Category ముఖ్యాంశాలు

కేటీఆర్‌తో ఆస్ట్రేలియా హైకమిషనర్ ఫిలిప్ గ్రీన్ భేటీ

హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 14 : భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో దేశంలోని ఆస్ట్రేలియా హైకమిషనర్ ఫిలిప్ గ్రీన్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల ఆస్ట్రేలియా కాన్సల్ జనరల్ హిల్లరీ మెక్‌గీచీ గురువారం సమావేశమయ్యారు. నందినగర్‌లో జరిగిన ఈ భేటీలో పరస్పర ప్రయోజనాలు, వ్యూహాత్మక అంశాలపై విస్తృతంగా చర్చించారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో…

మరోమారు తెరపైకి ఫార్మూలా ఈ-రేస్ కేసు

– కేటీఆర్ తదితరులకు ఏసీబీ ప్రత్యేక కోర్టు సమన్లు – జూలై 31న విచారణకు రావాలని ఆదేశాలు హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 14 : రాష్ట్రంలో సంచలనం రేపిన ఫార్ములా`ఈ రేస్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తోపాటు పలువురు కీలక అధికారులకు ఏసీబీ ప్రత్యేక కోర్టు సమన్లు…

పీఎంజేలో దోపిడీ సుబోధ్ గ్యాంగ్ పనే

– కేసును ఛేదించిన కరీంనగర్ పోలీసులు – ముగ్గురు దోపిడీ దొంగల అరెస్ట్ – రెక్కీ నిర్వహించి దోపిడీకి పాల్పడినట్లు కమిషనర్ వివరణ కరీంనగర్, ప్రజాతంత్ర, మే 14: నగరంలోని పీఎంజే జ్యువెలరీ షాపులో కాల్పులు జరిపి నగలు దోపిడీకి పాల్పడింది సుభోద్ సింగ్ గ్యాంగ్ అని కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం తెలిపారు.…

రైతులను గోసపెట్టిన బీఆర్ఎస్ ను ఎవరూ నమ్మరు

– కుట్రలతో ప్రభుత్వాన్ని అస్థిరపరచలేరు – ప్రజా దర్బార్ లో మంత్రి పొంగులేటి  ఏదులాపురం/ ఖమ్మం, ప్రజాతంత్ర, మే 14: పదేళ్లపాటు అధికార దాహంలో పేదవాడిని విస్మరించి నాడు రైతుల చేతులకు సంకెళ్లు వేసిన వారు నేడు రంగురంగుల అవతారాలతో వస్తే ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి…

చివరి గింజ వరకు కొనుగోలు చేస్తాం

– రబీలో 141 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి అంచనా – 90 లక్షల మెట్రిక్ టన్నుల కొనుగోలుకు ప్రభుత్వం సన్నద్ధం – దిగుబడి, కొనుగోలులో ఆల్ టైం రికార్డ్ – ధాన్యం కొనుగోలుకు రూ.22,000 కోట్ల కేటాయింపు – రైతాంగాన్ని మోసం చేస్తే కఠిన చర్యలు – అందుబాటులో ఉన్న వాహనాలన్నీ వినియోగించాలి…

‘నీట్’ రద్దు.. మోదీ నిరంకుశ నిర్ణయం

– మోదీ హయాంలోనే 93 పేపర్లు లీక్ – ఆందోళనలో రెండు కోట్ల మంది విద్యార్థులు – కేంద్రం తీరుపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 14 : నీట్-యూజీ 2026 రద్దు మోదీ ప్రభుత్వ నియంతృత్వ, నిరంకుశ నిర్ణయమని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ ఏకపక్ష నిర్ణయంతో…

శిక్షణ, పాఠ్యాంశాల్లో ఆధునికత ఉండాలి

– గ్రేహౌండ్స్ ఆపరేషన్స్‌పై డీజీపీ ఆనంద్ సమీక్ష ~ ప్రభుత్వ పరిశీలనలో పోస్టుల 708 సరెండర్ ప్రతిపాదన  హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 14: ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా గ్రేహౌండ్స్ సిబ్బందికి అందిస్తున్న శిక్షణ ప్రమాణాలు, పాఠ్యాంశాలు, మాడ్యూల్స్‌లో నిరంతరం ఆధునికత ఉండాలని డీజీపీ సీవీ ఆనంద్ స్పష్టం చేశారు. రాష్ట్ర పోలీస్ శాఖలో ప్రధానమైన గ్రేహౌండ్స్…

ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా

– భగీరథకు మధ్యంతర బెయిల్‌పై నేడు హైకోర్టు నిర్ణయం హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 14: పోక్సో కేసులో నిందితుడైన బండి సాయి భగీరథ్ దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్ పిటిన్‌పై విచారణను హైకోర్టు వెకేషన్ బెంచ్ వారం రోజులకు వాయిదా వేసింది. అతని తరపు న్యాయవాది కృష్ణకాంత్ హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు…

మీ సేవ ద్వారా మరో పోటీ పరీక్ష హాల్ టికెట్లు

– వాట్సాప్ ద్వారా రేపటినుంచి డీఈఈ సెట్ హాల్ టికెట్లు హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 14 : తెలంగాణ ప్రభుత్వ ఎలక్ట్రానిక్ సర్వీస్ డెలివరీ (ఈఎస్‌డీ) విభాగం, డీఈఈసెట్ (డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్) హాల్ టికెట్లను మీ సేవ వాట్సాప్/చాట్‌బాట్‌లో అందుబాటులోకి తీసుకు వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాదిమంది విద్యార్థులు ఈనెల…