hఉమ్మడి రంగారెడ్డి జిల్లా నేతలతో మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ భేటీ
రజతోత్సవ సభ ఏర్పాటుపై కీలక సూచనలు
గజ్వెల్, ప్రజాతంత్ర, ఏప్రిల్
ప్రభుత్వ వైఫల్యాలను ఎప్పటికప్పుడు ఎండగడుతూ..ప్రజలకు అండగా ఉండాలని బీఆర్ఎస్ నేతలకు అధినేత కేసీఆర్ తెలిపినట్టు సమాచారం. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల వ్యవహారంపై కూడా బీఆర్ఎస్ నేతలతో కేసీఆర్ చర్చించినట్టు తెలుస్తోంది. కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై సుప్రీంకోర్టు ఆదేశాలను బీఆర్ఎస్ నేతలు అధినేత కేసీఆర్కు దృష్టికి తీసుకెళ్లినట్టు సమాచారం. ఎమ్మెల్యేల అనర్హత అంశంపై కూడా బీఆర్ఎస్ నేతలతో కేసీఆర్ చర్చించినట్టు తెలుస్తోంది.





