Category ఎడిటోరియల్

హై-స్పీడ్ రాజకీయ నాటకాలు

ఊహించినట్లే శుక్రవారం లోక్ సభలో  కేంద్రం ప్రవేశపెట్టిన  131వ రాజ్యాంగ సవరణ బిల్లు పార్లమెంట్ లో వీగిపోయింది. సభలో మెజార్టీ లేకపోయిన బీజేపీ, ఎన్డీయే పక్కా వ్యూహంతో సవరణ బిల్లులు తీసుకొచ్చింది . మూడు రోజుల ప్రత్యేక సమావేశాలు పెట్టి ఏప్రిల్‌ 16న మూడు బిల్లులు పార్లమెంట్‌లో ప్రవేశపెట్టింది. ఓడిపోతామని తెలిసి కూడా ఇండి కూటమి, కాంగ్రెస్‌…

తెలంగాణను బిజెపి ఎందుకు వ్యతిరేకిస్తున్నది..?

Why Is Bharatiya Janata Party Targeting Telangana

 రాష్ట్ర విభజన జరిగినప్పటి నుండీ  బిజెపి తెలంగాణను వ్యతిరేకిస్తూనే ఉంది. వ్యతిరేకత అన్నది తెలంగాణ ప్రజలపైనా లేక తెలంగాణ ప్రభుత్వాల పైనా అన్నది బిజెపినే స్పష్టంచేయాలి. తెలంగాణలో ఇప్పటివరకు రెండు పార్టీలు మారాయి. తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రధానభూమిక నిర్వహించిన బి(టి)ఆర్‌ఎస్‌ అధికారంలో ఉన్న దశాబ్ధకాలం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఎడముఖం పెడ ముఖంగా…

డీలిమిటేషన్.. సామాన్యుల జేబు కు కత్తెర 

భారతదేశంలో రాబోయే నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్ ) ప్రక్రియ కేవలం భౌగోళిక మార్పు పరిపాలనా సౌలభ్యం కోసం  మాత్రమే కాదు, అది దేశ ఖజానాపై పడే భారీ ఆర్థిక భారానికి సంబంధించిన అంశం కూడా. లోక్‌సభ సభ్యుల సంఖ్య ప్రస్తుతమున్న 543 నుండి సుమారు 848కి పెరిగే అవకాశం ఉండటంతో, ప్రజాధనం వినియోగంపై చర్చ మొదలైంది.…

కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలి..!

రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు, ఆహార భద్రతకు వెన్నెముకగా నిలుస్తున్నది వ్యవసాయం  కానీ, వ్యవసాయం  చేస్తున్న  రైతులో మెజారిటీ  “కౌలు రైతులు” మాత్రం నేటికీ అక్షరాలా “అదృశ్య సాగుదారులు”గానే మిగిలిపోయారు. రాష్ట్రంలో దాదాపు 22 లక్షలకు పైగా ఉన్న కౌలు రైతులు (మొత్తం సాగుదారులలో 36 శాతం) నేలతల్లిని నమ్ముకుని చెమటోడుస్తున్నా, ప్రభుత్వ రికార్డుల్లో మాత్రం వారి…

ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల పట్ల నిర్లక్ష్యం

government schools, education inequality, student welfare, public education, policy failure

రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న లక్షలాది మంది విద్యార్థులకు ప్రతి విద్యా సంవత్సర ప్రారంభంలో యూనిఫాంలు,షూస్, పాఠ్య సహాయక కిట్లు, చార్ట్స్, మ్యాప్స్ వంటి అవసరమైన వస్తువులు సమయానికి అందించడం ఒక ప్రాథమిక బాధ్యత. అయితే 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించిన టెండర్ల ప్రక్రియలో చోటుచేసుకున్న వివాదాలు, ఆలస్యాలు, నిర్లక్ష్యాలు  ఈ బాధ్యతపై తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి.…

మళ్ళీ యుద్ధ మేఘాలు… ఆర్థిక తుఫాను?

   ప్రపంచ రాజకీయ వేదికపై మళ్లీ ఉద్రిక్తతలు ఉధృతమవుతున్నాయి. ఇస్లామాబాద్‌లో జరిగిన శాంతి చర్చలు విఫలమవడంతో అమెరికా–ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మళ్లీ యుద్ధ దిశగా మళ్లుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇటీవల జరిగిన కాల్పుల విరమణ ప్రపంచానికి తాత్కాలిక ఉపశమనం ఇచ్చినప్పటికీ, ఆ ఉపశమనం స్వల్పకాలమే ..! ఇప్పుడు పరిస్థితి మరింత క్లిష్టంగా మారి, దాని ప్రభావం…

దేశాల ఆర్థిక పరిపుష్టికి అసలైన రహదారి నౌకాయానం

జీవకోటి మనుగడకు నీరు ప్రాణాధారం , ఆధునిక ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు సముద్ర నౌకాయానం అంతే  కీలకమైన జీవనాధారం . భూగోళం మీద ఒక జీవి జీవించాలంటే జలం అవసరం, అలాగే ఒక దేశం ఆర్థికంగా పరిపుష్టి చెందాలన్నా, పౌరుల అవసరాలు తీరాలన్నా అంతర్జాతీయ వర్తక వాణిజ్యాలు సజావుగా సాగాలి. దేశం ఎంత స్వీయ సమృద్ధి…

అధిక ఉష్ణోగ్రతలు.. జాగ్రత్తలు

ఏప్రిల్ ఆరంభం నుండే రాష్ట్రంలో  భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఉదయం 7 గంటల నుండే ఎండ తీవ్రత మొదలై సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతోంది. అనేక జిల్లాల్లో పగటి ఉష్ణోగ్రతలు 41 డిగ్రీలు  దాటుతుండటంతో ప్రజలు ఇళ్ల నుండి బయటకు రావడానికి జంకుతున్నారు. రాష్ట్రంలో దాదాపు 20 జిల్లా ల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవడంతో, హైదరాబాద్ వాతావరణ…

పాకిస్తాన్ కు అభినందనలు ..!

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మంగళవారం ఇరాన్ ను ఉద్దేశిస్తూ “ఒక నాగరికత పూర్తిగా అంతరించిపోతుంది” అని చేసిన బెదిరింపు ప్రకటన ప్రపంచవ్యాప్తంగా పెను సంచలనాన్ని సృష్టించింది. ఒక పురాతన సంస్కృతిని, దేశాన్ని నాశనం చేస్తామనే ఇటువంటి హెచ్చరికలు మానవతావాదులను, చరిత్రకారులను తీవ్ర ఆందోళనకు గురి చేశాయి. మంగళవారం రాత్రి మొత్తం ..భారతీయ కాలమానం ప్రకారం..…