Day July 21, 2026

ఒకే క్యాంపస్ నుంచి గ్రేహౌండ్స్, ఆక్టోపస్

– టెక్నాలజీ ఆధునికీకరణతో సీసీటీఎన్ఎఎస్ 3.0, హాక్ ఐ 3.0 ప్రాజెక్టులు – డీజీపీ ఆనంద్ అధ్యక్షతన స్టాఫ్ ఆఫీసర్ల సమావేశం హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 21: పోలీసు శాఖను మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దే దిశగా చేపట్టాల్సిన పలు కీలక అంశాలపై డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) సి.వి.ఆనంద్ అధ్యక్షతన స్టాఫ్ ఆఫీసర్ల సమావేశం…

సీతక్కపై క్రిమినల్ కేసు కొట్టివేత

– కింది కోర్టు ఉత్తర్వులు రద్దు చేసిన హైకోర్టు హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 21: ములుగు ఎమ్మెల్యే, పంచాయతీరాజ్ శాఖ మంత్రి దనసరి అనసూయ(సీతక్క)కు హైకోర్టులో ఊరట లభించింది. కొవిడ్-19 సమయంలో ఆరోగ్యశ్రీ పథకం పరిధిలో కరోనా చికిత్సను చేర్చాలని డిమాండ్ చేస్తూ నిరాహార దీక్ష చేపట్టినందుకు ఆమెపై నమోదైన క్రిమినల్ కేసును హైకోర్టు కొట్టివేసింది.…

దేవాదుల పంపులు 24 గంటలు పనిచేస్తాయి

– ఈ రాత్రి నుంచే 9 యూనిట్లు పూర్తి సామర్థ్యంతో ప్రారంభం – రాజకీయాలు కాదు.. ప్రజలకు నీటి భద్రతే మా లక్ష్యం – మంత్రి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 21 : దేవాదుల ఎత్తిపోతల పథకం కింద ఈ రాత్రి నుంచే తొమ్మిది పంపింగ్ యూనిట్లు 24 గంటలపాటు…

థ‌ర్మ‌ల్ కేంద్రాలు గ‌రిష్ఠ‌ ఉత్ప‌త్తి సాధించాలి

– విద్యుత్ కేంద్రాలకు నాణ్యమైన బొగ్గు సరఫరాయే లక్ష్యం – సీఎం భట్టి విక్రమార్క మార్గదర్శకాలు హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జూలై 21: దేశవ్యాప్తంగా ఏర్ప‌డ్డ ఎల్ నినో ప్ర‌భావం నేప‌థ్యంలో జ‌న్ కో థ‌ర్మ‌ల్ విద్యుత్ కేంద్రాల్లో గ‌రిష్ట స్థాయిలో విద్యుత్ ఉత్ప‌త్తి సాధించాల‌ని ఉప ముఖ్యమంత్రి భ‌ట్టి విక్ర‌మార్క సంబంధిత  అధికారుల‌కు ఆదేశాలు జారీ…

కిసాన్‌ ‌ఘాట్‌ ‌వద్ద నిరసనకు వేలాదిగా రైతుల రాక

– పోలీసుల కట్టుదిట్టమైన భద్రతా చర్యలు – హర్యానా-పంజాబ్‌ ‌శంభు సరిహద్దు వద్ద ఉద్రిక్తత న్యూదిల్లీ, జూలై 21: హర్యానా-పంజాబ్‌ ‌సరిహద్దులోని శంభు స‌రిహ‌ద్దు ‌వద్ద హైటెన్షన్‌ ‌నెలకొంది. మహాపంచాయత్‌లో పాల్గొనేందుకు పంజాబ్‌, ‌హర్యానా నుంచి దిల్లీ వైపుగా వేలాదిమంది రైతులు బయలుదేరారు. దిల్లీలోని కిసాన్‌ ‌ఘాట్‌ ‌వద్ద నిరసన తెలిపేందుకు అన్నదాతలు వస్తుండటంతో ఉద్రిక్త…

సిక్కింలో ఘోర విషాదం

– నిర్మాణంలో ఉన్న సొరంగంపై విరిగిపడ్డ కొండచరియలు – పదిమంది కార్మికుల దుర్మరణం గ్యాంగ్‌టక్‌,‌జూలై 21: సిక్కింలో ఘోర విషాదం చోటుచేసుకుంది. దక్షిణ సిక్కింలోని సమర్‌దుంగ్‌ ‌ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న సొరంగం వద్ద కొండచరియలు విరిగిపడటంతో ఘోర ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఇప్పటివరకు పదిమంది మృతిచెందారు. వారి మృతదేహాలను వెలికితీసినట్లు అధికారులు వెల్లడించారు. మరో…

జమ్మూ కాశ్మీర్‌లో క్లౌడ్‌ ‌బరస్ట్

-‌ కొండ చరియలు విరిగి పడి పలువురు గల్లంతు – వరదలతో ఇప్పటికే పలువురు మృతి శ్రీనగర్‌,‌ జూలై 21: జమ్మూకశ్మీర్‌లో మేఘ విస్ఫోటం కారణంగా సంభవించిన ఆకస్మిక వరదలు బీభత్సం సృష్టించాయి. భారీ వర్షాలతో కొండచరియలు విరిగిపడటం, వరదల కారణంగా సరిహద్దు జిల్లాలైన పూంఛ్‌, ‌రాజౌరీల్లో ఇప్పటికే  12 మంది మృతి చెందగా.. పలువురు…

ప్రతిపక్ష నేతలకు సమాధానం ఇవ్వరా?

-కేంద్ర ప్రభుత్వ తీరుపై మండిపడ్డ ఎంపీ చామల న్యూదిల్లీ,జూలై21: పార్లమెంటులో ప్రతిపక్ష నేతలు అడిగిన అంశాలకు కేంద్రం ఎందుకు సమాధానం చెప్పట్లేదని కాంగ్రెస్‌ ‌భువనగిరి ఎంపీ చామల కిరణ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి ప్రశ్నించారు. మంగళవారం రామ్‌ ‌మనోహర్‌ ‌లోహియా హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న సీజేపీ పార్టీ మద్దతుదారు, కార్యకర్తలను కాంగ్రెస్‌ అ‌గ్రనేతలు రాహుల్‌ ‌గాంధీ, ప్రియాంక…

పశ్చిమాసియాలో పరిస్థితి మళ్లీ ఉద్రిక్తం

– పూర్తిస్థాయి యుద్ధం చేస్తున్నామన్న ఇరాన్‌ ‌టెహ్రాన్‌,‌ జూలై 21: అమెరికా-ఇరాన్‌ ‌మధ్య ఘర్షణల నేపథ్యంలో పశ్చిమాసియాలో పరిస్థితి మళ్లీ వేడెక్కింది. ఈ నేపథ్యంలో ఇరాన్‌ అధ్యక్షుడు మసూద్‌ ‌పెజెష్కియాన్‌ ‌కీలక వ్యాఖ్యలు చేశారు. తమ దేశం ప్రస్తుతం అమెరికాతో పూర్తి స్థాయి యుద్ధం చేస్తోందని ప్రకటించారు. ప్రస్తుతం కేవలం సైనిక పరంగానే కాకుండా ఆర్థిక…