– షాబాద్ నరమేధం నేర్పిన నెత్తుటి పాఠం
కుటుంబ సభ్యులందరినీ ఒకేసారి హతమార్చే నేరస్తులను క్రిమినాలజీ శాస్త్రంలో ‘ఫ్యామిలీ అనిహిలేటర్స్’ గా పిలుస్తారు. బెర్మింగ్ హామ్ సిటీ యూనివర్సిటీ పరిశోధకులు ప్రతిపాదించిన సిద్ధాంతాల ప్రకారం ఇటువంటి నేరస్తులలో ప్రధానంగా నాలుగు రకాల ప్రొఫైల్స్ కనిపిస్తాయి. ఒకటి అనోమిక్ హంతకుడు. ఈ రకమైన హంతకుడు తన ఆర్థిక విజయాల ఆధారంగానే కుటుంబ ఉనికిని చూస్తాడు. ఆర్థికంగా పతనమై అప్పులలో కూరుకుపోయినప్పుడు (రాజ్కుమార్కు రూ. 2 కోట్ల అప్పులు ఉన్నాయి) సమాజంలో తలెత్తుకోలేక, తీవ్రమైన అపరాధ భావనతో తన కుటుంబం మొత్తాన్ని అంతమొందిస్తాడు. తమ మరణానంతరం కుటుంబానికి రక్షణ ఉండదనే వంకర భావన కూడా దీని వెనుక ఉంటుంది.
ఆధునిక సమాజం సాంకేతికంగా ముందడుగు వేస్తున్నప్పటికీ, మానవీయ విలువలు, నైతికత విషయంలో తీవ్ర పతనానికి గురవుతున్నదనే సత్యాన్ని రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలంలో జరిగిన ఆరు హత్యల ఉదంతం మరోసారి నిరూపించింది. మానవ ప్రవర్తనలో క్రూరత్వం పెరగడానికి కేవలం వ్యక్తిగత రాక్షసత్వమే కారణం కాదు. దాని వెనుక సామాజిక, ఆర్థిక ఒత్తిడులు, వ్యవస్థాగత వైఫల్యాలు కూడా ముడిపడి ఉంటాయి. క్రిమినాలజీ పరిశోధనల ప్రకారం ఒక వ్యక్తి తన కుటుంబ సభ్యులతో పాటు పగ పెంచుకున్న ఇతరుల ప్రాణాలు తీసే ఇటువంటి దారుణాలను ‘కుటుంబ వినాశనం’ లేదా ‘ఫ్యామిలీ అనిహిలేషన్’ గా వర్గీకరిస్తారు. ప్రపంచవ్యాప్తంగా జరిగే ఇటువంటి నేరాల్లో అత్యధిక భాగం పురుషాహంకారం, అపరిమితమైన జూద వ్యసనాలు, తీవ్రమైన అప్పుల ఒత్తిడి, చట్టపరమైన విచారణల నుంచి తప్పించుకోలేమనే నిరాశ నుంచి పుడుతున్నాయని ఫోరెన్సిక్ సైకాలజీ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన షాబాద్ మారణకాండపై బాధితుల బంధువుల వాంగ్మూలాలు, నిందితుడి పూర్వాపరాలు, పోలీస్ దర్యాప్తు సరళి ఆధారంగా సమగ్రంగా విశ్లేషించాల్సిన అవసరం ఉన్నది. జులై 10వ తేదీ రాత్రి 11 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల మధ్య వ్యవధిలో నిందితుడు పి. రాజ్కుమార్ అత్యంత పక్కా ప్రణాళికతో మూడు వేర్వేరు ప్రదేశాలలో ఆరుగురిని గొంతుకోసి హతమార్చాడు. ఈ దారుణ కాండ జరిగిన తీరు, ఆయా ప్రదేశాల భౌగోళిక పరిస్థితులు నిందితుడి క్రూరత్వ తీవ్రతను వెల్లడిస్తున్నాయి. షాబాద్ ఒక మండల కేంద్రం. ఇది రోడ్డుకు సమీపంలో ఉండి, చుట్టూ ఇండ్లతో నిండిన జనావాస ప్రాంతం. ఇక్కడ నివాసంలో మైనర్ బాలిక (17), ఆమె శారీరక, మానసిక దివ్యాంగురాలైన అక్క మేఘన (19), వారి తల్లి లక్ష్మి, నాయనమ్మ రుక్కమ్మ నివసిస్తున్నారు. జులై 10వ తేదీ రాత్రి సుమారు 11 గంటల సమయంలో రాజ్కుమార్ అద్దెకు తీసుకున్న ఎరుపు రంగు కార్లో అక్కడికి చేరుకున్నాడు. తాను తాగుతున్న బీరు క్యాన్ను ఆ ఇంటి అరుగుమీదే పెట్టి లోపలికి ప్రవేశించాడు. ఆ ఇంట్లో నిద్రిస్తున్న 17 ఏండ్ల మైనర్ బాలికను బలవంతంగా లాక్కెళ్లేందుకు ప్రయత్నించగా, అడ్డువచ్చిన ఆమె తల్లి లక్ష్మి, నాయనమ్మ రుక్కమ్మలను తన వెంట తెచ్చుకున్న కత్తితో పొడిచి చంపాడు. ఇల్లంతా రక్తపు మడుగుగా మారిన వేళ, ఏమీ చేయలేని స్థితిలో ఉన్న దివ్యాంగురాలు మేఘన ఆ రక్తం మధ్యనే దొర్లుతూ ఉండిపోయింది. అనంతరం 17 ఏండ్ల బాలికను రాజ్కుమార్ బలవంతంగా తన కార్లో సమీపంలోని దైవాలగూడ గ్రామానికి తీసుకెళ్లాడు. ఊరి చివరన నీరు తక్కువగా ఉన్న అఖిల్ సాగర్ చెరువు వద్దకు తీసుకెళ్లాడు. అక్కడ స్థానిక యువకులు క్రికెట్ ఆడేందుకు రాళ్లను వికెట్లుగా పెట్టుకున్న ప్రదేశం సమీపంలో, బాలిక గొంతు కోసి నిర్దయగా హతమార్చాడు. ఆ రాతి వికెట్ల పక్కన పడిన రక్తపు మరకలు నిందితుడి ఉన్మాదానికి సజీవ సాక్ష్యాలుగా మిగిలాయి. అక్కడి నుంచి కేవలం అర కిలోమీటరు దూరంలో ఉన్న తన సొంత నివాసానికి చేరుకున్నాడు. ఆ సమయంలో మంచంపై ఆదమరచి నిద్రిస్తున్న తన భార్య సరిత (33), నాలుగేండ్లు, రెండేండ్ల వయసున్న ఇద్దరు పసి కుమారుల గొంతులు కోసి అతి కిరాతకంగా చంపేశాడు. ఆ పసిపిల్లల గొంతులు కోసిన దృశ్యం పోస్టుమార్టం చేసిన వైద్యులను, కేసును పరిశోధించిన పోలీసులను సైతం తీవ్రంగా చలింపజేసింది. ఆ ఇంటి బయట చెల్లాచెదురుగా పడి ఉన్న చిన్నారి చెప్పులు, బొమ్మ కార్లు ఆ పసివాళ్ల ఉనికిని గుర్తు చేస్తూ అక్కడ చేరిన వారిని కన్నీటిపాలు చేశాయి.
కిరాతకుడు ఆత్మహత్య 
బాధితుల బంధువుల వాంగ్మూలాలు – వేదనలు
పోక్సో కేసైనా కదలని ఖాకీలు
ఈ దారుణ నరమేధంలో పోలీసుల వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నదని స్థానిక ప్రజలు, రాజకీయ పక్షాలు ఆందోళన వ్యక్తం చేశాయి. పోక్సో చట్టం కింద బలమైన కేసు నమోదైనప్పటికీ నిందితుడిని అరెస్ట్ చేయడంలో తీవ్ర నిర్లక్ష్యం వహించారని బాధితుల బంధువులు ఆరోపిస్తున్నారు. మే 16న కేసు నమోదైనప్పటికీ పోలీసులు రాజ్కుమార్ను అరెస్ట్ చేయకుండా కాలయాపన చేశారని, తద్వారా అతనికి జూన్ 12న ముందస్తు బెయిల్ రావడానికి పరోక్షంగా సహకరించారని స్థానికులు ఆరోపిస్తున్నారు. హత్యాకాండ జరిగిన రాత్రి షాబాద్ నివాసానికి చేరుకున్న పోలీసులు, బతికి ఉన్న 19 ఏండ్ల దివ్యాంగురాలు మేఘనను రక్షించడం కంటే మృతదేహాలను తరలించడానికే ప్రాధాన్యత ఇచ్చారని బంధువులు ఆరోపించారు. ఒళ్లంతా రక్తంతో తడిసిపోయి, మానసిక షాక్తో ఉన్న ఆ దివ్యాంగురాలిని గంటల తరబడి అదే గదిలో రక్తం మధ్యనే వదిలేశారని మేనమామ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా ఆగ్రహం, నిరసనల నేపథ్యంలో రంగారెడ్డి జిల్లా కలెక్టర్ సి. నారాయణరెడ్డి స్పందిస్తూ కేసు దర్యాప్తులో నిర్లక్ష్యం వహించిన షాబాద్ సబ్-ఇన్స్పెక్టర్ రమేశ్ ను, సర్కిల్ ఇన్స్పెక్టర్ కాంతారెడ్డిలను తక్షణమే సస్పెండ్ చేశారు. రాష్ట్రంలో పెరుగుతున్న ఇటువంటి దారుణాలపై ప్రతిపక్షాలు కూడా తీవ్రంగా స్పందించాయి. మాజీ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి నేతృత్వంలోని ప్రతినిధి బృందం బాధితులను పరామర్శించారు. దివ్యాంగురాలైన మేఘనకు ప్రభుత్వం తరఫున పూర్తి ఆర్థిక సహాయం అందించి, ప్రత్యేక సంరక్షణ హోమ్కు తరలిస్తామని జిల్లా కలెక్టర్ హామీ ఇచ్చారు.
సామాజిక-మానసిక విశ్లేషణ : ‘ఫ్యామిలీ అనిహిలేటర్’ మానసిక స్థితి
కుటుంబ సభ్యులందరినీ ఒకేసారి హతమార్చే నేరస్తులను క్రిమినాలజీ శాస్త్రంలో ‘ఫ్యామిలీ అనిహిలేటర్స్’ గా పిలుస్తారు. బెర్మింగ్హామ్ సిటీ యూనివర్సిటీ పరిశోధకులు ప్రతిపాదించిన సిద్ధాంతాల ప్రకారం ఇటువంటి నేరస్తులలో ప్రధానంగా నాలుగు రకాల ప్రొఫైల్స్ కనిపిస్తాయి. ఒకటి అనోమిక్ హంతకుడు. ఈ రకమైన హంతకుడు తన ఆర్థిక విజయాల ఆధారంగానే కుటుంబ ఉనికిని చూస్తాడు. ఆర్థికంగా పతనమై అప్పులలో కూరుకుపోయినప్పుడు (రాజ్కుమార్కు రూ. 2 కోట్ల అప్పులు ఉన్నాయి) సమాజంలో తలెత్తుకోలేక, తీవ్రమైన అపరాధ భావనతో తన కుటుంబం మొత్తాన్ని అంతమొందిస్తాడు. తమ మరణానంతరం కుటుంబానికి రక్షణ ఉండదనే వంకర భావన కూడా దీని వెనుక ఉంటుంది. రెండు స్వీయ సమర్థన హంతకుడు. వైవాహిక జీవితంలో వచ్చే విభేదాలకు భార్యనే బాధ్యురాలిని చేస్తూ, ఆమెపై ప్రతీకారం తీర్చుకోవడానికి భార్యతో పాటు పిల్లల ప్రాణాలు కూడా తీస్తాడు. భార్య విడాకులు కోరడం లేదా తన విచ్చలవిడి జీవితాన్ని ప్రశ్నించడం వల్ల తలెత్తిన పురుషాహంకార గాయం ఈ ఘోరానికి ప్రేరణగా మారుతుంది. మూడు ప్రతీకార ఉన్మాదం. తనపై నమోదైన చట్టపరమైన కేసులకు కారణమైన వారిపై పగ తీర్చుకోవడానికి ఏ స్థాయికైనా వెనుకాడడు. రాజ్కుమార్ తనపై నమోదైన పోక్సో కేసును తన జీవిత పతనానికి కారణంగా భావించి, ఫిర్యాదు చేసిన బాలికతో పాటు ఆమె తల్లి, నాయనమ్మలను ప్రణాళికాబద్ధంగా హతమార్చాడు.
దేశంలో సామూహిక కుటుంబ హత్యలు – చారిత్రక సాదృశ్యాలు 
భారతదేశంలో తీవ్రమైన మానసిక ఒత్తిడులు, సామాజిక శూన్యత, వ్యవస్థాగత నిర్లక్ష్యం కారణంగా గతంలోనూ ఇటువంటి అనేక నరమేధాలు చోటుచేసుకున్నాయి. ఉత్తరప్రదేశ్లోని అమ్రోహాకు చెందిన షబ్నమ్ అలీ అనే మహిళ 2008లో తన ప్రేమికుడు సలీమ్తో కలిసి ఒకే రాత్రి తన కుటుంబంలోని ఏడుగురు సభ్యులను గొంతుకోసి దారుణంగా హత్య చేసింది. ఇందులో పది నెలల పసికందు కూడా ఉండడం గమనార్హం. కేవలం స్వార్థం, అక్రమ సంబంధం కోసం కుటుంబం మొత్తాన్ని హతమార్చిన ఈ ఉదంతంలో భారత న్యాయస్థానం నిందితులకు మరణశిక్ష విధించింది. 2018లో ఢిల్లీలోని బురారీ ప్రాంతంలో ఒకే కుటుంబానికి చెందిన 11 మంది సభ్యులు మూఢనమ్మకాలు, తీవ్రమైన మానసిక భ్రాంతి కారణంగా సామూహికంగా ఉరివేసుకొని మరణించారు. వ్యవస్థీకృత కుటుంబాలపై మానసిక రుగ్మతల ప్రభావం ఎంత దారుణంగా ఉంటుందో ఈ ఘటన నిరూపించింది. 2016లో ఉత్తర ప్రదేశ్లోని బులంద్షహర్ లో (కొత్వాలి నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కోఠియాత్/ శీతల్ గంజ్ ప్రాంతంలో) ఆడపిల్లలకు జన్మనిచ్చిందనే కారణంతో మనోజ్ బన్సాల్ అనే వ్యక్తి తన భార్యను కిరోసిన్ పోసి సజీవ దహనం చేశాడు. కొడుకు పుట్టలేదనే కక్షతో ఈ దారుణానికి ఒడిగట్టాడు. తీవ్రంగా గాయపడిన ఆమె ఢిల్లీలోని సఫ్దర్జంగ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. ఆమె కుమార్తెలు లతికా, తాన్యాలు తమ తల్లికి న్యాయం చేయాలంటూ రక్తంతో రాసిన లేఖతో ఆరేండ్లపాటు సుదీర్ఘ న్యాయపోరాటం చేయగా, 2022లో స్థానిక కోర్టు నిందితుడికి జీవిత ఖైదుగా శిక్ష విధించింది.
ఇకనైనా కండ్లు తెరవాలి
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





