prajatantra_news

prajatantra_news

కొందరికేనా రిజర్వేషన్లు.. మిగతా వారి సంగతి?

– ఇలా అయితే దేశం వాటినుంచి బయటపడేనా? – ఐఏఎస్ తల్లిదంద్రుల పిల్లలకు రిజర్వేషన్లు అవసరమా – సుప్రీం ధర్మాసనం సంచలన వ్యాఖ్యలు న్యూదిల్లీ, మే 22: రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. కొందరే వీటిని పదేపదే అనుభవించడం ద్వారా మిగతావారికి అడ్డుపడుతున్నారని అభిప్రాయపడింది. గతంలో సీజేఐగా పనిచేసిన బీఆర్ గవాయ్ కూడా ఇలాగే…

రేపు యాదగిరిగుట్టకు సీఎం రేవంత్ రాక

– ఏర్పాట్లను పరిశీలించిన ప్రభుత్వ విప్ అయిలయ్య యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, మే 22: ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయ అభివృద్ధిలో భాగంగా సుమారు రూ.100 కోట్ల వ్యయం కాగల పనులకు శంకుస్థాపన చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శనివారం ఉదయం యాదగిరిగుట్ట విచ్చేస్తున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే…

వివాదాస్పదంగా త్రిభాషా విధానం

– సుప్రీం కోర్టులో పిల్ దాఖలు న్యూదిల్లీ, మే 22: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎ స్‌ఈ) తొమ్మిదో తరగతి విద్యార్థులకు మూడు భాషల బోధనను తప్పనిసరి చేస్తూ తీసుకొచ్చిన నూతన విద్యా విధానం ఇప్ప్పుడు న్యాయ వివాదానికి దారితీసింది. బోర్డు నిర్ణయాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలైంది.…

దక్షిణ త్రివేణి సంగమం కాళేశ్వరం

 – ఆధ్యాత్మిక ప్రాధాన్యత గల దక్షిణ కాశి – గోదావరిలో అంతర్వాహినిగా సరస్వతి నది – సరస్వతి అంత్య పుష్కరాలకు తరలి వస్తున్న భక్తజనం – పుణ్యస్నానమాచరించిన గవర్నర్ దంపతులు జయశంకర్ భూపాలపల్లి, ప్రజాతంత్ర, మే 22: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మహాదేవ్‌పూర్ మండలంలో ఉన్న ఒక ప్రాచీన, ఆధ్యాత్మిక ప్రాధాన్యమున్న గ్రామం కాళేశ్వరం. తెలంగాణ,…

2,000 కిడ్నీ మార్పిడులతో అరుదైన రికార్డు

– ‘నిమ్స్’ వైద్య బృందానికి సీఎం అభినందనలు హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 22 : హైదరాబాద్‌లోని నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్) కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్‌లో దేశంలోనే అరుదైన రికార్డు నమోదు చేసింది. ‘నిమ్స్’ యూరాలజీ విభాగం ఇప్పటివరకు 2,000 కిడ్నీ మార్పిడులు పూర్తి చేసి దక్షిణ భారత దేశంలో నెంబర్ వన్‌గా నిలిచింది.…

నిందితుడిని కాపాడిన నేరం రేవంత్‌దే

– బండి -రేవంత్ అనుబంధం వల్లనే ఆడబిడ్డకు అన్యాయం – బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజం హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 22 :తనకు అన్యాయం జరిగిందని ఓ ఆడబిడ్డ బయటకు వస్తే ఆ కుటుంబాన్ని బెదిరించి కౌంటర్ కేసు పెట్టించి నిందితుడిని తొమ్మిది రోజులు కాపాడింది ముమ్మాటికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డే అని బీఆర్ఎస్…

ఫ్యూచర్ సిటీ పేరుతో రియల్ వ్యాపారం

– బీఆర్ఎస్ రాగానే ఫ్యూచర్ సిటీ రద్దు – మాజీ మంత్రి హరీష్ రావు హెచ్చరిక హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 22 :ఫ్యూచర్ సిటీ పేరుతో కాంగ్రెస్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తోందని బీఆర్ఎస్ నేత టి.హరీష్‌రావు ఆరోపించారు. బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తామన్నారు. అమెరికా పర్యటనలో ఉన్న ఆయన కాంగ్రెస్…

గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఊతమివ్వాలి

– వ్యవసాయాధార పరిశ్రమలకు రుణాలు పెంచాలి – సంప్రదాయ వ్యవసాయ రుణాలకే పరిమితం కారాదు – బ్యాంకర్ల సమావేశంలో మంత్రి తుమ్మల సూచన హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 22 : రాష్ట్ర గ్రామీణ ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేయడంలో బ్యాంకులు చురుకైన భాగస్వాములు కావాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. ప్రజా భవన్‌లో శుక్రవారం…

సంక్షేమం, మూసీ పున‌రుజ్జీవం ప్ర‌థ‌మ ప్రాధాన్య‌త‌లు

– 3 ట్రిలియన్ల ఆర్థిక వ్వవస్థే లక్ష్యం – తెలంగాణ వృద్ధి రేటు 10.7 శాతం – పట్టణీకరణతో సేవల రంగానికి భారీ అవకాశాలు – విద్యార్థుల రుణాలు భవిష్యత్తు పెట్టుబడులు – వడ్డీ లేని రుణాలు రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంపు – బ్యాంకర్ల సమావేశంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క…

పేదరికం నుంచి ప్రగతి పథంలోకి..

– మహిళా రైతులకు గ్లోబల్ మార్కెట్ అవకాశాల కల్పన – మంత్రి సీతక్క ఆలోచనలు ఆచరణలో పెడుతున్న ‘సెర్ప్‌’ హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 22 : గ్రామీణ పేదరిక నిర్మూలనకు అసలైన అర్థం చెబుతూ గ్రామీణ ప్రాంతాల్లోని సన్న, చిన్నకారు రైతులకు వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చే దిశగా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖలోని ‘సెర్ప్‌’ విభాగం వినూత్న…