నక్సలిజాన్ని నిర్మూలిస్తామనే హక్కు లేదు..
శాంతి చర్చలతోనే దేశానికి, సమాజానికి మేలు
రౌండ్ టేబుల్ సమావేశంలో పలువురు వక్తలు
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్
ఈ సందర్బంగా ప్రొఫెనర్ జి.హరగోపాల్ మాట్లాడుతూ నాడు రాజ్యం అమాయక పౌరులను కాల్చి చంపి బూటకపు ఎన్ కౌంటర్లుగా చిత్రికరించిందని ఆరోపించారు. నేడు ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలోని ఆదివాసీల ఆధీనంలో ఉన్న ఖనిజ సంపదను దోచుకోవడానికి అమాయకులైన ఆదివాసీలను మావోయిస్టు పేరుతో రాజ్యం హత్యలు చేస్తుందన్నారు. కార్పొరేట్ సంస్థలకు ఖనిజ సంపదను దోచి పెట్టడం కోసమే కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా 2026 నాటికి మావోయిస్టులను నిర్మూలిస్తామని బహిరంగంగా పార్లమెంట్ వేదికగా ప్రకటన చేయడం దారుణమన్నారు.
ఛత్తీస్ గఢ్ ముఖ్యమంత్రి, కేంద్ర హోం శాఖ మంత్రి కలయిక చర్చలకు అమోదిస్తారా అన్న విషయం అనుమానంగా ఉందన్నారు. చర్చలు ప్రభుత్వం చేస్తుందో, లేదో తెలియదు కాని పౌర సమాజం, మేధావులు, కవులు సమాజంలోకి లోతుగా తీసుకువెళ్ళినప్పుడే శాంతి చర్చలు జరిగే అవకాశం ఉందన్నారు. అల్లం నారాయణ మాట్లాడుతూ ఛత్తీన గఢ్ లో జరుగుతున్న పరిణామాలు తీవ్ర నిర్బంధం నేపథ్యంలో చర్చల ప్రతిపాదన వొస్తున్నదని చెప్పారు. దేశంలో ప్రజాస్వామ్య వాతావరణ వొస్తుందనే ఒక ప్రయత్నం జరుగుతుందన్నారు.