- కులగణన సర్వే ఒక ఎక్స్ రే లాంటిది..
- సమగ్ర సర్వే నివేదిక ఏం చేశారో ఎవరికీ తెలియదు..
- డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 4: రాష్ట్రంలోని షెడ్యూల్ కులాలు, తెగలు, వెనుకబడిన తరగతులు, ఇతర బలహీన వర్గాల సంక్షేమానికి విధానాల రూపకల్పన కోసం ప్రభుత్వం కుటుంబ సర్వే సమాచారాన్ని ఉపయోగిస్తుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. రాష్ట్రంలో మొత్తం బీసీల సంఖ్య 56. 33 శాతం అని సమగ్ర ఇంటింటి సర్వే ద్వారా తేలిందని పేర్కొన్నారు. సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే నివేదికను కౌన్సిల్ లో ప్రవేశపెట్టిన సందర్భంగా సభ్యుల ప్రశ్నలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు సమాధాన మిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సర్వే గణంకాల ఆధారంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు, బడ్జెట్లో కేటాయింపులకు సర్వే సమాచా రాన్ని వినియోగిస్తామని తెలిపారు. ఈ సర్వే సమాచారం ఆధారంగా రాబోయే రోజుల్లో చాలా చేయబోతున్నాం. ఈ సర్వే రాష్ట్రంలోని ప్రజల వివిధ రకాల స్థితిగ తులపై ఫుల్ బాడీ చెకప్ ఒక ఎక్సరే లాంటిది. వెనుకబడిన వర్గాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం నిబద్దతతో ఉందని ఈ సర్వే స్పష్టం చేస్తుంది.
రాష్ట్రంలో 3.56 లక్షల మంది సర్వేలో పాల్గొనలేదు.. ఇందులో కేసీఆర్, కేటీఆర్, హరీష్, పల్లా రాజేశ్వర్ రెడ్డి లాంటి వారు ఉన్నారు. వారు ఇప్పుడు ఆసక్తి కనబరిచి సమాచారమిస్తే తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నాం. బిఆర్ ఎస్ నాయకులు సమగ్ర కుటుంబ సర్వే పేరిట ఒకేరోజు ఆరు గంటల్లో సర్వే పూర్తి చేశామని తెలిపారు. మీరు చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే ఏం చేసుకున్నారో.. ఎవరికీ తెలియదు. మీరు అధికారం గా చేసి ఉంటే సభలో పెట్టలేదు బహిరంగంగా ప్రకటన చేయలేదు కాబట్టి అది అధికారిక డాక్యుమెంట్ ఎలా అవుతుంది రాష్ట్రంలో కులగణనపై ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి సైంటిఫిక్ సర్వే జరగలేదు. ఉమ్మడి రాష్ట్ర చరిత్రలోనే ఇది మొదటిది. సర్వే ఆధారంగా రాష్ట్ర వనరులు సంపదను అభివృద్ధికి కావలసిన విధంగా వినియోగిస్తాం. రాజకీయ, విద్య, ఆర్థిక రంగాల్లో వెనుకబడిన వారిని గుర్తించి ఆ వర్గాల ప్రగతికి వినియోగిస్తాం. బలహీన వర్గాలకు మేలు జరగాలన్న ఆలోచన ఉండదు కాబట్టి టిఆర్ఎస్ నాయకులకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సర్వే పై నమ్మకం ఉండదు 4 ఫిబ్రవరి 20 24న సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే కోసం క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. 16 ఫిబ్రవరి 20 24న అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం జరిగింది 10 అక్టోబర్ 24న సర్వే కోసం జీవో విడుదల చేశారు.
సర్వే పర్యవేక్షణకు సీనియర్ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి అధ్యక్షతన 19 అక్టోబర్ 24 న కమిటీ ఏర్పాటు జరిగింది వివిధ ప్రజా సంఘాలు సామాజికవేత్తలు మేధావులు ఇతర భాగస్వాములు అభిప్రాయాలు పరిగణలోకి తీసుకొని సర్వే షెడ్యూల్ను రూపొందించాం. హౌస్ లిస్టింగ్ షెడ్యూల్, సర్వే షెడ్యూల్, ఎన్ని మరేటర్లకు మార్గదర్శకాలు జారీ చేశాం. సర్వే ఫారం లో మొత్తం 57 ప్రశ్నలు ఉండగా అదనపు, ఉప ప్రశ్నలతో కలిపి మొత్తం 75 క్షేత్రస్థాయిలో సామాజిక ఆర్థిక విద్య ఉపాధి రాజకీయ మరియు కుల అంశాలకు సంబంధించిన సమాచారం సేకరించబడింది రాష్ట్రంలోని ప్రతి జిల్లాను 150 కుటుంబాలతో కూడిన ఎన్యూమరేషన్ బ్లాక్ గా విభజించి తద్వారా 94,261 బ్లాక్ లను ఏర్పాటు చేశారు ప్రతి ఎన్యూమరేషన్ బ్లాక్ కి ఒక ఎన్ యు మారేటర్ ను మరియు ప్రతి పదిమంది ఎన్ని మరేటర్లను పర్యవేక్షించడానికి ఒక సూపర్వైజర్ ను నియమించారు తద్వారా రాష్ట్రవ్యాప్తంగా 1, 03, 889 ఎన్యుమరేటర్లు మరియు సూపర్వైజర్లను నియమించడం జరిగింది.
6 నవంబర్ 20 24న హౌస్ లిస్టింగ్ ప్రారంభమైంది 6 నవంబర్ నుంచి 8 నవంబర్ వరకు మూడు రోజులపాటు హౌస్ లిస్టింగ్. అసలైన సర్వే 9 నవంబర్ 24 నుంచి తెలంగాణ గవర్నర్ తో ప్రారంభమైంది. సర్వే మొత్తం 50 రోజుల్లో పూర్తయింది. సర్వే పూర్తయ్యే సమయానికి గ్రామీణ ప్రాంతంలో 66,99,62 నగర ప్రాంతంలో 45, 15, 532 కాగా మొత్తం సర్వే చేసిన కుటుంబాల సంఖ్య 1,12,15,1134 సర్వే నుంచి వచ్చిన ఫలితాలు రాష్ట్రంలో 3, 54, 77,554 మందిని సర్వే చేయడం జరిగింది. ఈ మొత్తంలో సామాజిక వర్గాల వారి సంఖ్య ఇలా ఉంది ఎస్సీలో 61,84,3119 ఉండగా ఇది మొత్తంలో 17.43 శాతం బిసి(ముస్లిం మైనారిటీలు మినహా) 1,64 ,09 ,179 ఉండగా ఇది మొత్తంలో 46.25% ముస్లిం మైనార్టీలలో మొత్తం 44, 57, 012 ఉండగా ఇది మొత్తంలో 12.56% గా ఉంది ముస్లిం మైనారిటీలలో బీసీలుగా 35, 76, 588 ఉండగా ఇది మొత్తంలో 10.08% గా ఉంది ముస్లిం మైనారిటీలలో ఓసీలు 8, 80,424 ఉండగా ఇది మొత్తంలో 2.48 శాతంగా ఉంది ముస్లిం మైనారిటీలు మినహా ఓసీలు 47, 21, 115 ఉండగా ఇది మొత్తంలో 13.31%గా ఉంది.