైనా పెంచవచ్చు.
వంటింటి తోట ఎక్కడ పెంచాలనే దానికి స్థలం ఎంపిక విషయంలో మనకు పరిమితమైన అవకాశం ఉంది. ఇంటి పెరటి స్థలమే అందరికీ చివరగా అందుబాటులో ఉండే స్థలంగా చెప్పాలి. ఎందుకంటే, ఇంటిలోని వారంతా తమ ఖాళీ సమయాల్లో కూరగాయలపై తగినంత దృష్టి పెట్టడానికి వీలవుతుంది. ఈ కిచెన్ గార్డెన్ ఎంత పరిమాణంలో ఉండాలి అనేదాని ఎలాంటి నియమాలు లేవు. ఐతే, మనం ఎంత స్థలం కేటాయించిన, ఎంత మందికి సరిపడా కూరలు ఉత్పత్తి చేసుకోవాలి అనేదానిపై వాటి సైజు నిర్ణయించుకోవాలి. దీనికెలాటి నిర్ణీత ఆకార నియమాలు కూడా లేవు. ఐతే, చదరంగా ఉండే దానికన్నా దీర్ఘచతురస్రాకారంగా ఉంటేనే మంచిది. పంట కోతల ఆధారంగా ఒక మూడు సెంట్ల భూమిలో కిచెన్ గార్డెన్ను ఆరంభిస్తే, కనీసం 4 నుండి 5 మంది ఉన్న కుటుంబానికి సరిపడా కూరలు పండించవచ్చు. అలాగే బంతి, చామంతి, కనకాంబరం, గులాబీ క్రోటన్ పెంచితే ఇంటి వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది.
డా. ముచ్చుకోట. సురేష్ బాబు,
9989988912