Category ఎడిటోరియల్

వ్యవస్థ వైఫల్యానికి హెచ్చరిక ..!

భారత ప్రజాస్వామ్య చరిత్రలో కొన్ని రోజులు కేవలం క్యాలెండర్ తేదీలుగా మిగిలిపోవు. అవి ఒక తరం ఆవేదనకు, ఆకాంక్షకు, ఆత్మగౌరవానికి ప్రతీకలుగా నిలుస్తాయి. సోమవారం న్యూ దిల్లీలో కనిపించిన దృశ్యం అలాంటిదే. దేశ అధికార కేంద్రంగా పేరొందిన ల్యూటెన్స్ దిల్లీ ప్రాంతం ఒక్కసారిగా యువత, విద్యార్థులు, నిరుద్యోగుల జనప్రవాహంతో నిండిపోయింది. పార్లమెంట్ వైపు వెళ్లే ప్రతి…

కేవ‌లం ఒక్క సంఘ‌ట‌న‌పై ఇంత రాజ‌కీయ ర‌చ్చ అవ‌స‌ర‌మా?

హైదరాబాద్ సైదాబాద్‌లోని ఒక ప్రైవేట్ పాఠశాలలో రెండో తరగతి హిందూ విద్యార్థి డైరీలో ఉపాధ్యాయురాలు ఇస్లామిక్ ప్రార్థనలైన ‘కల్మా’, ‘సూరహ్ ఫాతిహా’ చదువుకురావాలని హోమ్‌వర్క్ రాయడం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. ఒక మతానికి చెందిన ఆచారాలను, ప్రార్థనలను అన్యమత విద్యార్థులపై బలవంతంగా రుద్దడం అక్షరాలా రాజ్యాంగ విరుద్ధం, విద్యావ్యవస్థ మౌలిక సూత్రాలకే గొడ్డలిపెట్టు. ఈ ఘటనపై…

కాళేశ్వరంపై కోర్టు నోటీసుల వేడి!!

కాళేశ్వరం ప్రాజెక్టు వివాదం, దాని పునరుద్ధరణపై న్యాయవాది శ్రీరాంభట్ల శరత్ కుమార్ దాఖ‌లు చేసిన రిట్ పిటిషన్ పై విచార‌ణ జ‌రిపిన తెలంగాణ హైకోర్టు (జస్టిస్ బి. విజయ్‌సేన్ రెడ్డి బెంచ్), ఈనెల 15న కేంద్ర ప్రభుత్వానికి (కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ), రాష్ట్ర ప్రభుత్వానికి మరియు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్‌డీఎస్ ఏ)…

మళ్లీ ద్రవ్యోల్బణం ముప్పు… విధాన నిర్ణేతలకు హెచ్చరిక

భారత ఆర్థిక వ్యవస్థ గత కొంతకాలంగా ద్రవ్యోల్బణాన్ని అదుపులోకి తెచ్చే దిశగా ప్రయాణిస్తున్నట్లు కనిపించినా, తాజా గణాంకాలు విధాన నిర్ణేతలకు మరోసారి ఆందోళన కలిగిస్తున్నాయి. మంగళవారం విడుదలైన ప్రభుత్వ గణాంకాల ప్రకారం, 2026 జూన్‌లో హోల్ సేల్ ధరల సూచీ వార్షిక ప్రాతిపదికన 9.9 శాతం పెరిగింది. దీనికి ఒక రోజు ముందు విడుదలైన వినియోగదారుల…

వానలు పడేట్లులేవు.. కుదేలవుతున్న రైతాంగం

వానాకాలంలో ఎండలు కాస్తున్నాయి. ప్రాజెక్టుల్లో నీళ్ళు అడుగంటాయి. వేసిన పంటలు ఎండిపోతున్నాయి. దిక్కుతోచని స్థితిలో ఆకాశంవైపు చూస్తూ దిగాలుపడుతున్న ప్రజలు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితి పరిస్థితి ఇది. నైరుతి రుతుపవనాల ప్రభావం ఆశించిన స్థాయిలో లేకపోవడం, లెనినో ప్రభావం కారణంగా వర్షాభావ పరిస్థితి నెలకొందని శాస్త్రవేత్తలు చెబుతున్న తీరు చూస్తే వర్షాలపైన ఆశవదులుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.…

పార్ల‌మెంట్ ముందుకు రానున్న‌ 130వ రాజ్యాంగ స‌వ‌ర‌ణ బిల్లు!!

బీజేపీ ఎంపీ అపరాజిత సారంగి నేతృత్వంలోని  పార్లమెంటరీ సంయుక్త కమిటీ (జేపీసీ) కమిటీ, జూలై 17న సమావేశమై  130వ రాజ్యాంగ సవరణ బిల్లుకు సంబంధించి ముసాయిదా నివేదికను అధికారికంగా ఖరారు చేసిన త‌ర్వాత అదేరోజు లోక్‌స‌భ స్పీక‌ర్‌కు స‌మ‌ర్పించ‌నుంది. కమిటీ సిద్ధం చేసిన కొన్ని సిఫార్సులపై అసంతృప్తిగా ఉన్న కమిటీ సభ్యులు అసదుద్దీన్ ఒవైసీ, సుప్రియా…

స‌ర్ ప్ర‌క్రియ‌కు స‌వాల‌క్ష అడ్డంకులు! ఒత్తిడిలో బీఎల్ ఓలు!!

SSR-2026 Voter List Revision in Telangana Faces Major Challenges at the Ground Level

తెలంగాణలో ప్రస్తుతం జరుగుతున్న వోటర్ల జాబితా ప్రత్యేక ముమ్మర సవరణ (స‌ర్‌-2026) ప్రక్రియ క్షేత్రస్థాయిలో తీవ్ర అడ్డంకులను ఎదురుకుంటున్నది.. ప్రజాస్వామ్యానికి పట్టుకొమ్మ లాంటి స్వచ్ఛమైన వోటర్ల జాబితాను తయారు చేయడంలో బూత్ స్థాయి అధికారులు (బీఎల్ ఓ) కీలక పాత్ర పోషిస్తారు. అయితే, ప్రస్తుతం రాష్ట్రంలోని బీఎల్ఓలు ఎదుర్కొంటున్న బహుముఖ ఒత్తిళ్లు, సాంకేతిక లోపాలకు తోడు…

పోలీసుల నిర్లక్ష్యం ఆరుగురి ప్రాణాలు తీసింది

Shabad Tragedy: Six Lives Lost in a Horrific Incident That Shocked Telangana

రంగారెడ్డి జిల్లా షాబాద్‌లో శుక్రవారం రాత్రి  ఆరుగురు ప్రాణాలను బలిగొన్న దారుణం తెలంగాణ సమాజాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. పోక్సో కేసు నమోదైందన్న ఆగ్రహంతో ఒక వ్యక్తి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురిని అత్యంత కిరాతకంగా హత్య చేయడమే కాకుండా, తన భార్య, ఇద్దరు చిన్నారులను కూడా హతమార్చడం మానవత్వానికే మచ్చ తెచ్చిన ఘటన. అయితే ఈ…

గిరిజ‌న ప్రాంతాల గ‌నుల‌ను సింగ‌రేణికి కేటాయించాలి!

తెలంగాణ ఆర్థిక, ఇంధన రంగానికి జీవనాడి అయిన సింగరేణి కాలరీస్ (ఎస్‌సీసీఎల్) చుట్టూ రాజకీయం మరోసారి హీటెక్కింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని తాడిచర్ల-2 ఓపెన్ కాస్ట్ బొగ్గు బ్లాక్ మైనింగ్ లీజుకు కేంద్ర ప్రభుత్వం అనుమతులు మంజూరు చేయడం ఈ వివాదానికి మూలకారణం. కేంద్రం వేలం లేకుండా నేరుగా సింగరేణికే కేటాయించిందని కేంద్ర మంత్రి కిషన్…